Webdunia - Bharat's app for daily news and videos

Install App

మానసిక ఒత్తిడితో బాధపడేవారికి...?

Webdunia
మంగళవారం, 5 ఫిబ్రవరి 2019 (10:25 IST)
మానసిక ఒత్తిడి కారణంగా మనిషి అనేకరకాల రుగ్మతలకు గురవుతున్నాడు. దాంతోపాటు చికాకు, నిద్రలేమి, ఆందోళన వంటివి మనిషిని వేధిస్తున్నాయి. అయితే ఇవన్నీ కాకుండా మానసిక ఒత్తిడి వలన మనిషి జ్ఞాపకశక్తి నశించే అవకాశముందని తాజా పరిశోధనలు చెబుతున్నాయి. కొందరు పరిశోధకులు నిర్వహించిన పరిశోధనల ప్రకారం దీర్ఘకాలికంగా ఒత్తిడితో బాధపడేవారికి జ్ఞాపకశక్తి నశించిపోతోందని తేలింది. 
 
అలానే ఒత్తిడి వలన కలిగే ఆందోళన, మానసికంగా కుంగిపోవడం వంటి లక్షాణాలు మనిషిలోని విషయ సంగ్రహణ శక్తిని దెబ్బతీస్తాయని కూడా ఈ పరిశోధనలు తెల్చాయి. ఈ పరిశోధనల ప్రకారం మానసిక వ్యధకు, విషయ సంగ్రహణ శక్తికి మధ్య సంబంధం ఉన్నట్టు తేలింది. కాబట్టి జీవితంలో అనేక రుగ్మతలతో పాటు జ్ఞాపకశక్తి నాశనానికి సైతం దారితీసే ఈ మానసిక ఒత్తిడిని జయించాల్సిన అవసరం ఉందని పరిశోధకులు చెబుతున్నారు. 
 
ఇందుకోసం యోగా, ధ్యానం, వ్యాయామాలు చేయడం వంటి చర్యలు చేపట్టాల్సిందిగా వారు సూచిస్తున్నారు. అలానే ఆహ్లాదకరమైన వాతావరణంలో నివశించడం జీవితంలో ఎదురయ్యే సవాళ్ల గురించి పాజిటీవ్‌గా ఆలోచించడం వంటివి చేయాలని వారు పేర్కొంటున్నారు.

సంబంధిత వార్తలు

ఏపీలో పోలింగ్ ప్రారంభం.. ఓటేసిన చంద్రబాబు, జగన్, లోకేశ్ దంపతులు

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు

తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!

ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

తర్వాతి కథనం
Show comments