Webdunia - Bharat's app for daily news and videos

Install App

రెడ్ మీట్ వద్దే వద్దు.. చేపలు, గుడ్లు, కూరగాయలే ముద్దు..!

వీకెండ్ వచ్చేస్తే చాలు.. ఇంకేముంది నాన్ వెజ్ లాగేంచేస్తున్నారా? అయితే మీకో బ్యాడ్ న్యూస్. మాంసాహారాన్ని మితంగా తినకపోతే కిడ్నీ ఫెయిలయ్యే ప్రమాదం పొంచివుందని పరిశోధకులు అంటున్నారు. మాంసాహారం మితంగా తీస

Webdunia
శుక్రవారం, 15 జులై 2016 (17:07 IST)
వీకెండ్ వచ్చేస్తే చాలు.. ఇంకేముంది నాన్ వెజ్ లాగేంచేస్తున్నారా? అయితే మీకో బ్యాడ్ న్యూస్. మాంసాహారాన్ని మితంగా తినకపోతే కిడ్నీ ఫెయిలయ్యే ప్రమాదం పొంచివుందని పరిశోధకులు అంటున్నారు. మాంసాహారం మితంగా తీసుకునే వారిలో కిడ్నీ పనితీరు మెరుగ్గా ఉందని.. అదే మాంసాహారాన్ని వారానికి మూడుసార్లు లాగించేవారిలో కిడ్నీ సంబంధిత వ్యాధులు ఉన్నట్లు వూన్ పూయేకోహ్ ఆధ్వర్యంలోని పరిశోధనలో తేలింది. 
 
ఈ బృందం సింగపూర్ లోని 63,257 మంది చైనా దేశీయులను అధ్యయనం చేసింది. 97 శాతం మంది ప్రొటీన్లు అధికంగా ఉన్న మాంసం తిన్నవారిలో కిడ్నీల పనితీరు ప్రమాదంలో ఉన్నట్లు తేలిపోగా, చేపలు, గుడ్లు డైరీ ఉత్పత్తులు తీసుకునే వారికంటే మాంసాహార ప్రియుల్లో ఈ ప్రమాదం ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. 
 
అంతేగాకుండా పంది, మేక, గొర్రె, ఆవు మాంసం తిన్నవారిలో కిడ్నీలు ఫెయిలయ్యే ప్రమాదాలు ఎక్కువగా ఉన్నట్లు తేలింది. రెడ్ మీట్‌కు బదులు చేపలు, కోడి మాంసం తీసుకోవచ్చునని తద్వారా కిడ్నీ సమస్యలను దూరం చేసుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఇక కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడే వారు ఆకుకూరలు ఎక్కువగా తినాలని పరిశోధకులు తెలిపారు.

దేశ ప్రజలకు వాతావరణ శాఖ శుభవార్త - మరికొన్ని రోజుల్లో నైరుతి!

మెగా ఫ్యామిలీని ఎవరైనా వ్యక్తిగతంగా విమర్శిస్తే ఒప్పుకోను: వంగా గీత

నోరుజారిన జగన్ మేనమామ... రాష్ట్రాన్ని గబ్బు చేసిన పార్టీ వైకాపా!!

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఇంజిన్‌లో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం

గర్భంతో ఉన్న శునకాన్ని కత్తితో పొడిచి చంపేసిన కసాయి!!

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

తర్వాతి కథనం
Show comments