Webdunia - Bharat's app for daily news and videos

Install App

పరగడుపున కూల్ డ్రింక్స్ తాగుతున్నారా? ఆమ్లాలతో కష్టాలే..

పరగడుపున శీతల పానీయాలు తీసుకోవడం.. కూల్ డ్రింక్స్‌ను తాగడం వంటివి చేస్తే.. అందులోని ఆమ్లాలతో వికారం, వేవిళ్లు తప్పవని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ ఆమ్లాల ప్రభావం జీర్ణాశయంపై పడుతుందని వారు సూచ

Webdunia
బుధవారం, 29 మార్చి 2017 (15:10 IST)
పరగడుపున శీతల పానీయాలు తీసుకోవడం.. కూల్ డ్రింక్స్‌ను తాగడం వంటివి చేస్తే.. అందులోని ఆమ్లాలతో వికారం, వేవిళ్లు తప్పవని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ ఆమ్లాల ప్రభావం జీర్ణాశయంపై పడుతుందని వారు సూచిస్తున్నారు. అలాగే పండ్లు కూడా పరగడుపున తీసుకోకూడదు. ముఖ్యంగా అరటిపండ్లు తీసుకోవడం వద్దు. అరటిలోని మెగ్నీషియం ఉదయం పూట ఎక్కువ మోతాదులో శరీరానికి అందటం మంచిదికాదు. 
 
చాలామంది ఉదయం నిద్రలేవగానే కాఫీ, టీ లను తాగుతుంటారు. ఉదయం వాటిని తాగడం మంచిదే అయినా పరగడుపున తాగడం మంచిది కాదని, ఈ విధంగా తాగడం వల్ల హార్మోన్లు అన్‌ బ్యాలెన్స్‌ అవుతాయి. గ్లాస్ నీటిని తాగితే తర్వాతే కాఫీలు, టీలు తాగడం మంచిది. 
 
ఘాటైన మసాలా కూరల్ని పరగడుపున తినకూడదు. అలా తింటే పొట్టలో తిప్పడమే కాక రోజంతా నిరుత్సాహంగా ఉంటుంది. ఇదే పరిస్థితి ఎక్కువ కాలం కొనసాగితే అల్సర్‌ వచ్చే ప్రమాదం ఉందని వార్నింగ్ ఇస్తున్నారు. కాబట్టి ఉదయం తేలిగ్గా జీర్ణమయ్యే ఆహారాన్ని తీసుకోవడం మంచిదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

ఘోరం, క్రికెట్ ఆడుతుండగా యువకుడి తలపై పడిన పిడుగు, మృతి

ఏపీలో 81.86 శాతం.. పిఠాపురంలో 86.36 శాతం పోలింగ్ : ముకేశ్ కుమార్ మీనా

బోరబండ వద్ద మేకప్ ఆర్టిస్టును హత్య చేసిన దుండగులు

భర్తతో కలిసి వుండటం ఇష్టం లేదు.. ప్రియుడితో రెండు నెలల గర్భిణి పరార్

తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే ఘాట్ రోడ్డులో చిరుత

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

తర్వాతి కథనం
Show comments