Webdunia - Bharat's app for daily news and videos

Install App

షుగర్‌ వ్యాధికి శాశ్వత పరిష్కారం...? ఎలాగంటే...

మధుమేహాన్ని పూర్తిగా నయం చేసే మళ్ళీ మళ్ళీ మందు బిళ్ళలు. ఇన్సులిన్ అవసరం లేకుండా ఓ చిన్నపాటి ఆపరేషన్‌తో దీనికి పూర్తిగా చెక్ పెట్టేస్తే మానవ జాతికి ఇంత కన్నా మహాభాగ్యం మరొకటి ఉండదు. ఆ మహాభాగ్యాన్ని త్వ

Webdunia
సోమవారం, 20 ఫిబ్రవరి 2017 (11:06 IST)
మధుమేహాన్ని పూర్తిగా నయం చేసే మళ్ళీ మళ్ళీ మందు బిళ్ళలు. ఇన్సులిన్ అవసరం లేకుండా ఓ చిన్నపాటి ఆపరేషన్‌తో దీనికి పూర్తిగా చెక్ పెట్టేస్తే మానవ జాతికి ఇంత కన్నా మహాభాగ్యం మరొకటి ఉండదు. ఆ మహాభాగ్యాన్ని త్వరలో మన భాగ్యనగరి కల్పించబోతోంది. ఇక్కడి వైద్యులు ఎండోస్కోపీ చికిత్సా విధానంతో మధుమేహాన్ని పూర్తిగా నియంత్రణలోకి తేవచ్చని గుర్తించారు. ఈ విధానాన్ని ఏడుగురు రోగులపై పరిశీలించగా అది విజయమైంది కూడా.
 
దీంతో మరింతమంది మధుమేహులకు ఈ చికిత్సను అందించి వారిలో వచ్చే ఫలితాలను ఆధారం చేసుకుని పూర్తి స్థాయిలో అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేస్తున్నారు. ఈ విధానం వినియోగంలోకి వస్తే భవిష్యత్తులో మధుమేహ బాధితులు మందులు, ఇన్సులిన్ వాడాల్సిన అవసరం లేదని ఏషియన్ ఇన్సిట్యూట్ ఆఫ్‌ గ్యాస్ట్రో ఎంటరాలజీ డైరెక్టర్ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి తెలిపారు. మొదటి వరల్డ్ కాంగ్రెస్ ఆఫ్‌ జీఐ ఎండోస్కోపీ సందర్భంగా హెచ్‌ఐసీసీలో మీడియాతో మాట్లాడుతూ.. ఎండోస్కోపీ మధుమేహాన్ని నియంత్రణలో పెట్టేందుకు విస్తృత పరిశోధనలు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఇది ప్రయోగదశలో ఉందని, త్వరలో ఈ విధానం చికిత్స అందించనున్నారు.
 
హైదరాబాద్‌లో 3 నెలల క్రితం ఏడుగురు రోగులకు ఎండోస్కోపీతో మధుమేహాన్ని నియంత్రించనున్నట్లు చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా 200 మందికి ఈ విధానం ద్వారా డయాబెటిస్‌ను అదుపులో పెట్టినట్లు చెప్పారు. క్లోమంలో ఇన్సులిన్ హెచ్చు తగ్గుల వల్లే రక్తంలో గ్లూకోజ్ నియంత్రణలో ఉండదని భావించడం సరికాదని మీడియాతో చెప్పారు నాగేశ్వర్ రెడ్డి. చిన్న పేగుల్లోని ఇన్సులిన్ ఉత్పత్తి ఉంటుందని, దానిలో మార్పులు చేసే డయాబెటిస్‌ను అదుపులో పెట్టవచ్చునన్నారు. ఎండోస్కోపీతో చిన్న పేగుల్లో ఇన్సులిన్‌ను ఎక్కువ, తక్కువ చేయొచ్చన్నారు. చిన్నపేగుల్లో మ్యూకోజ్‌ను 80డిగ్రీల వద్ద కాల్చడం వల్ల ఇన్సులిన్ తగిన మోతాదులో చిన్నపేగును ఒక పొరతో కవర్ చేస్తామన్నారు. తద్వారా క్లోమంలో ఇన్సులిన్ క్రమబద్దీకరించవచ్చని పరిశోధనలో తేలిందన్నారు. 
 
మొబైల్ వ్యాన్‌తో శిబిరాలు, ఆధునిక చికిత్స విధానాలను గ్రామాలకు విస్తరించే యోచనలో ఉన్నట్లు నాగేశ్వర్ రెడ్డి తెలిపారు. గ్రామాలకు విస్తరించే యోచనలో ఉన్నామని, ముఖ్యమంత్రితో మాట్లాడి గ్రామాల్లో మొబైల్ వ్యాన్ల ద్వారా వైద్య శిబిరాలను నిర్వహిస్తామని చెప్పారు. మొదటి వరల్డ్ కాంగ్రెస్ ఆఫ్‌ జీఐ ఎండోస్కోపీ కార్యక్రమానికి 20 దేశాల నుంచి వైద్య నిపుణులు వచ్చారని ఇందులో ఎండోస్కోపీ విధానంలోఉన్న ఆధునిక చికిత్సా విధానాలపై చర్చించనున్నారు. 

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

తర్వాతి కథనం
Show comments