జీర్ణవ్యవస్థ నిరంతరం ఇబ్బంది లేకుండా పనిచేయాలంటే...?

Webdunia
శుక్రవారం, 8 మార్చి 2019 (22:15 IST)
జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగ్గా ఉండాలంటే భోజనం తరువాత కొన్ని పనులకు దూరంగా ఉండాలంటున్నారు వైద్య నిపుణులు. అలా చేస్తే అరుగుదల బాగా జరుగుతుందట. అంతేకాదు జీర్ణవ్యవస్థ మీద ఎలాంటి ఒత్తిడి ఉండదట. కొందరు రాత్రిపూట భోజనం చేశాక స్నానం చేస్తుంటారు. తప్పనిసరి పరిస్థితుల్లో ఒకటిరెండుసార్లు చేయొచ్చు. అదే అలవాటుగా మారితే స్నానం వల్ల కదలికలు వేగంగా ఉంటాయట.
 
ఆ ప్రభావం జీర్ణవ్యవస్థ మీద పడుతుందట. అరుగుదల మందగిస్తుంది. షవర్‌తో స్నానం చేయడం అస్సలు మంచిది కాదట. నీళ్ళు తాగడం వల్ల ఒత్తిడి జీర్ణవ్యవస్ధపై పడుతుంది. అన్నం తిన్నాక కాసేపు అలా ఇలా నడుస్తూ ఉండాలట. అలాగని ఎక్కువసేపు నడవడం మంచిది కాదట. ఇలా చేయడం వల్ల కొంతమంది వికారం కలగవచ్చు. మరికొందరికి పొట్టలో తిప్పే ప్రమాదం ఉందట. 
 
భోజనం చేశాక రాత్రి పూట చల్లటి నీళ్ళు తాగితే అరుగుదల మీద ప్రభావం చూపుతాయట. అదే గోరువెచ్చని నీళ్ళు తాగితే జీర్ణవ్యవస్ధ పనితీరును వేగవంతం చేస్తాయట. భోజనం చేసిన తరువాత తినడం మంచిది కాదు. తినడానికి..పడుకోవడానికి మధ్య కనీసం గంటన్నర సమయం ఉండాలట. తిన్న వెంటనే పడుకుంటే శరీరంలో కొవ్వు పేరుకుపోయే ప్రమాదం ఉందని వైద్యులు చెబుతున్నారు. భోజనం చేశాక టీ, కాఫీలు అస్సలు తాగకూడదట. అలా తాగితే పోషకాహారాలు వంటబట్టవని చెపుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఇద్దరు స్నేహితుల సరదా పెను ప్రమాదానికి దారితీసింది (వీడియో)

ఇరాన్ పని ముగించి క్యూబా సంగతి చూస్తా: డొనాల్డ్ ట్రంప్

వైకాపా విధ్వంసంతో నవ్యాంధ్ర 30 యేళ్లు వెనక్కి వెళ్లింది : పవన్ కళ్యాణ్

13 ఏళ్ల కంటే తక్కువ వయసున్న పిల్లలకు సోషల్ మీడియా యాక్సెస్ లేదు

తల్లి బంగారన్ని తెగనమ్మి ఇన్‌స్టాగ్రామ్ ప్రియుడికి బైక్ కొనిచ్చిన ప్రియురాలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Virosh Manyavar: ఇన్‌స్టాలో అత్యధిక లైక్స్‌తో గ్లోబల్ రికార్డ్ విరోష్ మాన్యవార్ కపుల్ యాడ్

Allu Sirish: అల్లు కుటుంబానికి మార్చి 6న కలిసి వచ్చే కాలంగా మారింది

Sharva: గంగలోని ప్రశాంతత క్రోధం భోగి లో చూపించనున్న శర్వానంద్

Revanth Reddy: ఇంటికి వెళ్లి శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి

ఇతరుల బాధలో కూడా వినోదం వెతికేవారిని నిలదీసే రోజు రావాలి : అనసూయ

తర్వాతి కథనం
Show comments