వాయు కాలుష్యంతో హృద్రోగాలు...

చెట్లు కొట్టేయడం, మనుషులు కన్నా వాహనాలు ఎక్కువ కావడం, ఫ్యాక్టరీల నుండి వెలువడుతున్న రసాయనాలు.... వంటి వాటి కారణంగా వాయు కాలుష్యం పెరిగిపోతున్న విషయం మనందరికి తెలిసిందే. అయితే ఇంతకాలం అనుకున్నట్లు వాయు కాలుష్యం వల్ల కేవలం ఊపిరితిత్తులకు సంబంధించిన సమస

Webdunia
శుక్రవారం, 9 మార్చి 2018 (21:57 IST)
చెట్లు కొట్టేయడం, మనుషులు కన్నా వాహనాలు ఎక్కువ కావడం, ఫ్యాక్టరీల నుండి వెలువడుతున్న రసాయనాలు.... వంటి వాటి కారణంగా వాయు కాలుష్యం పెరిగిపోతున్న విషయం మనందరికి తెలిసిందే. అయితే ఇంతకాలం అనుకున్నట్లు వాయు కాలుష్యం వల్ల కేవలం ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలే కాకుండా, హృద్రోగ సమస్యలూ వస్తున్నాయని అమెరికన్ పరిశోధకులు పేర్కొంటున్నారు.
 
ముఖ్యంగా రక్తంలో చక్కెర శాతంతో పాటు కొలస్ట్రాల్ పెరగడానికి తద్వారా హృద్రోగ మరణాలకు దారితీస్తుందని అమెరికన్ పరిశోధకులు పేర్కొంటున్నారు. షుగర్ వ్యాధి ఉన్నవారిలో ఈ సమస్య ఎక్కువగా ఉంటుందట. ఇందుకోసం దక్షిణ ఇజ్రాయెల్‌లో వాయుకాలుష్యానికి గురవుతున్న కొందరు వ్యక్తుల మీద ఈ ప్రభావాన్ని లెక్కించారట. 
 
గాలిలో ఏరోసల్స్ ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో నివసించే వాళ్ల రక్త నమూనాలను పదేళ్లపాటు నిరంతరాయంగా సేకరించి పరిశీలించారట. వాటిల్లో రక్తంలో చెడు కొలస్ట్రాల్ బాగా పెరగడంతో పాటు మంచి కొలస్ట్రాల్ తగ్గిందట. అంతేకాదు, సాధారణ వ్యక్తులతో పోలిస్తే చక్కెర రోగుల్లో చెడు కొలస్ట్రాల్ చాలా ఎక్కువగా పెరిగినట్లు గుర్తించారు. దీన్నిబట్టి వాయుకాలుష్యం వల్ల హృద్రోగాలు పెరుగుతున్నాయని వాళ్లు విశ్లేషిస్తున్నారు. కాబట్టి మనచుట్టూ ఉన్న గాలిమీద ఓ కన్ను వేయాల్సిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

అందుకే నేను చెప్పేది, పవన్ సీఎం అయ్యే వ్యక్తి, జాగ్రత్తగా మాట్లాడాలి: ఉండవల్లి అరుణ్ కుమార్

బాబాయ్ హత్యే జగన్‌కు చిన్న విషయం, ఇక పరకామణి చోరీ ఓ లెక్కనా: సీఎం చంద్రబాబు

AI దుర్వినియోగం, పాకిస్తాన్ పార్లమెంట్ లోకి దూసుకొచ్చిన గాడిద, కిందపడ్డ సభ్యులు (video)

Bharat Future City: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025కు అంతా సిద్ధం

కార్మికులు ఢిల్లీ వెళ్లి కొట్లాడేందుకు రూ.10 లక్షలు ఇస్తా : మాజీ మంత్రి మల్లా రెడ్డి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నేను నమ్మితే షూటింగ్ కు కూడా ఎప్పుడో గానీ వెళ్లను : నిర్మాత కేఎల్ దామోదర ప్రసాద్

Akhil Akkineni : ప్రశాంత్ నీల్ తో అఖిల్ అక్కినేని చిత్రం ?

Akhanda 2: అఖండ 2 క్రిస్ మస్ కు తాండవం చేస్తుందా ? దామోదర ప్రసాద్ ఏమన్నారంటే..

మణికంఠ తీసిన కొత్తపెళ్లికూతురు షార్ట్ ఫిలిం చాలా ఇష్టం : మెహర్ రమేష్

వరలక్ష్మి శరత్ కుమార్, నవీన్ చంద్ర ల పోలీస్ కంప్లెయింట్

తర్వాతి కథనం
Show comments