Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాంసాహారం అందుకు పనికిరాదట..?

Webdunia
శనివారం, 20 అక్టోబరు 2018 (11:49 IST)
ఆహారంలో శాకాహారం ఉత్తమం అంటున్నారు వైద్యులు. శాకాహారం తీసుకుంటే అధిక రక్తపోటునుండి కూడా మనిషి తననిన తాను కాపాడుకోవచ్చునని వైద్యులు సూచిస్తున్నారు. పౌష్టికాహారమే శరీరాన్ని మనస్సును ఆరోగ్యంగా వుంచుతుంది. భోజనంలో శరీరానికి కావలసిన ఖనిజ పదార్థాలు, ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్లు, విటమిన్లతోపాటు పోషకపదార్థాలుండాలి. 
 
సమపాళ్ళలో తీసుకునే శాకాహారం శరీరానికి అన్నిరకాల పోషకాలను అందిస్తుంది. దీంతో గుండెజబ్బులు, క్యాన్సర్, అధిక రక్తపోటు, మధుమేహం, కీళ్లనొప్పులు ఇతర జబ్బులనుండి కూడా బయటపడగలుగుతామని వైద్యులు చెప్తున్నారు. 
 
మాంసాహారం అధికంగా తీసుకునేవారిలో అధిక రక్తపోటును నివారించే అమినో ఆమ్లాలుండవు. అదే శాకాహారంలో అమినో ఆమ్లాలు అధికంగా వుంటాయి. ఈ అమినో ఆమ్లాలు రక్తపోటును నివారిస్తాయి. కాయగూరల్లో అమినో ఆమ్లంతోబాటు మెగ్నీషియం కూడా వుంటుందని ఇది రక్తపోటును క్రమబద్దీకరిస్తుందని పరిశోధకులు తెలిపారు. ఇంతేకాకుండా మాంసాహారుల్లో ఫైబర్ శాతం కూడా తక్కువగా వుంటుందని ఇప్పటికే నిర్వహించిన పరిశోధనల్లో తేలింది. 
 
ఫైబర్ మనకు ధాన్యాలలో అధికంగా లభిస్తుంది. పప్పులు, పండ్ల రసాలు, ఫ్రూట్ సలాడ్‌లలో అధికంగా లభిస్తుంది. ఇవి శరీర బరువును కూడా క్రమబద్ధీకరిస్తాయి. మాంసాహారం ఎక్కువగా తీసుకుంటే ఊబకాయం పెరిగిపోతుం. కొవ్వుకూడా అధికంగా పేరుకు పోతుంది. ముఖ్యంగా శరీరానికి కార్బోహైడ్రేట్‌లు కూడా ఎంతో అవసరం. మాంసాహారంలో కార్బోహైడ్రేట్‌లు వుండవు. ఇది బ్రెడ్, రొట్టెలు, అరటిపండు, బంగాళాదుంపల్లో ఎక్కువగా దొరుకుతుంది.  
 
శరీరంలో రక్తం వృద్ధికి మాంసాహారం పనికిరాదు. శరీరంలో రక్త శాతం పెరగాలంటే ఆకుకూరలు, పుదీనా, బెల్లం తదితరాలు తీసుకోవాల్సివుంటుంది. మాంసాహారం నుంచి లభించని బలం పుష్టికరమైన శాఖాహారం నుండి లభిస్తుంది. మాంసాహారం అధికంగా తీసుకుంటే ఆవేశం, ఒత్తిడి తప్పవు. అందుకే శాకాహారానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని.. ఇలా చేస్తే ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూర్చిన వారవుతారని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

leopard: తల్లిదండ్రులతో నిద్రస్తున్న మూడేళ్ల చిన్నారిని లాక్కెళ్లిన చిరుత.. ఆ తర్వాత ఏమైందంటే?

Chandra Babu: నారావారిపల్లెకు స్కోచ్ అవార్డు లభించింది: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు

వివాహేతర సంబంధం.. 35 ఏళ్ల వ్యక్తిని భార్య, ప్రియుడు, సహచరుడు గొంతుకోసి చంపేశారు..

ఎర్రచందనం స్మగ్లర్లకు ఐదేళ్ల జైలు శిక్ష, రూ.6 లక్షల జరిమానా విధించిన కోర్టు

Nellore: భారీ వర్ష హెచ్చరికలు.. నెల్లూరు ప్రజలకు అలెర్ట్ - చేపల వేటకు వెళ్ళొద్దు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వారిదే : అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు

పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్ స్పిరిట్ లో కనిపించనున్నారా !

పెంచల్ రెడ్డి జీవిత కథతో ఆపద్భాంధవుడు చిత్రం: భీమగాని సుధాకర్ గౌడ్

Chiranjeevi: చిరంజీవితో విశ్వంభర లో సత్యలోకం చూపిస్తున్న వసిష్ఠ

Gautham Tinnanuri: దర్శకుడు గౌతమ్ తిన్ననూరి డైలమాలో వున్నారా !

తర్వాతి కథనం
Show comments