Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆముదం వాడితే గుండె జబ్బులు తొలగిపోతాయి...!

సంస్కృతంలో ఆముదాన్ని ఏరండ అని పిలుస్తారు. వృక్షాలు లేనిచోట ఆముదమే మహావృక్షం అని ఒక సామెత కూడా ఉంది. ఇది రెండు నుంచి ఆరు మీటర్ల మొక్కగా పెరుగుతుంది. ఆముదం వృక్షాన్ని ఇళ్ళలో పెంచుకోరుగానీ ఆముదం ఇళ్ళలో వ

Webdunia
బుధవారం, 2 నవంబరు 2016 (13:05 IST)
సంస్కృతంలో ఆముదాన్ని ఏరండ అని పిలుస్తారు. వృక్షాలు లేనిచోట ఆముదమే మహావృక్షం అని ఒక సామెత కూడా ఉంది. ఇది రెండు నుంచి ఆరు మీటర్ల మొక్కగా పెరుగుతుంది. ఆముదం వృక్షాన్ని ఇళ్ళలో పెంచుకోరుగానీ ఆముదం ఇళ్ళలో వాడుతూ ఉంటారు. ఆముదం విత్తనాల నుంచి లభించే నూనెనే ఆముదం అని పిలుస్తారు.
 
ఆముదం విత్తనాల నుంచి లభించే నూనెను విరేచనకారిగా వాడతారు. ముఖ్యంగా చిన్నపిల్లలకు, చంటిపిల్లలకు ఆముదం పట్టించడం తెలుగువారికి కొత్త కాదు.
 
ఆముదాన్ని గుండెజబ్బులలో వాడతారు. ఆముదము గుండెలపైన వేసి మర్తనం చేయడం వేడి కాపడం పెట్టడం వల్ల ఛాతీ సంబంధమైన పలు సమస్యలు తొలగిపోతాయి.
 
ఆమ్లవాతములలో ఆముదాన్ని ఉపయోగిస్తారు. కీళ్ళనొప్పులలోనేగాక, కాళ్లుచేతులు విరిగినప్పుడు, బెణికినప్పుడు ఆముదాన్ని రాసి కట్టుకడతారరు. 
 
ఆముదపు ఆకులు శరీరంలో కలిగే వాపులను తగ్గిస్తాయి. ఆముదము వంటికి పట్టించి ఆ తరువాత శనగపిండితో నలుగు పెట్టుకుని స్నానం చేస్తే శరీరం కాంతివంతమవుతుంది. ఆముదము విరేచక కారి ఇది. కడుపునొప్పి ఉన్న సందర్భంలో కూడా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా చంటిపిల్లలతో కడుపు ఉబ్బరం ఉన్నప్పుడు, కడుపునొప్పితో బాధపడుతున్నప్పుడు, నెలల పిల్లలతో విరేచనం సాఫీగా కాక బాధపడుతున్నప్పుడు తమలపాకులను తీసుకుని వాటికి ఆముదం బాగా ట్టించి వాటిని కుంపటిపైన వేడి చేసి గోరువెచ్చగా ఉన్నప్పుడు పసిపిల్లల బొడ్డుపైన కాపడం పెడితే సుఖ విరేచనం అవుతుంఇ. వారికి అప్పటిదాకా ఉన్న కడుపు ఉబ్బరం నొప్పి తగ్గిపోతాయి.
 
ఆముదము తలకు రాసుకుంటే జుట్టు నల్లగా, వత్తుగా, నిగ నిగ లాడుతూ ఉంటుందని అంటారు. అయితే ఆముదము జిడ్డుంగా ఉండే లక్షణం గలది. దీని వల్ల దుమ్ము తలపైన చేరి చుండ్రు వచ్చే అవకాశం కలుగుతుంది.
 
శీతాకాలంలో రోజూ కాళ్ళకూ, చేతులకూ ఆముదం రాసి తోముకుంటుంటే పాలుసులు మాదిరిగా చర్మం ఊడిపోవడం జరగదు. పెదవులపై వ్రాస్తే పెదాలు పగలకుండా ఉంటాయి. ఏదైనా పొరపాటున విషం మింగినపుడు వాంతి చేయించవలసి ఉంటుంది. వివిధ పద్థతులలో వాంతి చేయించినా ప్రేగులలో నిలిచి ఉండే విషపదార్థం పోవాలంటే ఐదు చెంచాల ఆముదాన్ని తాగితే విరేచనంలో విషపదార్థం తొలగిపోతుంది. చిన్న పిల్లలు ఒక చెంచా త్రాగినా సరిపోతుంది.
 
ఆముదము తీవ్రమైన విరేచనకారి కాబట్టి వీలైనంత తక్కువ పరిమాణంలోనూ వాడాలి. ఆముదాన్ని విరేచనకారిగా వాడేటప్పుడు దానిని బాగా కాగపెట్టి వాడాలి. అంతేకాకుండా ఆముదం తాగిన తర్వాత విరేచనాలు ఉదృతమవకుండా ఉండేందుకు గాను చింత పండు చారు తాగిస్తారు. 
 
ఆముదాన్ని, సున్నాన్ని సమపాళ్ళలో కలిపి పగలకుండా ఉన్న గడ్డలపైన లేక కురుపులైన వ్రాసినట్లయితే అవి త్వరగా పగిలిపోయి కురుపులు కూడా నయం అవుతాయి. గజ్జి వ్యాధిలో కూడా ఇది బాగా పనిచేస్తుంది. నరాల చురుకు, పోట్లు ఉన్నప్పుడు ఆముదము మర్దనా చేస్తే సరిపోతుంది. షికాటికా వ్యాధిలో కూడా ఆముదము కాస్త గోరువెచ్చగా చేసి మర్దనా చేస్తే చాలా బాగా పనిచేస్తుంది. 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ జీతం మొత్తం అనాధ పిల్లలకు ఇచ్చేశారు

Chardham Yatra: పాకిస్తాన్ దాడుల ముప్పు: చార్‌ధామ్ యాత్రను నిలిపివేసిన భారత సర్కారు

Hyderabad: పది లక్షల రూపాయల్ని కాజేసిన కిలేడీ

India: పాకిస్తాన్‌లోని డ్రోన్ లాంచ్ ప్యాడ్‌లను ధ్వంసం చేసిన భారత్ (video)

pak drones: జమ్మూలో పాక్ డ్రోన్ దాడులు, సైరన్ల మోత

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Laya: నటి లయ వారసురాలిగా శ్లోకా అఖండ 2లో ఎంట్రీ ఇస్తోందా !

మెగాస్టార్ చిరంజీవికి విశ్వంభర మరో మ్యాజిక్ కాబోతుందా !

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

తర్వాతి కథనం
Show comments