Webdunia - Bharat's app for daily news and videos

Install App

వరిపిండిలో పెరుగు కలిపి ముఖానికి పట్టిస్తే..?

ఎన్నిసార్లు ముఖాన్ని శుభ్రపరచుకున్నా ముఖం జిడ్డుగా కనిపిస్తోందా.. మజ్జిగతో ముఖం, మెడను బాగా శుభ్రపరచి పదిహేను నిమిషాల తరవాత ఫౌండేషన్ క్రీం రాసుకున్నట్లయితే ముఖం జిడ్డు కారకుండా ఉంటుంది. మజ్జిగ దాహం తీ

Webdunia
సోమవారం, 15 ఆగస్టు 2016 (14:25 IST)
ఎన్నిసార్లు ముఖాన్ని శుభ్రపరచుకున్నా ముఖం జిడ్డుగా కనిపిస్తోందా.. మజ్జిగతో ముఖం, మెడను బాగా శుభ్రపరచి పదిహేను నిమిషాల తరవాత ఫౌండేషన్ క్రీం రాసుకున్నట్లయితే ముఖం జిడ్డు కారకుండా ఉంటుంది. మజ్జిగ దాహం తీర్చడానికి మాత్రమే కాదు చర్మ సౌందర్యానికి ఎంతో మేలు చేస్తుంది. వరిపిండిలో పెరుగు కలిపి ఆ ముద్దని ముఖానికి, మెడకి, ఒంటికి పట్టించి 15 నిమిషాల తరువాత స్నానం చేయడం మంచిది. దీనివల్ల చర్మం బాగా శుభ్రపడుతుంది.
 
బాదం నూనె, పన్నీరు, ఒక చెంచా మజ్జిగ కలిపి ముఖానికి, మెడకి, శరీరానికి స్నానం ముందు పట్టించి అరగంట తరువాత స్నానం చేయాలి. రెండు చెంచాల ఈస్ట్‌ను రెండు చెంచాల పెరుగుతో కలిపి ఆ మిశ్రమాన్ని ముఖానికి రాసి 15 నిమిషాల పాటు ఉంచి తరువాత గోరు వెచ్చని నీటితో కడుక్కోవాలి. ఇలా చేస్తే చర్మం మృదువుగా మారుతుంది.
 
మజ్జిగను మాడుకు పట్టించి 20 నిమిషాల తర్వాత స్నానం చేస్తే నిగనిగలాడే కురులు మీ సొంతమవుతుంది. మజ్జిగను చర్మానికి రాసుకుని అరగంట తర్వాత స్నానం చేస్తే.. చర్మ సమస్యలు దూరంకావడంతో పాటు మృదువైన, ప్రకాశమైన  చర్మాన్ని పొందవచ్చు. వారానికోసారి మజ్జిగను చర్మానికి రాసుకుని స్నానం చేస్తే చర్మ సౌందర్యం పెంపొందుతుందని బ్యూటీషియన్లు చెపుతున్నారు. ప్రతిరోజూ ఒక కప్పు పెరుగు తినడంవల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది. కడుపులో మంట తగ్గుతుంది. మెదడుకి చల్లదనాన్ని కలిగిస్తుంది. 

ఆకాశం నుంచి చీకటిని చీల్చుకుంటూ భారీ వెలుగుతో ఉల్క, ఉలిక్కిపడ్డ జనం - video

దేశ ప్రజలకు వాతావరణ శాఖ శుభవార్త - మరికొన్ని రోజుల్లో నైరుతి!

మెగా ఫ్యామిలీని ఎవరైనా వ్యక్తిగతంగా విమర్శిస్తే ఒప్పుకోను: వంగా గీత

నోరుజారిన జగన్ మేనమామ... రాష్ట్రాన్ని గబ్బు చేసిన పార్టీ వైకాపా!!

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఇంజిన్‌లో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

తర్వాతి కథనం
Show comments