Webdunia - Bharat's app for daily news and videos

Install App

పండ్లు, కూరగాయలు శుభ్రంగా కడిగి తినకపోతే..?

Webdunia
గురువారం, 12 సెప్టెంబరు 2019 (11:36 IST)
పండ్లను మార్కెట్ నుంచి తెచ్చుకుని.. పొడిదుస్తులతో తుడిచేసి కట్ చేసి లాగించేస్తున్నారా? అయితే ఇక జాగ్రత్తపడండి. యాపిల్స్‌, ద్రాక్ష, చెర్రీస్‌, టమాటా, దోసకాయ, మామిడి, స్ట్రాబెర్రీ, అరటి పండు ఇలా పలు రకాల పండ్లు, కూరగాయలకు రంగు వచ్చేందుకు, పండేందుకు రసాయనాలు వాడుతున్నారు. వాటిని తినడం వల్ల హార్మోన్ల అసమతుల్యత, నాడీ వ్యవస్థ దెబ్బతినడం, క్యాన్సర్‌ వంటి రోగాలకు దారితీస్తాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. 
 
ఇలా శుభ్రం చేయని పండ్లను తీసుకోవడం ద్వారా పిల్లల్లో జ్ఞాపకశక్తి తగ్గుతుంది. పండ్లు, కూరగాయలు ఇంటికి తెచ్చినప్పుడు గోరువెచ్చని నీటిలో కొద్ది సేపు నానబెట్టిన తరువాత గుడ్డతో తుడిచేసిన తరువాత వాటిని తినాలి. ఏ కాలంలో దొరికే పండ్లను అప్పుడే తినాలి. 
 
యాపిల్‌లో ఎక్కువగా మెరుపు కన్పిస్తే మైనపు పూత ఉన్నట్లే. గోటితో పండుపై గీకితే అంటుకుంటుంది. ఒకవేళ ఇంటికి తెచ్చినట్లైతే చాకుతో పైన చెక్కినా చాలు. అనుమానం ఉంటే పండుపై వేడి నీళ్లు పోస్తే తెలిసిపోతుంది. మైనపు పూత పోవాలంటే పండును బాగా కడగాలి. చాకుతో తొక్కను మొత్తం తీసి వేసి అప్పుడే తినాలి. లేదంటే జీర్ణకోశ వ్యాధులు వస్తాయి. పిల్లలు, వృద్ధులు, గర్భిణులకు మరింత ప్రమాదకరం. బాగా పండినవి, తొడిమ తొలగకుండా ఉన్న అరటి పండ్లను మాత్రమే కొనుగోలు చేయాలని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments