Webdunia - Bharat's app for daily news and videos

Install App

జ్వరం వచ్చినపుడు చికెన్ తింటే ఏమవుతుంది?

Webdunia
శనివారం, 18 సెప్టెంబరు 2021 (12:55 IST)
మనిషి ఆరోగ్యానికి మంచి ఆహారం చాలా అవసరం. అయితే కల్తీ ఎక్కువ పెరగడంతో ఫుడ్​లో క్వాలిటీ తెలియట్లేదు. ఇక కొరియర్​ సర్వీసులు, ఫుడ్ కంపెనీలు ఎక్కువవడంతో ఇంట్లో వండుకోవడం కూడా చాలామంది తగ్గించేశారు. జ్వరం వచ్చినప్పుడు ఎలాంటి ఆహారం తీసుకోవాలనే ప్రశ్న రోగులను వేధిస్తూ ఉంటుంది.
 
మనిషి ఆరోగ్యానికి మంచి ఆహారం చాలా అవసరం. అయితే కల్తీ ఎక్కువ పెరగడంతో ఫుడ్​లో క్వాలిటీ తెలియట్లేదు. ఇక కొరియర్​ సర్వీసులు, ఫుడ్ కంపెనీలు ఎక్కువవడంతో ఇంట్లో వండుకోవడం కూడా చాలామంది తగ్గించేశారు. ఇలాంటివే అనారోగ్యాలకు దారి తీస్తున్నాయి. మనిషి బలహీనంగా ఉన్న సమయంలోనూ.. ఏదైనా వ్యాధి బారినపడినప్పుడు న్యూట్రియంట్స్ అన్నీ ఉండే మంచి బ్యాలెన్స్డ్ ఆహారం తీసుకోవడం చాలా అవసరం.

అలా తీసుకున్నప్పుడే మన శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. నీరసం తగ్గి.. మళ్లీ తిరిగి శక్తివంతులౌతారు. జ్వరం వచ్చినప్పుడు కూడా వైద్యులు కొద్దిగా లైట్ ఫుడ్ తీసుకోమని చెబుతారు. లైట్ ఫుడ్ తీసుకుంటే అరుగుదల మంచిగా ఉంటుందని.. దాని వల్ల ఎలాంటి సమస్య ఉండదు అని వారు అలా చెబుతారు.

జ్వరం వచ్చినప్పుడు ఎలాంటి ఆహారం తీసుకోవాలనే ప్రశ్న రోగులను వేధిస్తూ ఉంటుంది. జ్వరం వచ్చినప్పుడే కాదు జ్వరం  తగ్గినప్పుడు కూడా ఆహారం విషయంలో జాగ్రత్త వహించాలి.
 
పప్పులు బెటర్​
జ్వరం లేదా వైరల్ ఇన్‌ఫెక్షన్లు రక్తంపై ఎటాక్ చేస్తాయి. జ్వరం వస్తే పోషకాలు అధికంగా ఉన్న ద్రవాహారం తీసుకోవాలి. సూప్స్, కొబ్బరి నీళ్లు, మజ్జిగ, పండ్ల రసాలు తీసుకోవడం ఉత్తమం. జామ, బొప్పాయి, నారింజ, పుచ్చకాయ, స్ట్రాబెర్రీ లాంటి పండ్లు తీసుకుంటే వాటిలో ఉండే విటమిన్లు రోగ నిరోధక వ్యవస్థను పటిష్టం చేయడంతో పాటు ఇన్‌ఫెక్షన్ల ను తట్టుకునేలా చూస్తాయి.

పాలు, పెసర, మొలకెత్తిన గింజలు, కందిపప్పు లాంటి ఆహారాలు జ్వరం వచ్చిన సమయంలో తీసుకుంటే శరీరంలో ప్రోటీన్లు పెరుగుతాయి. మరీ నీరసంగా ఉంటే తక్షణ శక్తిని ఇచ్చే ఆహార పదార్థాలను తీసుకోవడం మంచిది.
 
 
అన్నం తప్పనిసరి
అన్నం, బెల్లం, తేనె, అరటిపండ్లు తక్షణ శక్తిని ఇచ్చి నీరసాన్ని తగ్గిస్తాయి. జ్వరం వచ్చిన సమయంలో, తరువాత చిన్న పిల్లలు ఆహారంతో పాటు లిక్విడ్ ఫుడ్ తీసుకోవాలి. అల్పాహారంతో పాటు ఒక గుడ్డు తింటే శరీరానికి కావాల్సిన పోషకాలు అన్నీ అందుతాయి. ఉదయం పూట పాలతో పాటు నాలుగు ఖర్జూరాలు తీసుకుంటే మంచిది. రాజ్మా, శనగలు, రాగితో చేసిన లడ్డూలను స్నాక్స్ రూపంలో తీసుకోవడం ఉత్తమం.
 
జ్వరం వచ్చినప్పుడు మాంసాహారం తింటే  అది మనకు ప్రమాదమని  చాలామంది అంటున్నారు. మటన్, చికెన్, చేపలు వంటి వాటిని తినడం వలన ఆరోగ్యం చెడిపోతుందని అంటున్నారు. కాని దీనిని ఎవరూ పట్టించుకోకుండా నాన్ వెజ్ పై ఎక్కువగా ఇష్టం ఉన్నవారు  తింటూనే ఉంటారు.

మరికొందరైతే  కనీసం దాని జోలికి కూడా పోరు. సాధారణంగా మనకు జ్వరం వచ్చినప్పుడు ఈ చికెన్ లాంటి ఫుడ్ తింటే పచ్చకామెర్ల వ్యాధులు వస్తాయని అంటుంటారు. మనకు ఫీవర్ వచ్చినప్పుడు  జీర్ణక్రియ సరిగా పని చేయదు కాబట్టి వైద్యులు కూడా నాన్ వెజ్ తినకూడదంటారు.

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

తర్వాతి కథనం
Show comments