మద్యం సేవిస్తూ అవి తింటే గుండెపోటు ఖాయం, ఏంటవి?

Webdunia
బుధవారం, 24 ఫిబ్రవరి 2021 (22:59 IST)
మద్యం పుచ్చుకోవడం ఇటీవల సాధారణమైన విషయంగా మారిపోయింది. ఇదివరకు ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో మద్యం దుకాణాలుండేవి. ఇప్పుడు మెయిన్ రోడ్డు ప్రక్కనే దర్జాగా కుర్చీల్లో కూర్చుని మద్యం బాటిళ్లను ఎదురుగా పెట్టుకుని తాగేస్తున్నారు. వీటితో పాటు సైడ్ డిష్‌గా మసాలాతో దట్టించిన పదార్థాలను కొందరు తింటే మరికొందరు వారికి ఇష్టమైనవవి తీసుకుంటూ వుంటారు. ఐతే కొన్ని పదార్థాలను మద్యంతో పాటు సేవిస్తే గుండెపోటు రావడం ఖాయం అంటున్నాయి పలు అధ్యయనాలు.
 
మద్యం సేవిస్తూ వేయించిన వేరుశెనగ పప్పు, లేదంటే పొడి జీడిపప్పు తినడం చాలామంది చేస్తుంటారు. కానీ వీటిని మద్యంతో పాటు తినరాదంటున్నారు. ఎందుకంటే వేరుశెనగ, జీడిపప్పులో కొలెస్ట్రాల్ అధికం. ఈ కొలెస్ట్రాల్ ఆరోగ్యానికి చాలా హానికరం. కొలెస్ట్రాల్ పెరగితే గుండెపోటు ప్రమాదం కూడా పెరుగుతుంది. కనుక వాటిని తీసుకోకపోవడం మంచిదంటున్నారు.
 
మరికొందరు సోడా లేదా కోల్డ్ డ్రింక్‌తో పాటు మద్యం సేవిస్తుంటారు. ఇది ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. ఎలాగంటే ఆల్కహాల్‌లో సోడా లేదా శీతల పానీయం కలిపి తాగడం వల్ల శరీరంలోని నీటి శాతం తగ్గిపోతుంది. ఫలితంగా శరీరం పట్టుతప్పి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి.
 
మద్యంతో పాటు జున్ను ముక్కలు తింటారు కొందరు. పాల ఉత్పత్తులతో తయారైన వస్తువులను మద్యం సేవించే సమయంలోనే కాదు ఆ తర్వాత ఒక గంట సమయం వరకు తినరాదు. పాలతో చేసిన వస్తువులను తినడం వల్ల జీర్ణక్రియను దెబ్బతీసి గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతుంది. అలాగే మద్యం సేవిస్తున్న సమయంలోగానీ లేక ఆ తర్వాత ఒక గంటసేపు వరకు తియ్యని పదార్థాలు తినకూడదు. మద్యంతో తీపి తింటే మత్తును రెట్టింపు చేస్తుంది. దీనితో, వ్యక్తి తన నియంత్రణ కోల్పోయే అవకాశాలు అధికంగా ఉన్నాయని చెపుతున్నారు. కనుక మందుబాబులు తస్మాత్ జాగ్రత్త. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఏపీ అభివృద్ధి అదుర్స్.. క్యూ2లో రాష్ట్రం జీఎస్డీపీలో 11.28 శాతం పెరుగుదల.. చంద్రబాబు

Jagan: జగన్ కడప బిడ్డా లేక కర్ణాటక బిడ్డా: రెడ్డప్పగారి శ్రీనివాస రెడ్డి ప్రశ్న

పూర్వోదయ పథకం కింద రూ.40,000 కోట్ల ప్రాజెక్టులు.. ప్రతిపాదనలతో సిద్ధం కండి..

తెలంగాణాకు పెట్టుబడుల వరద : రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌తో రూ.5.75 లక్షల కోట్ల ఇన్వెస్ట్‌మెంట్స్

అయ్యప్ప భక్తులూ తస్మాత్ జాగ్రత్త... ఆ జలపాతం వద్ద వన్యమృగాల ముప్పు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akhanda 2 date: బాలక్రిష్ణ అఖండ 2 రిలీజ్ డేట్ ను ప్రకటించిన నిర్మాతలు - డిసెంబర్ 12న రిలీజ్

ఆహ్వానించేందుకు వచ్చినపుడు షూటింగ్‌లో డ్యాన్స్ చేస్తున్నా : చిరంజీవి

పవన్ కల్యాణ్‌కు మొండి, పట్టుదల ఎక్కువ.. ఎక్కడా తలొగ్గడు.. జయసుధ (video)

శాంతారామ్ బయోపిక్‌లో తమన్నా.. పోస్టర్ రిలీజ్ చేసిన టీమ్.. లుక్ అదుర్స్

శర్వా... నారి నారి నడుమ మురారి రిలీజ్-ముహూర్తం ఖరారు

తర్వాతి కథనం
Show comments