Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్మార్ట్‌ఫోన్‌ - కంప్యూటర్ వాడకంతో చిన్నారులకు 'డ్రై ఐ డిసీజ్' ముప్పు

నానాటికీ పెరిగిపోతున్న స్మార్ట్ ఫోన్లు, కంప్యూటర్ వాడకం వల్ల చిన్నారులతో పాటు... యువతీ యువకులకు కూడా 'డ్రై ఐ డిసీజ్' ముప్పు పెరుగుతోందని నేత్ర వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Webdunia
మంగళవారం, 10 జనవరి 2017 (07:04 IST)
నానాటికీ పెరిగిపోతున్న స్మార్ట్ ఫోన్లు, కంప్యూటర్ వాడకం వల్ల చిన్నారులతో పాటు... యువతీ యువకులకు కూడా 'డ్రై ఐ డిసీజ్' ముప్పు పెరుగుతోందని నేత్ర వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవలి కాలంలో పిల్లలు బయటకెళ్లి ఆడుకోవడంకంటే స్మార్ట్‌ ఫోన్లు, కంప్యూటర్ల ముందరే గడపడం ఎక్కువైంది. దీనివల్ల కళ్లు పొడిబారడం సహా పలు వ్యాధులకు కారణం అవుతోందని వారు హెచ్చరించారు. 
 
ఈ మేరకు చిన్నపిల్లల్లో స్మార్ట్‌ఫోన్‌ వాడకంపై దక్షిణ కొరియాలోని ఛుంగ్‌ యాంగ్‌ యూనివర్సిటీ పరిశోధకులు ఓ అధ్యయనం నిర్వహించారు. ఇందులో భాగంగా 916 మంది చిన్నారుల నేత్రాలను పరీక్షించినట్లు తెలిపారు. వీరిని రెండు బృందాలు (పట్టణ, గ్రామీణ ప్రాంతాలు)గా విడదీసి వారి అలవాట్లను అడిగి తెలుసుకున్నారు.
 
వారు చెప్పిన వివరాల ప్రకారం.. పట్టణ ప్రాంతాల్లోని చిన్నారులలో స్మార్ట్‌ఫోన్‌, కంప్యూటర్‌ వాడకం 61.3 శాతంగా ఉండగా, గ్రామీణ ప్రాంతాల్లో 51 శాతం ఉంది. డీఈడీ ముప్పు విషయానికి వస్తే పట్టణ ప్రాంతాల్లోని పిల్లలకు 8.3 శాతం ఉండగా, గ్రామీణ చిన్నారులలో 2.8 శాతంగా ఉందని పరిశోధకులు తెలిపారు. వీరిలో ఎక్కువ మంది డ్రై ఐ డిసీజ్‌తో బాధపడుతున్నట్టు పరిశోధకులు గుర్తించారు. ఇది యుక్తవయసులో ఉన్నప్పుడు ప్రభావం చూపక పోయినప్పటికీ.. వృద్ధాప్యంలో దృష్టిలోపానికి దారితీస్తుందని వారు హెచ్చరించారు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

Big Boss in AP Liquor Scam: ఏపీ మద్యం కుంభకోణం-బిగ్ బాస్ జగన్‌ను జైలుకు పంపాలి సోమిరెడ్డి కామెంట్స్

Leopard : తిరుమలలో చిరుతపులి కదలికలు- భయాందోళనలో భక్తులు- టీటీడీ అలెర్ట్

KTR: తెలంగాణలో రాహుల్ గాంధీ ఈ ప్రాంతాల్లో పర్యటించాలి.. కేటీఆర్ డిమాండ్

Telangana: మావోయిస్టులతో చర్చలు జరపండి.. హింస వద్దు.. లెఫ్ట్ పార్టీలు

Rahul Gandhi: ఇతరులు ఏమి చెబుతున్నారో వినడం నేర్చుకున్నాను.. రాహుల్ గాంధీ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Retro Promotions: ఘనంగా సూర్య 'రెట్రో' ప్రీ రిలీజ్ వేడుక- విజయ్ దేవరకొండ స్పీచ్ అదుర్స్

చౌర్య పాఠం బాగుందంటున్నారు అందరూ వచ్చి చూడండి : త్రినాథరావు నక్కిన

మైథికల్ థ్రిల్లర్ జానర్‌ లో నాగ చైతన్య 24వ చిత్రం

Srinidhi Shetty: రామాయణంలో సీత క్యారెక్టర్ ని రిజెక్ట్ చేయలేదు: శ్రీనిధి శెట్టి

శర్వా, సంపత్ నంది కాంబినేషన్ చిత్రంలో నాయికగా అనుపమ పరమేశ్వరన్

తర్వాతి కథనం
Show comments