Webdunia - Bharat's app for daily news and videos

Install App

శరీరానికి తాత్కాలిక శక్తినిచ్చే కూల్‌డ్రింక్స్‌తో ఆరోగ్యానికి హాని?

Webdunia
సోమవారం, 4 జనవరి 2016 (12:04 IST)
పండ్లు, కాయగూరలు ఇవన్ని ఆరోగ్యానికి మేలు చేసేవి. ఆయా సీజన్లలో పండే పండ్లు, కూరగాయలు ఆరగించడం మనకు అలవాటు. ప్రకృతిసిద్ధమైన పండ్లు, కూరగాయలు ఆహారంగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావలసిన అన్నిరకాల పోషకాలు మనకు లభిస్తుంది. ప్రకృతి సిద్ధమైన పండ్లు, కూరగాయలుతో తయారుచేసే పదార్థాలు ఆరోగ్యానికి ఎప్పుడు మేలు చేస్తుంది. ఏ కాలంలోనైనా దాహం అనిపించినప్పుడు మనకు మొదట గుర్తుకొచ్చేది కూల్‌డ్రింక్స్. 
 
శరీరానికి తాత్కాలిక శక్తినిచ్చే కూల్‌డ్రింక్స్ అంటే చాలామంది ఇష్టం. రకరకాల రంగుల్లో ఆకర్షణీయంగా కనిపించే వీటిల్లో చక్కెరతో పాటు కెఫీన్‌ కూడా ఎక్కువగానే ఉంటుంది. అందువల్ల వీటిని తాగినవెంటనే తాత్కాలికంగా హుషారుగా, మత్తుగా అనిపిస్తుంది. కానీ ఈ కూల్‌డ్రింక్స్ ఆరోగ్యానికి ఎంతో హాని కలిగిస్తుంది. ఇవి రక్తపోటు పెరగటానికే కాదు, గుండె సమస్యలకు దారితీస్తుంది. అలాగే శక్తినిచ్చే పానీయాలు తాగినవారికి రక్తపోటు కూడా సగటున 3.5 పాయింట్లు పెరుగుతున్నట్టు పరిశోధకులు గుర్తించారు. 
 
కాబట్టి అధిక రక్తపోటు లేదా క్యూటీ సిండ్రోమ్‌ గలవారు శక్తి పానీయాలను తీసుకునేముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించడం మంచిదని నిపుణులు అంటున్నారు. శక్తినిచ్చే పానీయాల్లో కెఫీన్‌ మూలంగా వీటికి అలవాటుపడే ప్రమాదమూ ఉంది. దీంతో వీటిని తాగకపోతే కొన్నిసార్లు తలనొప్పి, అలసట, చిరాకు వంటి లక్షణాలు కనిపిస్తుంది. కెఫీన్‌ సేవించడం వల్ల శరీరంలోని నీటి స్థాయి తగ్గిపోతుంది. కాబట్టి దాహం వేసినప్పుడు ఇలాంటి శక్తినిచ్చే పానీయాల కన్నా నీళ్లు తాగటమే మేలు.

ఆకాశం నుంచి చీకటిని చీల్చుకుంటూ భారీ వెలుగుతో ఉల్క, ఉలిక్కిపడ్డ జనం - video

దేశ ప్రజలకు వాతావరణ శాఖ శుభవార్త - మరికొన్ని రోజుల్లో నైరుతి!

మెగా ఫ్యామిలీని ఎవరైనా వ్యక్తిగతంగా విమర్శిస్తే ఒప్పుకోను: వంగా గీత

నోరుజారిన జగన్ మేనమామ... రాష్ట్రాన్ని గబ్బు చేసిన పార్టీ వైకాపా!!

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఇంజిన్‌లో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

Show comments