భోజనం చేసే సమయంలో చల్లటి నీటిని తాగవచ్చా..?

Webdunia
శుక్రవారం, 31 మే 2019 (16:05 IST)
మంచి నీరు తాగడం ఆరోగ్యానికి చాలా మంచిది. రోజులో వీలైనంత వరకు నీటిని తాగడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు. దీంతో చాలా మంది నీటిని ఎక్కువగా తాగుతుంటారు. అందులోనూ చాలా చల్లగా ఉండే నీటిని తాగేందుకు ఇష్టపడుతుంటారు. ముఖ్యంగా ఎండకాలంలో అయితే దాహంగా ఉందని ఫ్రిజ్‌లో నుండి తీసిన నీటిని, అలాగే గడ్డకట్టిన నీటిని తాగుతుంటారు. 
 
ఇలా మరీ చల్లగా ఉండే నీటిని తాగడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు కలుగుతాయి. వేడి నీటి వల్ల చర్మ రంధ్రాలు తెరుచుకుంటాయి. అదే చల్లటి నీరు అయితే చర్మ రంధ్రాలు మూసుకుపోతుంటాయి. మామూలుగా చల్లటి నీటిని తాగడం వల్ల జీర్ణాశయం కుచించుకుపోతుంది. అంతేకాదు చల్లటి నీరు జీర్ణమై రక్తంలో కలిసే వేగం తగ్గుతుంది. దీని కారణంగా ఒక్కోసారి డీహైడ్రేషన్‌కి గురవుతుంటాం. 
 
భోజనం చేస్తున్నప్పుడు లేదా తిన్న తర్వాత చల్లటి నీటిని తాగడం వల్ల ఆహారంలోని కొవ్వుపదార్థాలు గడ్డకట్టుకుపోతాయి. దీంతో జీర్ణాశయం స్థాయికి మించి పని చేయవలసి ఉంటుంది. కాబట్టి చల్లటి నీటి కంటే గోరువెచ్చని నీటిని తాగడానికే ప్రాధాన్యం ఇవ్వాలి. ఇలా చేయడం వల్ల జీర్ణ సమస్యలు తగ్గడమే కాకుండా బరువు తగ్గడానికి కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

కాశ్మీర్ లోయ అందాలు చూద్దామని కేబుల్ కార్ ఎక్కితే గాలిలో వేలాడదీసింది, 300 మంది కేకలు, అరుపులు

ముగ్గురు ADMK ఎమ్మెల్యేలు రాజీనామా, పావులు కదుపుతున్న విజయ్, అన్నాడీఎంకె అంతమేనా?

ఎబోలా వైరస్‌పై ఆంధ్రప్రదేశ్ అప్రమత్త చర్యలు

మే 25 నుంచి రోహిణి కార్తె ప్రారంభం.. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దు..

రెండోసారి కూతురే పుట్టిందని 10 నెలల పసికందును హతమార్చిన కన్నతండ్రి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ramcharan: పెద్ది వన్ ఆఫ్ ది బెస్ట్ ఫిల్మ్స్ అవుతోంది రాసిపెట్టుకోండి.: రామ్ చరణ్

DilRaju: తెలంగాణా ఎగ్జిబిటర్లకు మెగాస్టార్ చిరంజీవి ఇచ్చిన హామీ ఏమిటో తెలుసా !

వేణు ఉడుగుల ఆవిష్కరించిన సింగిల్ రాజు టైటిల్, గ్లింప్స్

పెద్ది రామ్‌చరణ్ బాడీగార్డుకి రోజుకి రూ. 2 లక్షల జీతం, అదిరిపోతున్న టాలీవుడ్

Colors Swathi: పెళ్ళి చేసుకోవడం కంటే కుక్కను పెంచుకోవడం బెటర్.. స్వాతి

తర్వాతి కథనం
Show comments