Webdunia - Bharat's app for daily news and videos

Install App

అల్పాహారంలో ఇడ్లీ.. కోడిగుడ్డు వుంటే మేలేంటో తెలుసా? (video)

అల్పాహారంలో కూరగాయలు, పండ్లు, ఫైబర్ కూడిన పదార్థాలు వుండాలని వైద్యులు సూచిస్తున్నారు. అలాగే కోడిగుడ్డు, గోధుమలతో చేసిన వంటకాలు, ఇడ్లీలు అల్పాహారంగా తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేసినవారమవుతాం. పాఠశ

Webdunia
మంగళవారం, 2 జనవరి 2018 (17:43 IST)
అల్పాహారంలో కూరగాయలు, పండ్లు, ఫైబర్ కూడిన పదార్థాలు వుండాలని వైద్యులు సూచిస్తున్నారు. అలాగే కోడిగుడ్డు, గోధుమలతో చేసిన వంటకాలు, ఇడ్లీలు అల్పాహారంగా తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేసినవారమవుతాం.

పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు, యువత, మహిళలు, పొద్దున్నే అల్పాహారం తీసుకోవడంపై శ్రద్ధపెట్టరు. అయితే అల్పాహారం విషయంలో నిర్లక్ష్యంగా వుంటే అనారోగ్య సమస్యలు వెతుక్కుంటూ వస్తాయని.. అందుకే పోషకాలున్న ఆహార పదార్థాలను అల్పాహారంలో చేర్చుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 
 
ఇందులో భాగంగా రోజూ అల్పాహారంలో కోడిగుడ్డు వుండేలా చూసుకోవాలని వారు చెప్తున్నారు. మాంసకృత్తులూ, యాంటీఆక్సిడెంట్లు ఉండే గుడ్డును ఉడికించి తింటే, మెదడూ, కాలేయం ఆరోగ్యంగా ఉంటాయి. పైగా దానివల్ల కంటి సంబంధ సమస్యలు కూడా రావు. పొట్ట నిండినట్టు ఉంటుంది. ఎక్కవసేపు ఆకలి కూడా వేయదు. దీనివల్ల రక్తంలో చక్కెర స్థాయులు కూడా అదుపులో ఉంటాయి.
 
అలాగే ఇడ్లీలను అల్పాహారంగా తీసుకుంటే.. బలవర్థకమే కాకుండా జీర్ణక్రియకు తోడ్పడుతుంది. మాంసకృత్తులూ, అమినోయాసిడ్లూ, పిండిపదార్థాలు పుష్కలంగా వుంటాయి. పైగా కొలెస్ట్రాల్ సమస్య వుండదు. అయితే సాంబారు కాకుండా.. చట్నీతో తింటే మంచిది. గోధుమల్లో పీచు ఎక్కువగా వుంటుంది.

గోధుమ ఉప్మా లేకుంటే కూరగాయలతో కలిసి కిచిడీలా చేసుకుని తింటే జీర్ణాశయంలో అనవసరమైన వ్యర్థాలు తొలగిపోతాయి. ఇంకా అల్పాహారంలో బాదం పప్పులు, వాల్‌నట్స్ తీసుకుంటే శరీరానికి పీచు అందుతుంది. తద్వారా బరువు పెరగరని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

భూకబ్జా చేసినట్లు నిరూపిస్తే రాజీనామా చేస్తా.. జగన్ ఈనో వాడండి: నారా లోకేష్

కరోనా చాలదన్నట్టు.. అమెరికా కోసం కొత్త ఫంగస్‌ను అభివృద్ధి చేసిన చైనా (Video)

త్వరలో భారత్‌లో స్టార్ లింక్ సేవలు : కేంద్ర మంత్రి సింథియా

ఒరిస్సా ఆస్పత్రిలో విషాదం.. ఇంజెక్షన్ వికటించి ఐదుగురు మృతి

NTR food habits: ఒకేసారి 40 బజ్జీలు, రెండు ఫుల్ చికెన్ లాగించేసేవారు.. ట్రెండింగ్ ఇదే

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

34 మంది పిల్లలకు తల్లి అయిన ప్రీతి జింటా

Kingdom: మీ కింగ్ డమ్ 30 రోజుల్లో వచ్చేస్తున్నాడు సిద్ధంకండి : విజయ్ దేవరకొండ

Bunny Vas: బన్నీ వాస్ చిత్రం మ్యాడ్ నెస్ ముసుగు వ్యక్తుల కథేమిటి?

అందరి బుర్రలు ఒకేలా ఆలోచించవు కదా : సురేఖా వాణి

అడివి శేష్ పాన్-ఇండియన్ థ్రిల్లర్ డకాయిట్ ఫైర్ థీమ్ రిలీజ్

తర్వాతి కథనం
Show comments