Webdunia - Bharat's app for daily news and videos

Install App

వేసవిలో కీరదోసకాయను రోజూ తినండి.. లేకుంటే?

వేసవి కాలం వచ్చేసింది.. ఎండలు మార్చిలోనే మండిపోతున్నాయి. వేసవిలో వడదెబ్బ తగలకుండా వుండాలంటే.. పానీయాలను అధికంగా తీసుకోవాలి. జ్యూస్‌లు, పండ్లు, కొబ్బరి నీరును సేవిస్తుండాలి. ముఖ్యంగా ఎండాకాలంలో కీరదోసన

Webdunia
శనివారం, 10 మార్చి 2018 (19:03 IST)
వేసవి కాలం వచ్చేసింది.. ఎండలు మార్చిలోనే మండిపోతున్నాయి. వేసవిలో వడదెబ్బ తగలకుండా వుండాలంటే.. పానీయాలను అధికంగా తీసుకోవాలి. జ్యూస్‌లు, పండ్లు, కొబ్బరి నీరును సేవిస్తుండాలి. ముఖ్యంగా ఎండాకాలంలో కీరదోసను తప్పక తీసుకోవాలి. లేకుండే శరీరం డీ-హైడ్రేషన్‌కు లోనవుతుంది. కీరలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. 
 
కీరను ప్రతి రోజు తీసుకోవడం వల్ల శరీరం తేమను కోల్పోదు. పొట్ట శుభ్రపడుతుంది. కిడ్నీలోని రాళ్లను కరిగించడంలో బాగా పనిచేస్తుంది. వేసవిలో ప్రతిరోజూ రెండు గ్లాసుల కీరదోస జ్యూస్ తాగితే అల్సర్ దూరమవుతుంది. వేసవిలో పండ్లతో చేసిన సలాడ్స్‌లో కీర ముక్కలు తీసుకోవడం మంచిది. కీరదోసలో పాస్పరస్‌, విటమిన్లు, పోటాషియం, నీటి శాతం, మెగ్నీషియం, మినరల్స్‌, జింక్‌, ఐరన్‌, కాల్షియంలు పుష్కలంగా ఉంటాయి. 
 
చర్మాన్ని సంరక్షించే ఎన్నో రకాల ఔషధ గుణాలు కీరదోసకాయల్లో ఉన్నాయి. కీరతో జీర్ణక్రియ మెరుగుపడుతుంది. క్యాలరీలు తక్కువ ఉండడం చేత కీరదోసకాయ బరువు తగ్గాలనుకునే వారికి చక్కగా ఉపయోగించుకోవచ్చు. దృష్టి సంబంధ సమస్యలను కీరదోసకాయ దూరం చేస్తుంది. కళ్ల కింద ఏర్పడే నల్లని వలయాలను కీరదోస దూరం చేస్తుంది. మధుమేహం, కొలెస్ట్రాల్‌లను తగ్గించేందుకు కీరదోస ఉపయోగపడుతుంది. దీన్ని నిత్యం తీసుకుంటే బీపీ కూడా అదుపులోకి వస్తుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

మే 17 నుంచి 19 వరకు శ్రీ పద్మావతి శ్రీనివాస పరిణయోత్సవం

నెల్లూరు టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డికి ఓటు వేసిన వైకాపా ఎమ్మెల్యే!!

తెలంగాణ ఏర్పడి జూన్ 2 నాటికి 10 సంవత్సరాలు.. అవన్నీ స్వాధీనం

ఏపీ సీఎస్, డీజీపీలకు కేంద్ర ఎన్నికల సంఘం సమన్లు!

ఘోరం, క్రికెట్ ఆడుతుండగా యువకుడి తలపై పడిన పిడుగు, మృతి

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

తర్వాతి కథనం
Show comments