Webdunia - Bharat's app for daily news and videos

Install App

మైగ్రెయిన్‌కు ధ్యానానికి మించిన మందు లేదు!

Webdunia
గురువారం, 19 నవంబరు 2015 (16:17 IST)
సాధారణంగా చాలా మంది మైగ్రెయిన్‌తో బాధపడుతుంటారు. ఇది ఓ పట్టాన తగ్గదు. ప్రపంచ వ్యాప్తంగా మైగ్రెయిన్‌తో బాధపడేవారి సంఖ్య కోటాను కోట్లుగా ఉంది. ఒక్క అమెరికాలోనే నాలుగు కోట్ల మందికిపైగా ప్రజలు ఈ వ్యాధితో బాధపడుతున్నట్టు అనేక సర్వేలు చెపుతున్నాయి. దాంతో అక్కడ అనేకమంది పరిశోధకులు దీని నివారణకు ప్రత్యామ్నాయ వైద్యాలమీద దృష్టిని సారించి విజయం సాధించారు. 
 
ఇందులోభాగంగానే ఇటీవల అమెరికాలోని వేక్ ఫారెస్ట్ బాప్టిస్ట్ మెడికల్ సెంటర్ మైగ్రెయిన్‌పై ఓ పరిశోధన చేసింది. ఇందులో భాగంగా తలనొప్పి, మైగ్రెయిన్‌లను తగ్గించేందుకు యోగా, ధ్యానం రెండింటి కలయికతో ఓ ప్రత్యేక పద్ధతిని రూపొందించారు. ఆపై మైగ్రెయిన్ తీవ్రతను బట్టి బాధితులను విభిన్న వర్గాలుగా విభజించి వాళ్లతో నెలరోజులపాటు ఆ ప్రత్యేక యోగాని చేయించగా ఆ వ్యాధి తీవ్రత చాలావరకూ తగ్గిందట. 
 
పైగా వారానికి మూడుసార్లు వచ్చేవాళ్లకు ఒకసారి రావడం జరిగిందట. దీన్నిబట్టి మైగ్రెయిన్‌కు ఇతరత్రా మందులకన్నా ధ్యానంతో కూడిన యోగా ఎంతో మేలు అని ఈ పరిశోధకులు చెపుతున్నారు. సో... మైగ్రెయిన్ బాధపడేవారు ప్రతి రోజూ ఉదయం పూట ఓ అర్థగంట పాటు ధ్యానం చేయడం వల్ల ఆ నొప్పినుంచి విముక్తులు కావ్చొచ్చన్నమాట.

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

Show comments