మోతాదుకి మించి పసుపు వాడితే ఏం జరుగుతుందో తెలుసా?

Webdunia
బుధవారం, 28 జూన్ 2023 (17:30 IST)
శతాబ్దాలుగా ఆయుర్వేద వైద్యంలో పలు వ్యాధుల చికిత్సకు పసుపును ఉపయోగిస్తున్నారు. పసుపు లేకుండా ఏ వంటకం పూర్తి కాదంటే అతిశయోక్తి కాదు. అలాంటి పసుపును మోతాదుకి మించి వాడినా, కొన్ని అనారోగ్య సమస్యలున్నవారు ఉపయోగించినా సమస్యలు వస్తాయి. అవేమిటో తెలుసుకుందాము. కొన్ని అనారోగ్య సమస్యలున్నవారు వాడే మందులకు పసుపు సమస్యను తేవచ్చు. ఎందుకంటే ఇది రక్తాన్ని పలుచగా చేస్తుంది.
 
పసుపు కడుపు నొప్పి, వికారం, అతిసారం కలిగించవచ్చు. కొంతమందిలో ఇది అలెర్జీలకు కారణమవుతుంది. మోతాదుకి మించి పసుపు వాడితే మూత్రపిండాలలో రాళ్లు వచ్చే ప్రమాదాన్ని పెంచవచ్చు. అధికంగా పసుపు వాడితే రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించవచ్చు. ఇప్పటికే కాలేయ వ్యాధి ఉన్నట్లు నిర్ధారణ అయినవారు పసుపును అధిక మోతాదులో తీసుకుంటే మరిన్ని సమస్యలు ఎదురవుతాయి.
 
శస్త్రచికిత్సకు కనీసం రెండు వారాల ముందు పసుపు సప్లిమెంట్లను ఉపయోగించడం మానేయడం మంచిది. తక్కువ రక్తపోటుతో బాధపడుతున్నవారు మోతాదుకి మించి పసుపు వాడితే అది ప్రమాదకరమైనది కావచ్చు. కొన్ని సందర్భాల్లో ఇది అలెర్జీలకు కారణం కావచ్చు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

పూటుగా లిక్కర్ సేవించి ర్యాపిడో ఎక్కిన యువతి, సీటు నుంచి జారుతూ... వీడియో వైరల్

Survey: సర్వేలో బాలకృష్ణపై హిందూపూర్ ప్రజలు ఏమంటున్నారు?

రేవంత్ రెడ్డి బెస్ట్ సీఎం అవుతాడనుకుంటే అలా అయ్యారు: వీడియోలో కెఎ పాల్

పులివెందులలో జగన్‌కు ఎదురుదెబ్బ.. వేంపల్లి నుండి టీడీపీలో చేరిన వైకాపా సభ్యులు

Chandrababu: ఇండిగో సంక్షోభం.. స్పందించిన చంద్రబాబు.. ఏమన్నారంటే?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

షూటింగులో ప్రమాదం... హీరో రాజశేఖర్‌ కాలికి గాయాలు

Tarun Bhaskar: రీమేక్ అయినా ఓం శాంతి శాంతి శాంతిః సినిమాని లవ్ చేస్తారు : తరుణ్ భాస్కర్

ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్.. ఏం కష్టమొచ్చిందో?

Rana: చాయ్ షాట్స్ కంటెంట్, క్రియేటర్స్ పాపులర్ అవ్వాలని కోరుకుంటున్నా: రానా దగ్గుపాటి

Pawan Kalyan!: పవన్ కళ్యాణ్ తో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ చిత్రం !

తర్వాతి కథనం
Show comments