Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉప్పు అధికంగా వద్దే వద్దు.. రోజుకు ఐదు గ్రాములే వాడాలట..

ఉప్పును వంటల్లో అధికంగా వాడటం ఆరోగ్యానికి మంచిది కాదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. రుచి కోసం ఉప్పును చేర్చుకుంటే సరిపోతుంది కానీ.. అది మోతాదు మించితే మాత్రం ఆరోగ్యానికి అనర్ధమేనని వారు హెచ్చరిస

Webdunia
సోమవారం, 25 జూన్ 2018 (12:36 IST)
ఉప్పును వంటల్లో అధికంగా వాడటం ఆరోగ్యానికి మంచిది కాదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. రుచి కోసం ఉప్పును చేర్చుకుంటే సరిపోతుంది కానీ.. అది మోతాదు మించితే మాత్రం ఆరోగ్యానికి అనర్ధమేనని వారు హెచ్చరిస్తున్నారు. రోజు ఐదు నుంచి ఆరు గ్రాముల ఉప్పు మాత్రమే ఆహారంలో చేర్చుకోవాలట. అయితే భారతీయులు 20 నుంచి 25 గ్రాముల ఉప్పును ఆహారంలో చేర్చుకుంటున్నారు. 
 
కారం ఎక్కువ గల ఆహారంలో ఉప్పును కూడా అధికంగా చేర్చేస్తున్నారు. ఎండు చేపలు, ఎండిన మాంసాహారం, ఊరగాయలు, వడియాలు, అప్పడాలు వంటి ఆహార పదార్థాల్లో అధిక ఉప్పును వుపయోగిస్తున్నారు. అలాగే పులిహోర, చేపల పులుసుల్లో రుచి కోసం ఉప్పును అధికంగా వాడేస్తున్నారని.. తద్వారా గుండెకు ముప్పేనని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. 
 
వీటితో పాటు చిప్స్, కారపు ఆహార పదార్థాల్లో అధికంగా ఉప్పును కలుపుతున్నారు. సోడియం క్లోరైడ్ అనే ఉప్పులో 40 శాతం సోడియం అనే రసాయనం వుంది. ఈ సోడియం శరీరంలో చేరడం ద్వారా కిడ్నీ, గుండె సంబంధిత రోగాలు తప్పవట. ఇంకా ఉప్పు రక్తపోటును పెంచేస్తుంది. అందుచేత వండే ఆహారంలో ఉప్పును తక్కువగా తీసుకోవడం మంచిది. 
 
సాధ్యమైనంత వరకు కూరగాయలు, పండ్లు, తృణధాన్యాలను ఆహారంలో భాగం చేసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. తాజా పండ్లు, కూరగాయల్లో సోడియం శాతం తక్కువగా వుంటుంది. సోడియంకు బదులుగా పొటాషియం వుంటుంది. ఇది అధిక రక్తపోటును నియంత్రిస్తుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Future City: ఫ్యూచర్ సిటీ, అమరావతిని కలిపే హై-స్పీడ్ రైలు.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారటగా!

Hyderabad: తెలంగాణలో భారీ వర్షాలు- టెక్కీలు వర్క్-ఫ్రమ్-హోమ్ అనుసరించండి..

Two Brides: ఇద్దరు మహిళలను ఒకేసారి పెళ్లి చేసుకున్న వ్యక్తి.. వైరల్ వివాహం..

ఫ్రిజ్‌లో పెట్టుకున్న మటన్ వేడి చేసి తిన్నారు, ఒకరు చనిపోయారు

పవన్ తమిళ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తారా? జనసేనాని ఏమన్నారు? (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా ఇండస్ట్రీ ఆంధ్రకు రాదు: పవన్ కళ్యాణ్

Rajinikanth: రజనీకాంత్ కూలీ సిద్ధమవుతోంది - ఓటీటీ కన్ ఫామ్స్

గాలి కిరీటీరెడ్డి జూనియర్ చిత్రానికి మిగిలింది రెండు రోజులే

హాట్ కేకుల్లా 'వీరమల్లు' : బుక్‌ మై షో క్రాష్? - ఆంధ్రాలో రూ.1000 - తెలంగాణాలో టిక్కెట్ ధర రూ.600

ZEE5 లో ఆడియెన్స్‌ను అల‌రిస్తూ దూసుకెళ్తోన్న భైర‌వం

తర్వాతి కథనం
Show comments