Webdunia - Bharat's app for daily news and videos

Install App

కిడ్నీలు ఇలా కాపాడుకోవచ్చు.. మాంసాన్ని అతిగా తీసుకుంటే..? (video)

Webdunia
ఆదివారం, 15 డిశెంబరు 2019 (15:18 IST)
ప్రపంచ వ్యాప్తంగా దాదాపు ఐదు లక్షల మంది ప్రజలు కిడ్నీలో రాళ్ళ సమస్యలతో బాధపడుతున్నారని సర్వేలో తేలిన అంశం. 30 నుంచి 50వయస్సు వారే ఈ సమస్యతో బాధపడుతున్నారు. దీనికి పరిష్కారం ఆహారంతో కొన్ని మర్పులు, చేర్పులు చేసుకుంటే చాలంటున్నారు వైద్య నిపుణులు.
 
 యానిమల్ ప్రొటీన్సు వల్ల కిడ్నీలో రాళ్ళు ఏర్పడతాయని మాంసాన్ని అతిగా తీసుకోవడం వల్ల కిడ్నీలో రాళ్ళు ఏర్పడే అవకాశం పదిరెట్లు ఎక్కువగా ఉందని చెబుతున్నారు వైద్య నిపుణులు. 
 
అతిగా మాంసమంటే ఇష్టపడేవారు మితంగా మాత్రమే తినాలని సూచిస్తున్నారు.పళ్ళ రసాలు తీసుకుంటూ రోజూ మొత్తం మీద కనీసం రెండున్నర లీటరు నీటిని తాగడం వల్ల కిడ్నీలో రాళ్ళు ఏర్పడే అవకాశం తగ్గించుకోవచ్చునని కూడా నిఫుణులు చెబుతున్నారు. పాప్ కార్నరల్ తింటూ కోకోకోలాలు తాగడం ఓ ఫ్యాషన్ గా మారిన ఈ రోజుల్లో కోలా డ్రింకులు కూడా కిడ్నీలో రాళ్ళు ఏర్పడడానికి దోహదం చేస్తున్నాయని అంటున్నారు. 
 
 
శాస్త్రవేత్తలు, పళ్ళ రసాల్లో ముఖ్యంగా ద్రాక్షరసం మానేస్తే మంచిదంటున్నారు. కాఫీలు, టీలు తాగే వారు రోజుకు రెండు నుంచి మూడు కప్పుల్ని మించి తాగినా మంచిది కాదంటున్నారు. నిమ్మరసం ఇంట్లో అప్పటికప్పుడే తయారు చేసుకుని తాగాలట. బయట జ్యూసులు తాగడం అంత మంచిది కాదంటున్నారు. శరీరానికి పొటాషియం అవశ్యకత ఉన్న ఎక్కువగా తీసుకోవడం మంచిది కాదంటున్నారు. 
 
మెగ్నీషియం, మినరల్సును సాధ్యమైనంత తక్కువగా తీసుకోవాలట. మన ఆహారంలో ఉప్పు శాతాన్ని ఎంతవరకు వినియోగించుకోవాలో తెలుసుకుని వైద్యులు సలహా పాటించాలట. వీలైనంత మన ఆహారంతో ఉప్పు, క్యాల్షియం తగ్గించాలంటున్నారు వైద్య నిపుణులు.
 
పాలకూర, వేరుశెనగకాయలు, పప్పు, బీన్సు, చాక్లెట్లు, కాఫీ, టీలు ఎక్కువగా సేవించకూడదని సాధ్యమైనంత వరకు వాటికి దూరంగా ఉండాలని, ఆహార నియమాలను ఖచ్చితంగా పాటించాలంటున్నారు. ఫైబర్ ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల మలబద్థకం రాదంటున్నారు. కిడ్నీలో రాళ్ళు ఏర్పడకుండా నివారించుకోవచ్చునని నిపుణులు సూచిస్తున్నారు. 
 
గుండె ఆరోగ్యం కోసం కిడ్నీలో రాళ్ళు ఏర్పడకుండా ఉండాలంటే వారంలో కనీసం రెండు సార్లు అయినా చేపలను ఆహారంలో చేర్చిచే మంచిదంటున్నారు ఆరోగ్య నిపుణులు. అప్పుడే కిడ్నీలో రాళ్ళు ఏర్పడవట. గుండె కూడా ఆరోగ్యంగా ఉంటుందట.

 

సంబంధిత వార్తలు

పల్నాడు జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన మలికా గార్గ్!!

తెలంగాణాకు శుభవార్త - జూన్ 5 -11 మధ్య నైరుతి రుతుపవనాలు ప్రవేశం!

బిల్లులు చెల్లించని జగన్ సర్కారు.. ఏపీలో ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేత!!?

వైఎస్ జగన్ అనే నేను... జూన్ 9న ఉదయం 9.38 గంటలకు విశాఖలో ప్రమాణ స్వీకారం...

పోస్ట్ పోల్ సర్వే.. టీడీపీ కూటమి విజయం.. వైకాపాకు ఆ ప్రాంతాల్లో పట్టు

దేవర ఫియర్ సాంగ్ వర్సెస్ పుష్ప సాంగ్.. జరగండి అంటోన్న చెర్రీ

కనీసం నా పిల్లలతో చాక్లెట్ పార్టీకి కూడా తీరికలేదు, రేవ్ పార్టీనా?: జానీ మాస్టర్ - video

రేవ్ పార్టీలో పట్టుబడ్డ అతడెవరో నాలాగే వున్నాడు: శ్రీకాంత్ మేకా

అబ్బాయిలూ ఇలా అమ్మాయిలకు ప్రపోజ్ చేస్తే చెంపలు చెళ్లుమంటాయి

పాయల్ రాజ్‌పుత్ పైన రక్షణ నిర్మాత ఫిలిం ఛాంబర్‌కు ఫిర్యాదు

తర్వాతి కథనం
Show comments