Webdunia - Bharat's app for daily news and videos

Install App

గ్లాస్ నీటిలో నిమ్మరసం కలిపి తీసుకుంటే..?

Webdunia
శనివారం, 22 డిశెంబరు 2018 (14:22 IST)
ఈ చలికాలంలో దాహం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే.. చల్లని గాలిని మనం పీల్చినప్పుడు ఆ గాలి శరీరంలోనికి ప్రవేశిస్తుంది. అప్పుడు మనకు నీరు ఎక్కువగా తీసుకోవాలనిపిస్తుంది. కానీ, సమయానికి నీరు దొరకకపోవడంతో.. బయట దొరికే శీతల పానీయాలు తీసుకుంటుంటారు. అలా చేయడం వలన ఆరోగ్యానికి అంత మంచిది కాదంటున్నారు.. నిపుణులు.. 
 
మనిషి శరీరంలో నుండి ఒక రోజులో 700 నుండి 1000 గ్రాముల నీరు చెమట రూపంలో బయటకు పోతుంటుంది. అదే సమయంలో శరీరంలోపల 300 నుండి 400 గ్రాముల నీరు తయారవుతూ ఉంటుంది. అంటే ఇక్కడ బయటకుపోయే నీరు ఎక్కువగా ఉన్నాయి. లోపల ఊరే నీరు తక్కువ. ఇలా నీటి శాతం తగ్గినప్పుడు దాహం వేస్తుంది. రక్తంలో ఉప్పు, నీరు కలిసి ఉంటాయి. ఏ కారణం చేతైన రక్తంలో నీటి శాతం తగ్గినట్లైతే దాహం వేస్తుంది. 
 
కొందరికైతే వేసవి కాలం, వర్షా కాలం అనే తేడాలు లేకుండా ఎప్పుడుపడితే అప్పుడు దాహం వేస్తుంటుంది. వారికి ఎన్ని నీళ్లు తాగినా దాహం తీరదు. ఎటువంటి వారికైనా దాహం వేస్తుంటే గ్లాస్ చల్లని నీటిలో నాలుగు స్పూన్ల చక్కెర, ఒక నిమ్మకాయను పిండి తీసిన రసం కలిపి తాగితే వెంటనే దాహం తగ్గుతుంది. అదేవిధంగా దానిమ్మ పండ్ల రసానికి సమంగా పంచదార కలిపి తేనె పాకంగా ఉడికించి రెండు స్పూన్ల చొప్పున రోజుకి మూడుసార్లు తాగితే దాహం తగ్గుతుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Chhattisgarh: బసవ రాజుతో సహా 27మంది మావోయిస్టులు మృతి

తిరుమలలో అపచారం: కొండపై నమాజ్ చేసిన వ్యక్తి - వీడియో వైరల్

Jio: ఆంధ్రప్రదేశ్ టెలికాం సర్కిల్‌లో జియో నెట్‌వర్క్‌ ఏర్పాటు

Drum Tower: 650 ఏళ్ల డ్రమ్ టవర్ కూలిపోయింది.. వీడియో

పాకిస్తాన్ పోలీసులను పరుగెత్తించి కర్రలతో బాదుతున్న సింధ్ ప్రజలు, ఎందుకని?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మళ్ళీ మరోసారి మన టైమ్ రావాలంటున్న చిరంజీవి, బాబీ

‘వార్ 2’ టీజర్‌కు వచ్చిన స్పందన చూస్తే ఎంతో ఆనందంగా వుంది :ఎన్టీఆర్

నేను ద్రోణాచార్యుని కాదు, ఇంకా విద్యార్థినే, మీరు కలిసి నేర్చుకోండి : కమల్ హాసన్

Poonam Kaur: త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై మళ్లీ ఇన్‌స్టా స్టోరీ.. వదిలేది లేదంటున్న పూనమ్

Peddi: సత్తిబాబు కిళ్లీకొట్టు దగ్గర పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్, బుజ్జిబాబు

తర్వాతి కథనం
Show comments