Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆరెంజ్ పండ్లను అతిగా తీసుకుంటే..? ఒక రోజులో నాలుగైదు తీసుకుంటే..?

Webdunia
మంగళవారం, 8 నవంబరు 2022 (13:50 IST)
ఆరెంజ్ పండ్లను అదే పనిగా తీసుకుంటున్నారా.. అయితే ఈ కథనం మీ కోసమే. నీరసంగా ఉన్నప్పుడు, శరీరం సహకరించనప్పుడు కాస్త బలం కోసం నారింజ తినమని సిఫారసు చేస్తారు వైద్యులు. అయితే, కొందరు అవసరమైన దానికంటే ఎక్కువగా తింటుంటారు. అది అధిక పొటాషియం స్థాయిలు ఉన్నవారికి సమస్యలను కలిగిస్తుంది. 
 
శరీరంలో ఇప్పటికే తగినంత పొటాషియం ఉంటే.. అది హైపర్‌కలేమియా అనే తీవ్రమైన పరిస్థితికి దారి తీస్తుంది. వాస్తవానికి, నారింజలో ఆమ్లత్వంగా అధికంగా ఉంటుంది. దీని కారణంగా గ్యాస్ట్రోఎసోఫాగియల్ రిఫ్లక్స్ వ్యాధితో బాధపడుతున్న వ్యక్తులు మరింత ఇబ్బంది పడుతారు. అందుకే, ఒక రోజులో 1 లేదా 2 నారింజలను మాత్రమే తినాలని సూచిస్తున్నారు. 
 
ఆరెంజ్‌లో తగినంత విటమిన్ సి, నీరు ఉంటుంది. చలికాలంలో దీన్ని తినడం వల్ల శరీరం హైడ్రేట్‌గా ఉంటుంది. దీంతో పాటు రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. అయితే, ఆరెంజ్‌తో ఆరోగ్యం బాగుంటుంది కదా అని అతిగా తిన్నా కూడా కష్టమేనట. 
 
ఒక రోజులో నాలుగైదు నారింజలను తీసుకుంటే.. అది శరీరంలో ఫైబర్ కంటెంట్‌ని పెంచుతుంది. శరీరంలో పీచు పదార్థం ఎక్కువగా ఉంటే.. ఉదర సంబంధిత సమస్యలు పెరుగుతాయి. 
 
దీనివల్ల పొత్తికడుపు నొప్పి, కడుపు ఉబ్బరం, వికారం వంటి సమస్యలు వస్తాయి. అవసరమైన దానికంటే ఎక్కువ విటమిన్ సిని ఎప్పుడూ తినకూడదు. ఇది గుండెల్లో మంట, వాంతులు, నిద్రలేమి, గుండెపోటు వంటి సమస్యలను కలిగిస్తుందని వైద్యులు చెప్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

పదో తరగతి పరీక్ష రాసి ఇంటికివెళుతూ అనంతలోకాలకు చేరిన విద్యార్థిని!! (Video)

ప్రేమించినోడితో కుమార్తె వెళ్లిపోతుంటే యువకుడి కాళ్లపై పడి దణ్ణంపెట్టిన తండ్రి... ఎక్కడ? (Video)

ఏపీ సీఎం చంద్రబాబే నాకు స్ఫూర్తి.. రాయలసీమ సంపన్న ప్రాంతంగా మారాలి: పవన్

YSRCP MLAs: శాసనసభ్యులకు అరకు కాఫీతో పాటు ఐప్యాడ్‌లు, గిఫ్ట్ హ్యాంపర్స్

మరిదిపై మోజు పడిన వొదిన: ఆమె కుమార్తెను గర్భవతిని చేసిన కామాంధుడు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sridevi: అమ్మా.. కాకినాడ శ్రీదేవి.. కృతిశెట్టి, శ్రీలీల, వైష్ణవిలా కావొద్దు.. కాస్త వెరైటీగా ఆలోచించు..?

Ivana: లవ్ టుడే.. ఆ కళ్ళతో కట్టిపారేసింది.. శ్రీదేవి, మీనా, రాశి బాటలో ఇవానా!?

Tamannaa: నాగసాధువు తమన్నా ప్రమోషన్ కోసం హైదరాబాద్ విచ్చేసింది

SS Rajamouli: మహేష్ బాబు సినిమాకు సంగీతం ఒత్తిడి పెంచుతుందన్న కీరవాణి

మలయాళ మార్కో దర్శకుడు హనీఫ్ అదేనితో దిల్ రాజు చిత్రం

తర్వాతి కథనం
Show comments