Webdunia - Bharat's app for daily news and videos

Install App

పైనాపిల్ పండిందో లేదో? పచ్చి పైనాపిల్ రసాన్ని తీసుకుంటే...

Webdunia
గురువారం, 6 ఫిబ్రవరి 2020 (21:40 IST)
అనాసతో ఎన్నో ప్రయోజనాలున్నాయి. తాజా అనాసను ఎంచుకునే ముందు కొన్ని అంశాలు గుర్తుంచుకోవాలి. పైన ఆకుపచ్చని రంగులో ఆకుల గుత్తి ఉండాలి. ఇది గోధుమ రంగులోకి మారకూడదు. పండును చేతితో పట్టుకుని చూస్తే బరువుగా అనిపించాలి. తోలు ముదురు ఆకుపచ్చ, ఎరుపు, పసుపులు కలిసిన మిశ్రమ వర్ణంలో ఉండాలి. తోలుపైన గాట్లు, దెబ్బలూ లేని దానిని చూసి ఎంచుకోవాలి. 
 
పండు చక్కని తీయని వాసన వెదజల్లాలి. అనాస పక్వానికి వచ్చిందీ లేనిదీ తెలుసుకోవటానికి ఒక తేలికపాటి పద్ధతి ఉంది. పండు కింద భాగంలో ఉండే ఆకుల్లో ఒకదానిని లాగి చూడాలి. తేలిగ్గా ఊడి వచ్చేస్తే పండు పక్వానికి వచ్చినట్లు అర్థం.
 
తాజా అనాసను సాధారణ వాతావరణంలో 1-2 రోజుల వరకూ చెడిపోకుండా ఉంచవచ్చు. రంధ్రాలు కలిగిన ప్లాస్టిక్ సంచిలో ఉంచి ఫ్రిజ్‌లో పెడితే 4-6 రోజుల వరకూ తాజాగా ఉంటుంది. ముక్కలను ఎయిర్‌టైట్ పాత్రలో ఉంచి ఫ్రిజ్‌లో ఉంచితే 2-3 రోజుల వరకూ నిల్వ ఉంటాయి. అయితే ముక్కలను ఫ్రిజ్‌లో ఉంచి గడ్డ కట్టిస్తే సహజమైన సుగంధాన్ని కోల్పోయే అవకాశం ఉంటుంది.
 
పచ్చి అనాస కాయ రసానికి రక్తస్రావాన్ని నిలువరించే గుణం ఉంది కనుక అప్పుడే తగిలిన గాయాల మీద, కోసుకుపోయిన దెబ్బల మీద ప్రయోగించవచ్చు. బాగా మిగల పండిన అనాస పండు రసం శరీరపు వేడిని తగ్గిస్తుంది. శరీరానికి కావలసిన పోషక తత్వాలను అందిస్తుంది. దీనిలో ‘బ్రోమిలిన్’ అనే అతి శక్తివంతమైన ఎంజైము ఉంటుంది. ఇది ఆహార పచనానికి సహాయపడుతుంది. ఆహారంలో ప్రొటీన్‌ని విడకొట్టి అరుగుదలకు సహాయపడుతుంది.
 
పండులో అధిక మొత్తాల్లో పీచు పదార్థం కూడా ఉంటుంది కాబట్టి మలబద్ధకం సమస్యతో ఇబ్బందిపడేవారు దీన్ని తీసుకోవచ్చు. దీనిలో సహజంగా అధిక మొత్తాల్లో విటమిన్-సి, పొటాషియం వంటివి ఉంటాయి. వ్యాధి నిరోధక శక్తిని పెంచుకోవడానికి విటమిన్-సి సహాయపడితే, మూత్రంలో మంటను తగ్గించి మూత్రాన్ని జారీ చేయడానికి అనాసలో వుండే పొటాషియం సహాయపడుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Kishan Reddy: హైదరాబాద్ నగరానికి రెండు ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

kadapa: అరటిపండు ఇస్తానని ఆశ చూపి మూడేళ్ల బాలికపై అత్యాచారం.. ఎక్కడ? (video)

Kerala Woman: నాలుగేళ్ల కుమార్తెను నదిలో పారేసిన తల్లి.. పిచ్చి పట్టేసిందా?

ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త చెప్పిన టీడీపీ కూటమి ప్రభుత్వం!

ఆపరేషన్ సిందూర‌తో పాకిస్థాన్ వైమానిక దళానికి అపార నష్టం!!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మనమంతా కలిసి తెలుగు సినిమాను కాపాడుకోవాలి - నిర్మాత ఎస్ కేఎన్

ఫోక్ యాంథమ్ తో ఆకట్టుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అదితి శంకర్

తమ్మారెడ్డి భరద్వాజ ఆవిష్కరించిన థాంక్యూ డియర్ లుక్

థ్రిల్లర్ గా అర్జున్ అంబటి పరమపద సోపానం చిత్రం రాబోతోంది

హారర్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ఘటికాచలం: నిర్మాత ఎస్ కేఎన్

తర్వాతి కథనం
Show comments