Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాత్రిపూట ఛాటింగ్‌లు చేస్తున్నారా? ఫేస్ బుక్ చూస్తున్నారా? ఐతే గోవిందా..?

ఉదయం నుంచి రాత్రి నిద్రపోయేంతవరకు ఫోన్లు, ట్యాబ్లు, సిస్టమ్‌లలో కూర్చుని కాలం గడిపేస్తుంటారు. అయితే రాత్రి నిద్రపోయేందుకు గంటకు ముందైనా.. స్మార్ట్ ఫోన్లను ఉపయోగించవద్దని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. రా

Webdunia
శుక్రవారం, 10 మార్చి 2017 (12:43 IST)
ఉదయం నుంచి రాత్రి నిద్రపోయేంతవరకు ఫోన్లు, ట్యాబ్లు, సిస్టమ్‌లలో కూర్చుని కాలం గడిపేస్తుంటారు. అయితే రాత్రి నిద్రపోయేందుకు గంటకు ముందైనా.. స్మార్ట్ ఫోన్లను ఉపయోగించవద్దని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. రాత్రిపూట నిద్రకు ముందు టీవీలు చూస్తూ, ఫోన్లతో కాలం గడుపుతూ ఉన్న వారికి అనారోగ్య సమస్యలు తప్పవని వైద్యులు హెచ్చరిస్తున్నారు. 
 
బరువు పెరగడానికి కారణం.. నిద్రించేముందు మొబైల్, లాప్ టాప్.. ఇతరత్రా వాడుతుండమేనని పరిశోధనల్లో కూడా తేలింది. కృతిమ లైట్ మన ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపిస్తుందని, కృత్రిమ లైట్‌ వాడకం క్యాలరీలను ఖర్చు చేసే బ్రౌన్‌ సెల్స్‌మీద ప్రభావం చూపి విపరీతంగా బరువు పెరగడానికి దోహదపడుతుందని పరిశోధకులు అంటున్నారు. 
 
ఇంకా చెప్పాలంటే.. ఫేస్ బుక్ చూడటం, ఛాటింగ్‌లు చేయడం.. యూట్యూబ్‌లో వీడియోలు చూస్తుండటం ద్వారా ఆ వెలుగులోనే రాత్రి సమయంలో ఎక్కువగా కళ్లకు పనిచెప్తారు. అంతేగాకుండా పనిచేసుకుంటూ ఏదో ఒక జంక్ ఫుడ్ తీసుకుంటుంటారు. ఈ సమయంలో తీసుకొనే ఆహారానికి పరిమితులుండవు. అందుకే ఒబిసిటీ తప్పదు. ఇంకా నిద్రించేందుకు ముందు.. ఇలాంటి వస్తువులకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని పరిశోధకులు అంటున్నారు. ఇంకా రాత్రిపూట ఫోన్లను ఉపయోగించడం ద్వారా కళ్లకు కూడా దెబ్బేనని వారు హెచ్చరిస్తున్నారు. 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

అవసరమైతే ఎంపీలతో చేతులు కలుపుతాం.. పోలవరం కోసం పోరాడతాం.. మిథున్ రెడ్డి

అందుకే మా ఓట్లు తెదేపా అభ్యర్థికి వేశాం: భూమన కరుణాకర్ రెడ్డి కాళ్లపై పడి ఏడ్చిన వైసిపి కార్పొరేటర్లు

టెన్త్ విద్యార్థులకు స్టడీ అవర్‌లో స్నాక్స్... మెనూ ఇదే...

డిప్యూటీ మేయర్‌గా టీడీపీ అభ్యర్థి మునికృష్ణ ఎన్నిక

ఒకే అబ్బాయిని ఇష్టపడిన ఇద్దరమ్మాయిలు.. ప్రియుడి కోసం నడిరోడ్డుపై సిగపట్లు (Video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెడలో మంగళసూత్రం బరువైందమ్మా? భర్తకు తేరుకోని షాకిచ్చిన 'మహానటి'!!

అభిమానులకు జూ.ఎన్టీఆర్ విజ్ఞప్తి.. ఓర్పుగా ఉండాలంటూ ప్రకటన

చిన్న చిత్రాలే పెద్ద సౌండ్ చేస్తున్నాయి.. నిర్మాత రాజ్ కందుకూరి

వెంకట్ పాత్రకు మంచి రెస్పాన్స్ వస్తోంది.. ‘పోతుగడ్డ’ ఫేమ్ ప్రశాంత్ కార్తి

'తండేల్' పక్కన రిలీజ్ చేస్తున్నాం: 'ఒక పథకం ప్రకారం' హీరో సాయి రామ్ శంకర్

తర్వాతి కథనం
Show comments