Webdunia - Bharat's app for daily news and videos

Install App

కళ్లద్దాలు ఎందుకు.. కంటి నిండా నిద్రపోండి..

గంటల పాటు కంప్యూటర్లకు అతుక్కుపోవడం ద్వారా కంటి ఆరోగ్యం మందగిస్తుంది. తద్వారా కంటి దృష్టి లోపాలు తప్పట్లేదు. ఇలాంటి కంటి దృష్టి లోపాల నుంచి గట్టెక్కేందుకు చాలామంది కళ్లద్దాలు వాడుతున్నారు. అయితే కళ్లద

Webdunia
ఆదివారం, 22 జులై 2018 (11:41 IST)
గంటల పాటు కంప్యూటర్లకు అతుక్కుపోవడం ద్వారా కంటి ఆరోగ్యం మందగిస్తుంది. తద్వారా కంటి దృష్టి లోపాలు తప్పట్లేదు. ఇలాంటి కంటి దృష్టి లోపాల నుంచి గట్టెక్కేందుకు చాలామంది కళ్లద్దాలు వాడుతున్నారు. అయితే కళ్లద్దాలు వాడటం కంటే పోషకాహారం తీసుకుంటే కంటి దృష్టి సమస్యలు తొలగిపోతాయని ఆరోగ్యనిపుణులు సూచిస్తున్నారు. 
 
ముఖ్యంగా రోజూ ఓ కప్పు మునగాకు, ఓ కోడిగుడ్డును ఆహారంలో తీసుకోవడం ద్వారా కంటి ఆరోగ్యం మెరుగుపడుతుంది. అలాగే ఆకుకూరలు, కాయగూరలతో చేసే సలాడ్లలో విటమిన్‌ ఎతోపాటూ కెరొటినాయిడ్స్‌, జియాంతిన్‌, లెట్యూన్‌ వంటి పోషకాలు ప్రత్యేకంగా అందుతాయి. ఈ పోషకాలు కంటికి హానిచేసే తీవ్రమైన కాంతి నుంచి శరీరానికి రక్షణగా నిలుస్తాయి. కాయగూరలతో చేసిన సలాడ్లవల్ల చిన్నవయసులో కళ్లద్దాల అవసరం వుండదు. 
 
అలాగే కంటి దృష్టి లోపాలను దూరం చేసుకోవాలంటే.. కంటినిండా నిద్ర తప్పనిసరి.  ఇన్‌సోమ్నియా వంటి నిద్రలేమి సమస్యలున్నవారు రోజూ సలాడ్‌ తినడం వల్ల హాయిగా, కంటినిండా నిద్రపోవచ్చు. సలాడ్లలో ఎక్కువగా ఉపయోగించే లెట్యూస్‌ ఆకులో మంచి నిద్రకు అవసరం అయిన లెక్ట్యూకారియమ్‌ అనే రసాయనం ఉంటుంది.
 
అలాగే కంటిచూపు సమస్యలను దూరం చేసుకోవాలంటే.. ఎక్కువ కాయగూరలు తీసుకోవాలి. పచ్చికాయగూరల వల్ల శరీరంలో ఎంజైములు ఎక్కువగా వచ్చి చేరతాయి. ఈ ఎంజైములు శరీరం పోషకాలని ఎక్కువగా స్వీకరించేందుకు దోహదం చేస్తాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ప్రజల్ వీడియోలు : సస్పెండ్ చేసిన జేడీఎస్

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు : టీడీపీ - జనసేన - బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టో ముఖ్యాంశాలు ఇవే..

బీజేపీ రాజ్యాంగ పుస్తకాన్ని విసిరివేయాలనుకుంటోంది.. రాహుల్ గాంధీ ఫైర్

విజయవాడలో దారుణం : ఇంటిలో రక్తపు మడుగులో నాలుగు శవాలు.. ఇంటి బయట మరో శవం..

కోకో చెట్లను తుడిచిపెట్టే వినాశకరమైన వైరస్

రేపటి నుండి పుష్పపుష్ప జపం చేస్తారంటూ తాజా అప్డేట్ ఇచ్చిన సుకుమార్

విరాజ్ అశ్విన్ క్లాప్ తో ఆర్ట్ మేకర్స్ చిత్రం ప్రారంభం

ఐవీఎఫ్ ద్వారా తల్లి కాబోతోన్న మెహ్రీన్...

డీప్ ఫేక్ వీడియో కేసు.. ముంబైకి వెళ్లిన రష్మిక మందన్న.. ఎందుకో తెలుసా?

ధర్మం కోసం యుద్ధం ప్రకటించిన హరిహర వీరమల్లు - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments