Webdunia - Bharat's app for daily news and videos

Install App

పరుగులు పెడితే.. డయాబెటీస్ రాదంతే...

Webdunia
శనివారం, 3 నవంబరు 2018 (11:20 IST)
పరుగులు పెడుతున్నారా? అయితే డయాబెటిస్ రాదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఆఫీసుల్లో కంప్యూటర్ల ముందు.. ఇంటికొస్తే టీవీల ముందు కూర్చునే వారి సంఖ్య బాగా పెరిగిపోతుంది. ఇందుకు ప్రతిఫలంగా గుండె సంబంధిత వ్యాధులు, మధుమేహం, ఒబిసిటీ ఆవహిస్తున్నాయి. వీటిని దూరం చేసుకోవాలంటే.. పరుగులు తీయాలని వైద్యులు చెప్తున్నారు. 
 
ఆరోగ్యం కోసం ప్రతి ఉదయం పరుగులు తీస్తూ.. వ్యాయామం పేరిట కాస్త శ్రమపడితే.. అనారోగ్య సమస్యలు మాయమవుతాయని వారు సూచిస్తున్నారు. పరుగెత్తేవాళ్లలో డయాబెటీస్‌ రాకుండా ఉండడానికి 12.1 శాతం అవకాశం ఉంటే.. నడిచేవారిలో అది 12.3 శాతంగా ఉంటుందట. నడక అనేది.. గుండెజబ్బుల ప్రమాదాన్ని 9 శాతం మేరకు తగ్గిస్తే.. పరుగెత్తేవాళ్లలో 4.5 శాతం మాత్రమే తగ్గుతుందని ఓ అధ్యయనంలో తేలింది. అందుచేత పరుగులు ఆరోగ్యానికి మేలేనని వైద్యులు చెప్తున్నారు. 
 
అలాగే బీపీ, కొవ్వు వంటి గుండె ఆరోగ్యానికి కీడు చేస్తాయి. అందుచేత ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలను నియంత్రించడంలో నడక, జాగింగ్ ఎంతో ఉపయోగపడుతుంది. బీపీ, కొవ్వు వంటి గుండె ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలను నియంత్రించడంలో పరుగు చేసే మేలును నడక వ్యాయామం కూడా చేస్తుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు

సంతోషిమాత అమ్మవారికి కేజీ బరువున్న వెండి చక్రం

అమెరికాలో తెలుగు టెక్కీ కారు ప్రమాదం నుంచి తప్పించుకున్నా మరో కారు రూపంలో మృత్యువు

Telangana రిజిస్ట్రేషన్లు ఇకపై TS కాదు TG, ఉత్తర్వులు జారీ

ఊపిరి పీల్చుకున్న మంజుమ్మెల్ బాయ్స్‌ నిర్మాతలు

ఏపీలో మరో నాలుగు రోజుల పాటు వర్షాలు

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

తర్వాతి కథనం
Show comments