Webdunia - Bharat's app for daily news and videos

Install App

కిడ్నీ‌లో రాళ్ళను నివారించే 'ఔషధ గుణాల' యాలకులు..!

Webdunia
శనివారం, 30 జనవరి 2016 (10:23 IST)
చక్కని రుచితోపాటు సువాసనను అందించే యాలకులను మనం నిత్యం వివిధ రకాల వంటకాల్లో వాడుతుంటాం. అయితే ఇది కేవలం ఆహారానికి మాత్రమే కాకుండా ఆరోగ్యకర ప్రయోజనాలనిచ్చే ఔషధంగానూ మనకు ఉపయోగపడుతుంది. దీన్ని తరచూ తీసుకోవడం వల్ల కలిగే లాభాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
 
తరచూ యాలకులను తీసుకుంటే  మూత్రాశయం, కిడ్నీ‌లో రాళ్ళు మూత్రంలో మంట వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. మూత్రాశయ ఇన్‌ఫెక్షన్లకు ఔషధంగా పనిచేస్తుంది. బీపీని తగ్గిస్తుంది. కిడ్నీల్లో పేరుకుపోయిన కాల్షియం, యూరియా సంబంధ పదార్థాలను బయటకి పంపిస్తుంది. 
 
యాలకులతో జీర్ణ సంబంధ సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి. కడుపులో మంట, అసిడిటీ తదితర అనారోగ్యాలను తగ్గిస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. మలబద్దకం తొలగిపోతుంది. యాలకులను నమలడం వల్ల ఆకలి కూడా పెరుగుతుంది. 
 
రక్తహీనతను నివారించే అద్భుతమైన యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు యాలకుల్లో ఉన్నాయి. రక్తహీనత వల్ల వచ్చే అలసట, నిస్సత్తువ వంటి లక్షణాలను యాలకుల్లోని కాపర్, ఐరన్, మాంగనీస్, రైబోఫ్లేవిన్, విటమిన్ సి, నియాసిన్ వంటివి తగ్గిస్తాయి. ఇవి ఎర్రరక్తకణాల సంఖ్యను కూడా పెంచుతుంది. మెటబాలిజయం ప్రక్రియను మెరుగు పరుస్తాయి. ఒక గ్లాస్ వేడి పాలలో కొంత పసుపును, యాలకుల పొడిని కలిపి రోజూ రాత్రి పూట తీసుకుంటే నీరసం తగ్గుతుంది. రక్తహీనత వల్ల వచ్చే ఇతర అనారోగ్యాలు కూడా దూరమవుతాయి. 
 
యాలకులు, దాల్చినచెక్కల పొడిని నీటిలో వేసి మరిగించి ఆ నీటిని ఉదయాన్నే గొంతులో వేసుకుని పుక్కిలిస్తే గొంతులో మంట, నొప్పి వంటివి తగ్గుతాయి. 
 
భోజనం చేసిన ప్రతిసారీ కొన్ని యాలకులను తింటే నోటి నుంచి వచ్చే దుర్వాసన తగ్గుతుంది. ప్రతి రోజూ ఉదయాన్నే యాలకుల టీని తాగినా నోటి దుర్వాసన దూరమవుతుంది. 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments