Webdunia - Bharat's app for daily news and videos

Install App

మామిడి పండ్లను కొంటున్నారా? రసాయనాలతో జాగ్రత్త

మామిడి పండ్ల సీజన్ మొదలైంది. మార్కెట్లలో మామిడి పండ్లను రోజూ కొనుక్కొచ్చి తెగ లాగించేస్తుంటారు.. చాలామంది. అయితే మామిడి పండ్లను కొనేముందు వాటిలోని రసాయనాలతో జాగ్రత్త అంటున్నారు.. ఆరోగ్య నిపుణులు. వేసవ

Webdunia
మంగళవారం, 24 ఏప్రియల్ 2018 (12:03 IST)
మామిడి పండ్ల సీజన్ మొదలైంది. మార్కెట్లలో మామిడి పండ్లను రోజూ కొనుక్కొచ్చి తెగ లాగించేస్తుంటారు.. చాలామంది. అయితే మామిడి పండ్లను కొనేముందు వాటిలోని రసాయనాలతో జాగ్రత్త అంటున్నారు.. ఆరోగ్య నిపుణులు. వేసవి కావడంతో మామిడి పండ్లను మగ్గబెట్టేందుకు వ్యాపారులు కార్బైడ్ లాంటి విష రసాయనాలను ఉపయోగిస్తున్నారు. వీటివల్ల కేన్సర్ వ్యాధి తప్పదని వారు హెచ్చరిస్తున్నారు. 
 
అందుకే పండ్లను తినేముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. పంటకు రావడం అనేది పండ్లలో జరిగే ఒక సహజ ప్రక్రియ. కానీ డిమాండ్ అధికం కావడంతో మామిడి కాయలను పండేలా చేసేందుకు రసాయనాలు ఉపయోగిస్తున్నారు. ఇలా చేయడం ద్వారా పిండి పదార్థాలు చక్కెరగా మారే అవకాశాలున్నాయి. పండ్లు పంటకు రావటమంటే మంచి రుచిని సువాసనను సంతరించుకుంటుంది. 
 
తరువాత వాటి రంగు మారుతుంది. కేవలం మామిడి పళ్లతోనే మాత్రమే కాదు.. వేసవికాలంలో చాలారకాల పండ్లలో కార్బైడ్ వినియోగాన్ని ప్రభుత్వం నిషేధించింది. సహజసిద్ధంగా పండే పండ్లను తింటే ఆరోగ్యానికి ఎలాంటి ప్రమాదం వుండదు కానీ.. రసాయనాలను కలిపిన పండ్లను తింటే అనారోగ్య సమస్యలు తప్పవని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. 
 
రంగును చూసి మోసపోకుండా.. కాయను సున్నితంగా నొక్కి తొడిమల దగ్గర మంచి వాసన వస్తుందా అని చూడండి. సహజంగా పండిన మామిడిపండ్లు నీటిలో మునుగుతాయి. అదే కృత్రిమంగా మాగబెట్టిన పండ్లను నీరున్న బకెట్లో వేస్తే పైకి తేలుతాయి. రసాయనాలతో పండించిన పండ్లను తింటే చర్మంపై దురద, కడుపులో మంట, అజీర్తిలాంటి ఇబ్బందులుంటాయి.
 
అందుకే వాటిని నీటిలో శుభ్రంగా కడిగితే కొంతవరకు రసాయనాలను పోగొట్టుకోవచ్చు. అలాగే వెనిగర్‌ను పండ్లపైన స్ప్రే చేసి, ఐదు నిమిషాలు మంచినీళ్లలో శుభ్రంగా కడిగి తింటే ఆరోగ్యాన్ని కాపాడుకునే అవకాశాలున్నాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

న్యూజిలాండ్‌లో కరోనా విజృంభణ - భారత్‌లో 5 వేలు దాటిన కరోనా

కస్టమర్ల FD రూ. 4.5 కోట్లను స్టాక్ మార్కెట్లో పెట్టేసిన బ్యాంక్ అధికారిణి, గోవిందా

Vijayawada: వైజాగ్ కాలేజీలకు డ్రగ్స్ సప్లై.. కొరియర్, క్యూఆర్ కోడ్ ద్వారా చెల్లింపు, సరఫరా

మేఘాలయ హనీమూన్ కేసు: మా బావను చంపేసి నా సోదరిని కిడ్నాప్ చేసారేమో

Lion: సింహం అనుకున్నాడా? లేదా కుక్క అనుకున్నాడా? ఏం గుండె రా బాబు? (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

Adivi Sesh : డకాయిట్ డబ్బింగ్ టెస్ట్ పూర్తి చేసిన అడివి శేష్

మోగ్లీ 2025 కోసం 15 రోజుల భారీ క్లైమాక్స్ యాక్షన్ షెడ్యూల్‌ పూర్తి

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

తర్వాతి కథనం
Show comments