Webdunia - Bharat's app for daily news and videos

Install App

తేనెను వేడిచేసి తీసుకుంటే ఆరోగ్యానికి హాని చేస్తుందా?

Webdunia
శనివారం, 30 జులై 2022 (22:25 IST)
తేనెలో ఎన్నో పోషకాలున్నాయి. ఇటీవలి కాలంలో తేనె వాడకం క్రమంగా పెరిగింది. ఉదయం వేళ తేనె కలుపుకుని గోరువెచ్చని నీళ్లను తాగేవారు వున్నారు. ఐతే తేనెను పొయ్యి మీద పెట్టి వేడి చేయరాదని ఆయుర్వేద నిపుణులు చెపుతున్నారు. సహజ వైద్యం ప్రభావాలను తేనెను ముడి రూపంలో పొందవచ్చు. ఐతే తేనెను వేడిచేయడం వల్ల అందులో వున్న సమ్మేళనాల రూపం మారిపోతుంది. ఇది ఆరోగ్య ప్రమాదాలకు దారితీయవచ్చని ఆరోగ్య నిపుణులు చెపుతున్నారు.

 
తేనెను వేడి చేయడం ప్రతికూల ప్రభావాలను కలిగిస్తుంది. దీన్ని ఉడికించడం వల్ల నాణ్యత క్షీణిస్తుంది. దాని అవసరమైన ఎంజైమ్‌లు, పోషకాలను కోల్పోతుంది. వేడిచేసిన తేనె ప్రాణాంతకం కావచ్చు. తేనెను 40 డిగ్రీల సెల్సియస్‌ వరకూ వేడి చేయడం వల్ల ప్రతికూల రసాయన మార్పు వస్తుంది. అది చేదుగా మారుతుంది. వేడి చేయడం వల్ల తేనెలో వున్న ప్రయోజనకరమైన లక్షణాలు నాశనమవుతాయి.

 
ఎందుకంటే ఓ నిర్దిష్ట ఉష్ణోగ్రత వద్ద అప్పటికే వేడి చేయబడి ప్రాసెస్ చేసిన తేనెను కొనుగోలు చేసి తిరిగి దాన్ని వేడి చేస్తే నెగటివ్ ఫలితాలు వస్తాయి. ఆయుర్వేదం ప్రకారం తేనెను వేడి చేసినప్పుడు జిగురుతో సమానంగా మారుతుంది. ఇలాంటి తేనెను తీసుకుంటే... జీర్ణవ్యవస్థలోని జీర్ణం కాని ఆహారంగా... అంటే హానికర పదార్థంగా మార్చేస్తుంది. ఇది అనారోగ్యానికి మూల కారణం అవుతుంది. ఫలితంగా బరువు పెరగడం, శ్వాసకోశ వ్యాధులు, జీర్ణ సమస్యలు, రక్తంలో గ్లూకోజ్ అసమతుల్యతలకు దోహదం చేస్తుంది. తేనెను పాశ్చరైజ్ చేయడం వల్ల గ్లైసెమిక్ ఇండెక్స్ పెరగవచ్చు. ఇది మధుమేహ వ్యాధిగ్రస్తులకు మంచిది కాదు. కనుక తేనెను ఎట్టి పరిస్థితుల్లో వేడి చేయకూడదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

కేసీఆర్ చుట్టూత కొన్ని దెయ్యాలు ఉన్నాయ్ : ఎమ్మెల్సీ కవిత

Kavitha: తెలంగాణలో మరో షర్మిలగా మారనున్న కల్వకుంట్ల కవిత? (video)

43 సంవత్సరాల జైలు శిక్ష-104 ఏళ్ల వృద్ధుడు- చివరికి నిర్దోషిగా విడుదల.. ఎక్కడ?

Bus Driver: బస్సు డ్రైవర్‌కు గుండెపోటు.. సీటులోనే కుప్పకూలిపోయాడు.. కండెక్టర్ ఏం చేశాడు? (video)

Kishan Reddy: హైదరాబాద్ నగరానికి రెండు ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

RGV: సెన్సార్ బోర్డు కాలం చెల్లిపోయింది.. అసభ్యత వుండకూడదా? రామ్ గోపాల్ వర్మ

మనమంతా కలిసి తెలుగు సినిమాను కాపాడుకోవాలి - నిర్మాత ఎస్ కేఎన్

ఫోక్ యాంథమ్ తో ఆకట్టుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అదితి శంకర్

తమ్మారెడ్డి భరద్వాజ ఆవిష్కరించిన థాంక్యూ డియర్ లుక్

థ్రిల్లర్ గా అర్జున్ అంబటి పరమపద సోపానం చిత్రం రాబోతోంది

తర్వాతి కథనం
Show comments