Webdunia - Bharat's app for daily news and videos

Install App

బియ్యం ఉడ‌కక్కర్లేదు.. నాన‌బెడితే చాలు అన్నం అవుతుంది.. ఎలా?

Webdunia
మంగళవారం, 2 ఏప్రియల్ 2019 (20:40 IST)
అన్నం వండావా అంటే ఇంకా లేదు.. ఓ 15 నిమిషాలు ఆగండి కుక్క‌ర్ పెడ‌తా అంటారు గృహిణులు. వేళ‌కాని వేళ‌లో మ‌మ్మీ ఆక‌లి అని పిల్ల‌లు అంటే.. ఓ 10 నిమిషాలు ఆగరా వండి పెడ‌తా అంటారు.. ఇక నుంచి ఈ మాట‌లు వినిపించ‌వు.. అంటే అన్నం తినం అని కాదు.. వండాల్సిన పనిలేదు అని. అన్నం అంటే ఇప్పుడే బియ్యం నాన‌పెట్టా.. ఓ అర గంట ఆగు వ‌డ్డిస్తా అంటారు. అవును... దేశంలోనే ఉత్ప‌త్తి అవుతున్న ఈ ర‌కం బియ్యం.. మ‌రికొన్ని రోజుల్లోనే దేశంలోని అంద‌రికీ అందుబాటులోకి రానున్నాయి. ఇంత‌కీ ఉడ‌కబెట్టకుండా.. నాన‌బెడితే అన్నం త‌యార‌య్యే ఈ ర‌కం బియ్యం విశేషాలు ఏంటో చూద్దాం.
 
అసోంలో పండిస్తున్న ఈ బియ్యం పేరు బోకా సౌల్. అంద‌రూ ముద్దుగా మ్యాజిక్ రైస్ అంటారు. దీనికి మ‌రోపేరు కూడా ఉంది.. అదే మ‌డ్ రైస్. వీటిని అసోంలోని కొండ ప్రాంతాల్లో పండిస్తున్నారు రైతులు. ఈ పంట సీజ‌న్ జూన్ నుంచి డిసెంబ‌ర్ నెల‌. ఈ ఆరు నెల‌లు పంట‌కు అనుకూలం. దొడ్డుబియ్యంలా లావుగా ఉంటాయి. ఈ బియ్యాన్ని పొయ్యి మీద పెట్టి ఉడికించాల్సిన అవ‌స‌రం లేదు. చ‌న్నీళ్ల‌లో ఓ గంట నాన‌బెడితే చాలు.. అన్నం త‌యారవుతుంది.
 
చ‌క్క‌గా తినేయొచ్చు. మామూలు అన్నంలాగే ఉంటుంది. ఓ కేజీ మామూలు రైస్ వండితే.. ఎంత ఎక్కువ అన్నం వ‌స్తుందో.. అదేవిధంగా ఈ మ్యాజిక్ అలియాస్ మ‌డ్ రైస్‌ను నాన‌బెట్టినా అంతే ఎక్కువ వ‌స్తుంది. ఈ పంట పండించ‌టానికి పురుగు మంద‌ులు, ర‌సాయ‌న ఎరువులు అవ‌స‌రం లేదు. పురుగు మందులు చ‌ల్లితే పంట నాశ‌నం అయ్యే ప్ర‌మాదం ఉంది అంటున్నారు వ్య‌వ‌సాయ శాస్త్ర‌వేత్త‌లు.
 
సో.. గ్యాస్‌తో పనిలేదు.. క‌రెంట్ అవ‌స‌రం లేదు.. కుక్క‌ర్లు కొనాల్సిన అవ‌స‌రం లేదు.. జ‌స్ట్ ఓ గంట నాన‌బెడితే చాలు అన్నం త‌యారీ. కొన్ని సంవ‌త్స‌రాలుగా మ‌డ్ రైస్, మ్యాజిక్ రైస్ పండిస్తూనే ఉన్నారు అసోం రైతులు. ఇప్పుడు కేంద్ర ప్ర‌భుత్వం దీనికి పేటెంట్ ఇచ్చింది. దీంతో మ‌రోసారి చ‌ర్చ‌నీయాంశం అయ్యింది. పూర్తి స్వ‌దేశీ ప‌రిజ్ఞానంతో ఈ ర‌కం వంగ‌డాన్ని సృష్టించారు వ్య‌వ‌సాయ శాస్త్ర‌వేత్త‌లు. అసోం రాష్ట్ర ప్ర‌జ‌లు పండుగ‌లు, ఫంక్ష‌న్ల‌లో ఈ బియ్యంతో త‌యారైన అన్నాన్నే ఎక్కువ‌గా ఉప‌యోగిస్తున్నారు. మొఘ‌ల్ రాజుల కాలంలో ఇలాంటి బియ్యం ఉత్ప‌త్తి జ‌రిగింది. 17వ శ‌తాబ్దంలో సైనికులు ఇదే ఆహారంగా తీసుకునేవారంట‌. 
 
పోష‌క విలువ‌ల మాటేంటీ?
ఈ బియ్యంపై ఇప్ప‌టికే ఎన్నో ప‌రిశోధ‌న‌లు జ‌రిగాయి. ముఖ్యంగా గువాహ‌టి యూనివ‌ర్సిటీ ప‌రిశోధ‌న‌ల్లో బోకా సౌల్ బియ్యం విశిష్ట‌త‌ను వివ‌రించారు. ఈ బియ్యంలో పీచుప‌దార్ధం 11 శాతం, మాంస‌కృత్తులు 7 శాతం ఉన్న‌ట్లు తేలింది. ఈ అన్నం వ‌ల్ల శ‌రీరంలో వేడి కూడా త‌గ్గుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Janasena Worker: జనసేన పార్టీ మీటింగ్‌కు వచ్చి.. తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు.. కారణం?

Venkaiah Naidu: 24 గంటల్లో అత్యధిక వీక్షణలతో బ్రెస్ట్ క్యాన్సర్‌పై అవగాహన.. గిన్నిస్ రికార్డ్

Bhajana Senani: గెలవడానికి ముందు జనసేనాని-తర్వాత భజన సేనాని.. పవన్‌పై ప్రకాష్ రాజ్

Pawan Kalyan: హిందీకి వ్యతిరేకం కాదు.. తప్పనిసరి చేస్తేనే ఇబ్బంది.. పవన్ స్పష్టం

తిరుమలలో మందుబాబు హల్ చల్.. మహిళతో వాగ్వాదం.. కొండపైనే మద్యం తాగాడా? (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కన్నప్ప గ్రామం ఊటుకూరు శివాలయాలో పూజలు చేసిన విష్ణు మంచు

Vikram: ఫ్యామిలీ మ్యాన్, రివెంజ్ పర్శన్ గా విక్రమ్ నటించిన వీర ధీర సూర టీజర్

Samantha : సమంత నిర్మాణ సంస్థ త్రలాలా మూవింగ్ పిక్చర్స్ లో శుభం చిత్రం

వారి దగ్గరే ఎదిగాను. వారే సినిమా రిలీజ్ చేయడం ఎమోషనల్ గా ఉంది : సప్తగిరి

ప్రపంచ కవితా దినోత్సవం సందర్భంగా కాలమేగా కరిగింది ట్రైలర్ రిలీజ్

తర్వాతి కథనం
Show comments