Webdunia - Bharat's app for daily news and videos

Install App

పండ్లలో రారాజు అనాస, అధికంగా తింటే ఏమవుతుందో తెలుసా?

Webdunia
శనివారం, 17 ఏప్రియల్ 2021 (19:15 IST)
అనాస లేదా పైనాపిల్ ఆరోగ్యానికి చేసే మంచి చాలా వుంది. ఐతే అది మితిమీరి తీసుకుంటే మాత్రం అనారోగ్య సమస్యలు తలెత్తే ఆస్కారం లేకపోలేదు. అనాస పండ్లు సురక్షితం అయినప్పటికీ వీటిని అధికంగా తీసుకోవడం వల్ల రక్తం పలచబడటానికి కారణం కావచ్చు. ఎంజైమ్ బ్రోమెలైన్ ఉండటం దీనికి కారణం. కాబట్టి అనాసను మోతాదుకి మించి తినకూడదు. 
 
అలాగే దీనిని అధికంగా తీసుకోవడం వల్ల అందులో వున్న బ్రోమెలైన్ కారణంగా ఉబ్బసం సమస్య తలెత్తే అవకాశం వుంది. తల్లిపాలు ఇచ్చేవారు అనాస పండుకి దూరంగా వుండటం మంచిదని వైద్య నిపుణులు చెపుతున్నారు.
 
అనాస రక్తంలో చక్కెర స్థాయిని పెంచుతుంది. కాబట్టి యాంటీ డయాబెటిక్ ఔషధాలతో పాటు అనాస లేదా దాని సప్లిమెంట్లను తీసుకునేటప్పుడు రక్తంలో గ్లూకోజ్ స్థాయిని పర్యవేక్షించడం మంచిది.
 
ఇంకా అనాస పండు వల్ల కలిగే ఇతర ప్రతికూలత ఫలితాలు ఏమిటంటే.. కడుపులో గడబిడగా వుండటం. విరేచనాలు, గొంతులో వాపు, రుతు సమస్యలు, వికారంగా వుండటం వంటివి కూడా తలెత్తవచ్చు.

సంబంధిత వార్తలు

మే 17 నుంచి 19 వరకు శ్రీ పద్మావతి శ్రీనివాస పరిణయోత్సవం

నెల్లూరు టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డికి ఓటు వేసిన వైకాపా ఎమ్మెల్యే!!

తెలంగాణ ఏర్పడి జూన్ 2 నాటికి 10 సంవత్సరాలు.. అవన్నీ స్వాధీనం

ఏపీ సీఎస్, డీజీపీలకు కేంద్ర ఎన్నికల సంఘం సమన్లు!

ఘోరం, క్రికెట్ ఆడుతుండగా యువకుడి తలపై పడిన పిడుగు, మృతి

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

తర్వాతి కథనం
Show comments