బీపీ వ్యాధితో బాధపడేవారు సబ్జాగింజలు తీసుకుంటే?

సబ్జా గింజలను ఒక గ్లాసు నీళ్లలో నానబెట్టుకుని ఆ నీటిని త్రాగితే జీవక్రియలు చురుగ్గా సాగుతాయి. మహిళలకు తప్పకుండా కావలసిని ఫోలేట్‌తో పాటు అందాన్ని ఇనుమడింపచేసి విటమిన్ ఇ కూడా ఇందులో లభిస్తుంది. ఈ విత్తన

Webdunia
బుధవారం, 6 జూన్ 2018 (10:33 IST)
సబ్జా గింజలను ఒక గ్లాసు నీళ్లలో నానబెట్టుకుని ఆ నీటిని త్రాగితే జీవక్రియలు చురుగ్గా సాగుతాయి. మహిళలకు తప్పకుండా కావలసిని ఫోలేట్‌తో పాటు అందాన్ని ఇనుమడింపచేసి విటమిన్ ఇ కూడా ఇందులో లభిస్తుంది. ఈ విత్తనాలకు కాస్త తడి తగిలినా అవి ఉబ్బిపోతాయి. దీంతో వాటి బరువు పదింతలు పెరిగిపోతుంది.
 
అందుకే వీటిని ఆహారంలో భాగంగా తీసుకుంటే త్వరగ కడుపునిండిన భావన కలిగి మాటిమాటికీ ఆకలేయదు. జిగురులా ఉండే ఈ సబ్జా గింజల్లో ఔషధగుణాలు బోలెడు ఉన్నాయి. పైగా శరీర ఉష్ణోగ్రతను సైతం తగ్గించి మల, మూత్ర సమస్యల్ని నివారిస్తాయి. కేవలం శరీరం లోపలి భాగన్నే కాకుండా బయట భాగాన్ని కూడా కాపడటంలో ఇవి బాగా పనిచేస్తాయి.
 
ఎక్కడైనా దెబ్బలు తగిలినప్పుడు ఈ గింజల్ని బాగా నూరి నూనెలో కలిపి గాయాలకు, పుండ్లపై రాసుకుంటే అవి త్వరగా తగ్గిపోతాయి. తలనొప్పి, మైగ్రేన్ లాంటి సమస్యలు ఎదురైనప్పుడు ఈ గింజల్ని నీళ్లలో కలుపుకుని అవి ఉబ్బిన తరువాత త్రాగితే ఇలాంటి సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చును. మానసికంగా ప్రశాతంగా ఉంటారు. 
 
రక్తాన్ని శుద్ధి చేయడంలో శరీరంలోని మలినాలను తొలగించడానికి సబ్జా గింజలు చాలా ఉపయోగపడుతాయి. శ్వాస సంబంధిత వ్యాధులతో బాధపడేవారు కొన్ని గోరువెచ్చని నీటిలో అల్లం రసం, తేనెవేసి నానబెట్టిన సబ్జా గింజలలో కలుపుకుని తీసుకుంటే శ్వాస సంబంధిత సమస్యలనుండి దూరంగా ఉండవచ్చును. 
 
గొంతులో మంట, ఆస్తమా. జ్వరం వంటి సమస్యలకు సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తీసుకుంటే వీటినుండి విముక్తిచెందవచ్చును. బీపీ అదుపులో ఉండాలంటే ఈ గింజలు తీసుకుంటే మంచిది. వీటిలో ఒమెగా -3 ఫ్యాటీ యాసిడ్లు సాల్మన్ చేపల్లో కంటే ఎక్కువగా లభిస్తాయి. ఈ ఆమ్లాలు ఎక్కువగా తీసుకోవడం వలన హృదయ సంబంధిద సమస్యలు రాకుండా ఉంటాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

రాగిసంగటిలో బొద్దింక ... ఉలిక్కిపడిన హైదరాబాద్ ఆహార ప్రియులు

మరో ఆరు నెలల్లో విద్యుత్ వాహనాల ధరలు తగ్గుతాయ్ : కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ

గెలిచిన తర్వాత పార్టీ మారితే ఇంటికొచ్చి చితక్కొడతాం : భారాస ఎమ్మెల్యే వార్నింగ్

అమ్మవారి వేడుకల్లో భార్యతో కలిసి నృత్యం.. అంతలోనే భర్త అనతలోకాలకు...

సీనియర్ ఎన్టీఆర్ చరిత్ర సృష్టించారు.. మూడేళ్లలో రూ.2.41 కోట్లు సంపాదించాను.. ప్రశాంత్ కిషోర్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

2025లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా పవన్ కళ్యాణ్ "ఓజీ"

నాకేం కాలేదు.. అంతా బాగానే వుంది... మా కారుకు దెబ్బ తగిలింది : విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ కారు ప్రమాదం.. హీరో సురక్షితం

Balakrishna: చిరంజీవి, బాలక్రిష్ణ సినిమాలు ఆగిపోవడానికి వారే కారకులా!

Naga Shaurya: మాస్ హీరోగా నిలబడేందుకు కష్టపడుతున్న నాగ శౌర్య

తర్వాతి కథనం
Show comments