Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఖర్జూరాలు తప్పక తినాల్సిందే..

ఖర్జూరాలను రోజుకు రెండేసి తప్పక తినాల్సిందే అంటున్నారు.. ఆరోగ్య నిపుణులు. ఖర్జూరం రోజూ తినడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది. హృద్రోగాలను దూరం చేసుకోవచ్చు. ఇందులో యాంటీఆక్సీడెంట్ల రూపంలో ఉండే విటమిన్-సి

Webdunia
గురువారం, 19 ఏప్రియల్ 2018 (11:45 IST)
ఖర్జూరాలను రోజుకు రెండేసి తప్పక తినాల్సిందే అంటున్నారు.. ఆరోగ్య నిపుణులు. ఖర్జూరం రోజూ తినడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది. హృద్రోగాలను దూరం చేసుకోవచ్చు. ఇందులో యాంటీఆక్సీడెంట్ల రూపంలో ఉండే విటమిన్-సి కంటికి మేలు చేస్తుంది. రోజూ వీటిని డైట్‌లో చేర్చుకోవడం ద్వారా కంటి దృష్టిలోపాలుండవు.
 
ఖర్జూరాలు ఆరోగ్యకరమైన బరువు పెంచేందుకు తోడ్పడతాయి. బక్కపలచగా ఉన్నవారు రోజూ ఖర్జూరాన్ని తినడం వల్ల సహజంగా బరువు పెరుగుతారు. కాబట్టి రోజువారి ఆహారంలో ఖర్జూరాన్ని చేర్చుకోవడం మంచిది. 
 
ఇంకా కిడ్నీల్లో ఏర్పడే రాళ్లను కరిగించే శక్తి ఖర్జూరాలకు ఉంది. అంతేకాకుండా మూత్ర సంబంధిత సమస్యలను, ఇన్‌ఫెక్షన్లని దూరం చేస్తుంది. ఖర్జూరాలు ఎముకలకు బలాన్నిస్తాయి. ఇందులో క్యాల్షియం, మెగ్నీషియం, కాపర్ సమృద్ధిగా ఉన్నాయి. ఖర్జూరాలు జలుబు, గొంతులో శ్లేష్మాన్ని తగ్గిస్తుంది. రక్తహీనత సమస్యను దూరం చేస్తుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

తర్వాతి కథనం
Show comments