Webdunia - Bharat's app for daily news and videos

Install App

బరువు తగ్గాలంటే.. రాత్రి పూట ఎలాంటి ఆహారం తీసుకోవాలంటే...

Webdunia
శుక్రవారం, 2 ఏప్రియల్ 2021 (13:22 IST)
చాలా మంది అధికబరువు, ఊబకాయంతో బాధపడుతుంటారు. ఇలాంటి అధిక బరువును తగ్గించుకునేందుకు పడరాని పాట్లు పడుతుంటారు. దీనికితోడు ఉరుకుల పరుగుల జీవితంలో సమయం సందర్భం లేకుండా ఆకలి తీర్చుకుంటారు. అలా ఆరగించడం వల్ల పలు రోగాలను కొని తెచ్చుకున్నట్టు అవుతుంది. 

ముఖ్యంగా, ఆ సమయానికి దొరికింది ఒదో ఒకటి తిని.. రోగాలతోపాటు ఊబకాయం బారిన పడుతున్నారు. అయితే మన జీవక్రియ బరువుపై ఆధారపడి ఉంటుంది. జీవక్రియ సాఫిగా సాగాలంటే.. బరువు తక్కువగా ఉండటం మంచిదని నిపుణులు పేర్కొంటున్నారు. అలాగే, రాత్రి సమయాల్లో నూనే పదార్థాలను దూరం చేయాలి. ఎందుకంటే వాటివల్ల ఎక్కువ అనర్థాలు కలుగుతాయి. దీంతోపాటు బరువు కూడా పెరుగుతారు.

రాత్రివేళల్లో చాలామంది ఎక్కువగా తిని నిద్రపోతుంటారు. ఇలా చేయడం వల్ల బరువు మరింత పెరుగుతారు. అయితే.. బరువు తగ్గాలని అనుకునేవారు రాత్రిపూట మితంగానే ఆహారం తీసుకోవాలి. లేకపోతే అన్నం, రోటి పదార్థాలను దూరం చేసి ఇలాంటి స్నాక్స్ తినాలని ఆహార నిపుణులు సలహా ఇస్తున్నారు. 

ముఖ్యంగా, త్వరగా జీర్ణమయ్యే పండ్లను తీసుకోవడం ఉత్తంమ. అలాంటివాటిలో అరటి పండు ఉత్తమం. ఇందులో ఉండే కార్బోహైడ్రేట్లు త్వరగా జీర్ణమవుతాయి. దీంతో బరువు పెరిగే అవాకశమే లేదు. 

అలాగే, కూరగాయల్లో దోసకాయ, క్యారెట్, బీట్‌రూట్ లాంటివి తినడం మంచింది. వీటితోపాటు శనగలు లాంటివి తీసుకోవడం ఉత్తమం. శనగలలో కార్బోహైడ్రేట్లు, కొవ్వులు, ప్రోటీన్లతోపాటు బీ విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీర జీవక్రియకు బాగా సహకరించి బరువును తగ్గిస్తాయి.

పెరుగులో పండ్లని కలుపుకుని తింటే చాల మంచిదని నిపుణులు పేర్కొంటున్నారు. అయితే పెరుగుతోపాటు ఆపిల్, ద్రాక్ష, దానిమ్మ, అరటి పండు లాంటివి కలిపి తింటే ఇంకా మంచిది. దీనివల్ల ఆకలి వేయదని.. దీంతోపాటు ఆరోగ్యానికి మంచిదని నిపుణులు పేర్కొంటున్నారు.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments