పగటిపూట నిద్రతో మధుమేహం తప్పదా?

Webdunia
శుక్రవారం, 24 జులై 2020 (23:55 IST)
పగటిపూట నిద్రతో మధుమేహం తప్పదని పరిశోధనలో తేలింది. పగటి పూట నిద్రించే వారికి డయాబెటిస్, బరువు పెరగడం, తలనొప్పి, గుండె జబ్బులు, క్యాన్సర్, అర్థరైటిస్ వంటి వ్యాధులు వచ్చే అవకాశముందన్నారు. కనుక రాత్రిపూట తగినంత నిద్రపోయే వారు పగటి పూట నిద్రపోవడం మానుకుంటే మేలని వారు సూచిస్తున్నారు. 
 
రాత్రి పూట సమయానికి నిద్రించేవారిలో అనారోగ్య సమస్యలు వుండవని.. ఒబిసిటీ వేధించదని వైద్యులు చెప్తున్నారు. నైట్ షిఫ్టులు, కంప్యూటర్లు, సెల్ ఫోన్లకు నిద్రను అంకితం చేస్తే.. ఇక అనారోగ్య సమస్యలను కూడా కొనితెచ్చుకున్నట్లేనని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
 
అందుకే రాత్రి పూట 8 గంటల పాటు నిద్రించడం అలవాటు చేసుకోవాలని వారు సూచిస్తున్నారు. రాత్రిపూట నిద్రపట్టకపోతే.. తేలిగ్గా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవాలి. స్పైసీ ఫుడ్‌, బిర్యానీ, చీజ్, పిజ్జా, ఐస్‌ క్రీంలు తినకూడదు.
 
రాత్రి పూట శరీరం విశ్రాంతి తీసుకుంటుంది. అందువల్ల మాంసాహారం లాంటివి తింటే తేలిగ్గా జీర్ణం కావు. అలాగే కాఫీలు, టీలలో ఉండే కెఫిన్‌ వల్ల నిద్ర సరిగా పట్టదు. వీటికి బదులు పాలలో తేనె కలుపుకుని తీసుకోవడం ద్వారా హాయిగా నిద్రపడుతుందని ఆయుర్వేద నిపుణులు చెప్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

జూలై 5న భోగాపురం ఎయిర్ పోర్టు ప్రారంభానికి సన్నాహాలు

నన్ను ఓడించలేకపోతే పేరు మార్చుకుంటానని ఒకాయ అన్నాడు, అలా ఏ కులం వారైనా అంటారా? ముద్రగడకు పవన్ స్ట్రాంగ్ కౌంటర్

TGSRTC: 60 ఎలక్ట్రిక్ బస్సుల్ని రంగంలోకి దించనున్న టీజీఎస్సార్టీసీ

ప్రమాదంలో గాయపడిన మహిళా కానిస్టేబుల్‌ను రక్షించిన బీహార్ మాజీ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్

సైన్యంలో చేరితే రూ.1.33 కోట్ల రుణం నుంచి విముక్తి కల్పిస్తాం : వ్లాదిమిర్ పుతిన్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'దేశీ ప్రిన్సెస్‌'లా మెరిసిపోతున్న జాన్వీ కపూర్

Nani: 150 మిలియన్+ వ్యూస్ తో నాని ది ప్యారడైజ్ ఆయా షేర్ సాంగ్

Devi Sri Prasad: ఎల్లమ్మ చేయడానికి స్ఫూర్తిని ఇచ్చిన గ్రామం వెదురుపాక: దేవిశ్రీ ప్రసాద్

Karthi: ఈ ఏడాది చిత్రాల సందడితో 49వ పుట్టినరోజు జరుపుకుంటున్న కార్తి

కెమెరాతో కథ చెప్పాలి, రీ-రికార్డింగ్‌కి కూడా కథలో స్పేస్ ఉండాలి : కెమెరామెన్ రత్నవేలు

తర్వాతి కథనం
Show comments