Webdunia - Bharat's app for daily news and videos

Install App

వేసవిలో పెరుగును మరిచిపోకండి..

Webdunia
ఆదివారం, 14 ఏప్రియల్ 2019 (16:58 IST)
వేసవిలో పెరుగును ఏమాత్రం మరిచిపోకండి అంటున్నారు.. ఆరోగ్య నిపుణులు. వేసవిలో పెరుగు తినడం వల్ల ఒంటికి చలువ చేస్తుంది. రోజూ పెరుగు తింటే శరీరానికి అవసరమైన క్యాల్షియం, విటమిన్‌ బి2, బి12, ప్రొటీన్లు, జీర్ణాశయాన్ని ఆరోగ్యంగా ఉంచే బ్యాక్టీరియా లభిస్తాయి. అన్నంతో పాటు పెరుగును తీసుకుని.. జారుగా మజ్జిగలా తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. మజ్జిగ రూపంలో పెరుగును తీసుకోవడం ద్వారా వడదెబ్బ నుంచి తప్పించుకోవచ్చు.  
 
పెరుగులో లభించే బ్యాక్టీరియా అజీర్తి, కడుపు ఉబ్బరం వంటి సమస్యలను తగ్గించి జీర్ణవ్యవస్థను చక్కబెడుతుంది. అంతేగాక పెరుగు మంచి ప్రొబయోటిక్‌గా పనిచేస్తుంది. దీనిలోని బ్యాక్టీరియా వ్యాధికారక క్రిములను నివారించి రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. జీవక్రియలు సవ్యంగా పనిచేసేందుకు ఉపకరిస్తుంది.
 
పొట్ట చుట్టూ కొవ్వు పెరిగేందుకు కారణమయ్యే కార్టిసాల్స్‌ హార్మోన్‌ నిల్వలను పెరగకుండా చూస్తుంది. బరువును అదుపులో ఉంచి, ఊబకాయం బారిన పడకుండా చూస్తుంది. మజ్జిగలో కాస్త కొత్తిమీర తరుగును, చిటికెడు ఉప్పును కలిపి తీసుకోవడం ద్వారా అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు. వేసవి తాపాన్ని తగ్గించుకోవచ్చు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Pic Talk: నారా లోకేష్- పవన్ కల్యాణ్ సోదర బంధం.. అన్నా టికెట్ కొనేశాను..

Pawan Kalyan: పెట్టుబడులను ఆకర్షించడానికి బలమైన శాంతిభద్రతలు కీలకం: పవన్ కల్యాణ్

Independence Day: తెలంగాణ అంతటా దేశభక్తితో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

Stree Shakti: మహిళలతో కలిసి బస్సులో ప్రయాణించిన సీఎం చంద్రబాబు, పవన్, నారా లోకేష్ (video)

ఏపీ అసెంబ్లీ భవనంలో రూ.1.5 కోట్ల వ్యయంతో హై-స్పీడ్ ప్రింటింగ్ యంత్రాలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shwetha Menon: AMMA ప్రెసిడెంట్‌గా తొలి మహిళా నటిగా రికార్డ్

Viswant: భావనను వివాహం చేసుకున్న హీరో విశ్వంత్ దుడ్డుంపూడి

Venkatesh: విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సినిమా మొదలు

ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వారిదే : అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు

పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్ స్పిరిట్ లో కనిపించనున్నారా !

తర్వాతి కథనం
Show comments