Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆరోగ్యానికి మేలు చేసే పప్పు గింజలు..

Webdunia
గురువారం, 1 అక్టోబరు 2015 (17:09 IST)
పప్పు ధాన్యాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. దీనికికారణం... పప్పు గింజల్లో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉండటమే ప్రధానకారణం. బాదం, జీడిపప్పు, పిస్తా, వాల్‌నట్, వేరుశెనగపప్పుల్లోని అసంతృప్త కొవ్వులు గుండె ఆరోగ్యానికి దోహదం చేస్తాయి. పప్పు గింజ‌లు ఎంత ఆరోగ్యకరమైనవైనా మితంగానే తీసుకోవాలి. 
 
అప్పుడే వీటితో కలిగే ప్రయోజనాలు ఉంటాయి. ప‌ప్పు గింజ‌ల‌లో ఉండే అన్‌సాచురేటెడ్ కొవ్వులు చెడు కొలెస్ట్రాల్‌ను త‌గ్గిస్తాయి. వీటిలో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు రక్తనాళాలు ఆరోగ్యంగా ఉండేందుకు దోహదం చేస్తాయి. గుండె లయ తప్పటాన్ని నిరోధించి గుండెపోటు రాకుండా రక్షిస్తాయి. ముఖ్యంగా ప‌ప్పు గింజ‌ల్లో పీచు స్థాయి కూడా ఎక్కువ‌గా ఉండటం వల్ల కొలెస్ట్రాల్‌ తగ్గటానికే కాదు కడుపు నిండిన భావనా కలిగిస్తుంది. 
 
దీంతో త్వరగా ఆకలి వేయదు. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మధుమేహం బారినపడకుండా నివారిస్తుంది. వీటిలో మెండుగా ఉండే విట‌మిన్ ఇ రక్తనాళాల్లో పూడికలను నివారిస్తుంది. అందువల్ల గుండెపోటు, పక్షవాతం వంటి జబ్బులు రాకుండా కాపాడుతుంది. జీడిపప్పును ఇతర పప్పులతో కలిపి వంటలో ఉపయోగిస్తే మాంసకృతులన్నీ తీసుకున్నట్టవుతుంది. 
 
పిస్తాలో విటమిన్‌ ఏ, సి, బి6 ఉంటాయి కాబట్టి రోగనిరోధకశక్తినీ పెంపొదిస్తాయి. గాలికి, వెలుతురుకు గురైతే త్వరగా రంగు, రుచి మారిపోతాయి. వేరుశనగల్లో ఒలియెక్‌ కొవ్వు ఉంటుంది. మోనో అసంతృప్తకొవ్వు ఆమ్లాలూ ఎక్కువే. అందువల్ల వీటిని తరచుగా తీసుకుంటే గుండె జబ్బుల బారినపడకుండా కాపాడతాయి. 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

చైనా ఆయుధ వ్యవస్థలను ఏమార్చి పాక్‍లో లక్ష్యాలపై దాడులు చేసిన భారత్!!

బీజాపూర్ జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్ - 31 మంది మావోలు హతం

Hyderabad: హాస్టల్ గదిలో ఉరేసుకున్న డిగ్రీ విద్యార్థి.. కారణం ఏంటో?

కాళ్ళబేరానికి వచ్చిన పాకిస్థాన్ : సింధు జలాల రద్దు పునఃసమీక్షించండంటూ విజ్ఞప్తి

పాకిస్తాన్ 2 ముక్కలు, స్వతంత్ర దేశంగా బలూచిస్తాన్ ప్రకటన

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Santhanam: డీడీ నెక్ట్స్ లెవల్: రోడ్డున పోయే ప్రతి ఒక్కరికీ సమాధానం చెప్పాల్సిన పనిలేదు..

బద్మాషులు నుండి లోకం మారిందా.. సాంగ్ రిలీజ్

23 లాంటి సినిమా తీయడం ఫిల్మ్ మేకర్ గా వెరీ ఛాలెంజింగ్ : డైరెక్టర్ రాజ్ ఆర్

రెట్రో మిస్ అయినా, మాస్ జాతర వరించింది, కామెడీ కూడా చేయబోతున్నా : నవీన్ చంద్ర

ముగ్గురు కోడళ్ల మరణాల చుట్టూ సాగే అయ్యనా మానే సిరీస్ తెలుగులో రాబోతోంది

Show comments