Webdunia - Bharat's app for daily news and videos

Install App

అరటి పండును ఎలా తినాలో తెలుసా?

Webdunia
సోమవారం, 25 నవంబరు 2019 (20:37 IST)
అరటిపండు మన శరీర బరువును బాగా పెంచుతుంది అని చాలామంది అనుకుంటుంటారు. అందుకే చాలామంది అరటిపండును తినరు. కొంతమంది అరటిపండును కొనడానికి బాగా భయపడతారు. కానీ అరటిపండును సరైన క్రమంలో తింటే అధిక బరువు అస్సలు పెరగరంటున్నారు వైద్య నిపుణులు.
 
అనేక రోగాలను అరటిపండు దూరం చేస్తుందట. మంచి ఔషధంలా కూడా పనిచేస్తుందట. అరటిపండును తినకూడని సమయంలో తింటేనే అది శరీరానికి హానికరమంటున్నారు వైద్యనిపుణులు. చాలామంది అరటిపండ్లను రోజూ మూడునాలుగు తినేస్తుంటారు. అలా తినకూడదట. రోజుకు రెండు మాత్రమే తినాలట. అది కూడా ఖాలీ కడుపుతో తినాలట. అలా తింటే స్లిమ్ కూడా అవుతారట.
 
అరటిపండులో ఫైబర్ సంపూర్ణంగా ఉంటుందట. కొంతమంది అరటిపండు తింటే మలబద్ధకం సమస్య వస్తుందనుకుంటారు. కానీ ఖాళీ కడుపుతో అరటిపండు తింటే శరీరంలో మంచి ప్రయోజనాలు ఉంటాయట. అరటిపండులో ఉన్న ఫైబర్ జీర్ణక్రియ శక్తిని పెంచుతుందట. అరటిపండులో కాల్షియం సంపూర్ణంగా ఉంటుందట. ఎవరికైతే ఎముకల్లో నొప్పులు ఉంటాయో.. జాయింట్ పెయిన్స్ ఉంటాయో.. పంటి నొప్పుల సమస్యలు ఉంటాయో వారు ఖాళీ కడుపుతో అరటిపండు తింటే ఈ సమస్యలన్నింటినీ చెక్ పెట్టొచ్చట.
 
పంటి నొప్పి నొప్పి ఎక్కువగా ఉన్న వారు కూడా అరటిపండు తింటే మంచిదట. అరటిపండులో విటమిన్ బి.6 ఉంటుందట. డయాబెటిస్ కూడా కంట్రోల్లో ఉంచుతుందట. హైబిపి సమస్య ఉంటుందో వారు అరటిపండును రెగ్యులర్‌గా తినాలి. శరీరంలో బ్లడ్ సంపూర్ణంగా ఉండాలంటే కూడా ఉదయాన్నే అరటిపండు తినాలట.

సంబంధిత వార్తలు

మే 17 నుంచి 19 వరకు శ్రీ పద్మావతి శ్రీనివాస పరిణయోత్సవం

నెల్లూరు టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డికి ఓటు వేసిన వైకాపా ఎమ్మెల్యే!!

తెలంగాణ ఏర్పడి జూన్ 2 నాటికి 10 సంవత్సరాలు.. అవన్నీ స్వాధీనం

ఏపీ సీఎస్, డీజీపీలకు కేంద్ర ఎన్నికల సంఘం సమన్లు!

ఘోరం, క్రికెట్ ఆడుతుండగా యువకుడి తలపై పడిన పిడుగు, మృతి

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

తర్వాతి కథనం
Show comments