Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోజూవారీ డైట్‌లో ఎలాంటి ఆహారం తీసుకోవాలి.. బ్రొకోలి.. బాదం పప్పులు తీసుకుంటే?

చాలామంది బతకడానికి ఏదోకటి తినాలని తింటుంటారు. కాని ఏం తింటున్నారో కూడా పట్టించుకోరు. విటమిన్లు, ఖనిజాలు, పోషకపదార్థాలు ఎక్కువ ఉండే ఆహారపదార్థాలు శరీరాన్ని ఎంతో ఆరోగ్యకరంగా ఉంచుతాయి. ఫైటోన్యూట్రియంట్స్

Webdunia
మంగళవారం, 21 జూన్ 2016 (16:45 IST)
చాలామంది బతకడానికి ఏదోకటి తినాలని తింటుంటారు. కాని ఏం తింటున్నారో కూడా పట్టించుకోరు. విటమిన్లు, ఖనిజాలు, పోషకపదార్థాలు ఎక్కువ ఉండే ఆహారపదార్థాలు శరీరాన్ని ఎంతో ఆరోగ్యకరంగా ఉంచుతాయి. ఫైటోన్యూట్రియంట్స్‌, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్‌-ఎ, విటమిన్‌-ఇ, వంటివి కూడా మనం తినే ఆహారంలో తప్పనిసరిగా ఉండే విధంగా చూసుకోవాలి. అలాంటి బలవర్థకమైన ఆహారపదార్థాలు క్రమం తప్పకుండా రోజూవారీ డైట్‌లో తీసుకుంటే ఆరోగ్యంగా ఉంచడంతో పాటు యంగ్‌గా ఉండేందుకు సహకరిస్తుంది.
 
యాపిల్స్‌లో పీచుపదార్థాలు, విటమిన్‌-సి లు పుష్కలంగా ఉంటుంది. బ్లూ బెర్రీస్‌లో ఫైటోన్యూట్రియంట్స్‌ బాగా ఉంటాయి. ఇవి గుండెజబ్బులు, డయాబెటిస్‌ లాంటి క్రానిక్‌ అనారోగ్య సమస్యలు తలెత్తకుండా కాపాడుతుంది. జ్ఞాపకశక్తిని కూడా పెంచుతుంది. వృద్ధాప్యంలో అనారోగ్య సమస్యలు రాకుండా అరికడుతుంది.
 
బాదం పప్పుల్లో పోషకాలు పుష్కలంగా లభిస్తుంది. పీచుపదార్థాలు, కాల్షియం, మెగ్నీషియం, ఐరన్‌ ఇందులో ఉంటాయి. బాదం పప్పులు తింటే గుండెకు ఎంతో మంచిది. వీటిల్లో ఉండే మోనోసాచ్యురేటెడ్‌ ఫ్యాట్‌ ఆరోగ్యవంతమైంది‌. ఇది రక్తంలోని కొలెస్ట్రాల్ లెవెల్స్‌ను తగ్గించడానికి తోడ్పడుతుంది.
 
పచ్చరంగులో ఉండే బ్రొకోలీలో ఫైటోన్యూట్రియంట్స్‌తోపాటు విటమిన్‌- సి కూడా అధికంగా ఉంటుంది. ఇందులో విటమిన్‌-ఎ కూడా అధికంగా ఉంటుంది. కంటి ఆరోగ్యానికి ఇది ఎంతో మంచిది.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

మనం జగనన్న సైన్యం... చంద్రబాబుకు భయం పుట్టేలా చేద్దాం : కార్యకర్తలకు చెవిరెడ్డి పిలుపు

బద్ధలైన లకి లకి అగ్నిపర్వతం - వెనక్కి వచ్చిన ఎయిరిండియా విమానం

కుప్పం మహిళతో ఫోన్‌లో మాట్లాడిన చంద్రబాబు: ఇంకా రూ.5లక్షల ఆర్థిక సాయం

భార్యతో శృంగారానికి ఆన్‌లైన్ ఆఫర్ చేసిన భర్త...

కేటీఆర్‌కు ఏసీబీ అల్టిమేటం - నేటి సాయంత్రం వరకు డెడ్‌లైన్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కవిన్, అపర్ణాదాస్ నటించిన పాపా మెప్పించిందా... రివ్యూ

Nayanatara: ముస్సోరీలో చిరంజీవి157 చిత్రం షూటింగ్ లో ఎంట్రీ ఇచ్చిన నయనతార

సినిమా రిజల్ట్ తర్వాత సమీక్షించుకుని తర్వాత డిసైడ్ చేసుకుంటా : డైరెక్టర్ ఫణీంద్ర నర్సెట్టి

విజయ్ సేతుపతి, సంయుక్త జంటగా పూరి జగన్నాథ్ చిత్రం

తమ్ముడు నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ భూ అంటూ భూతం.. రిలీజ్

తర్వాతి కథనం
Show comments