Webdunia - Bharat's app for daily news and videos

Install App

సచిన్ టెండూల్కర్‌కి అదివ్వండి, నాకు రాగి జావ ఇవ్వండి, ఏం జరుగుతుందో చూడండి?

Webdunia
సోమవారం, 4 మే 2020 (21:34 IST)
మార్కెట్లో శక్తిని పెంచేందుకు రకరకాల పిండి పదార్థాలు ప్యాకెట్లలో అమ్ముతున్నారు. వాటిని పాలలో కలుపుకుని తాగి బలం శక్తి వస్తుందని అనుకుంటుంటాం. అలాగే క్యాల్షియం పెరుగుతుందని క్యాల్షియం మాత్రలు వేసుకుంటూ వుంటారు మరికొందరు. ఐతే ఓ రైతు ఏమంటున్నారంటే సచిన్ టెండూల్కర్ లాంటి వ్యక్తికి మార్కెట్లో అమ్మే శక్తి పౌడర్లు ఇవ్వండి, నాకు మాత్రం రాగి జావ ఇవ్వండి, పది రోజుల పాటు ఇలాగే చేయండి. 
 
ఎవరు వేగంగా పరుగులు తీస్తారో చూడండి అంటూ సవాల్ విసురారు. ఆయన వేసిన సెటైర్లో ఎంతోకొంత నిజం లేకపోలేదు. ఎందుకంటే ప్రకృతి సహజసిద్ధంగా దొరికేవాటిలో పోషక విలువలు పుష్కలంగా వుంటాయి. ప్యాకెట్లలో వచ్చేవి నిల్వబెట్టి రసాయనాలు కలిపి చివరికి చేవలేని పదార్థాల్లో వస్తుంటాయి. కనుక క్యాల్షియం కావాలంటే రాగి జావ తప్పక తీసుకోవాలి. అందులో ఏమున్నాయో తెలుసుకుందాం.
 
రాగులు అతి శక్తివంతమైనవి. రాగులు ఇతర ధాన్యాల కంటే బలవర్ధమైనవి. వీటిలో చాలా పోషక విలువలు ఉన్నాయి. రాగులను రోజువారి ఆహారంలో చేర్చుకొనడం వల్ల వృద్ధాప్య ఛాయలను దూరం చేసుకోవచ్చు. రాగులలో ఉండే విటమిన్లు వయసు మీద పడకుండా చేస్తాయి. రాగులలో వుండే ఎమినో యాసిడ్స్ త్వరగా ఆకలి వేయకుండా చేస్తాయి. శరీర బరువును నియంత్రిస్తాయి. దీనిలో ఉన్న ఫైబర్ కడుపు నిండినట్లు చేస్తాయి. అలాగే జుట్టు పెరుగుదలకు ఎంతగానో సహాయపడతాయి. 
 
నడి వయసు మహిళల్లో ఎముకలు పటుత్వం తగ్గుతుంది కాబట్టి ఈ రాగిజావ తీసుకోవడం వల్ల ఎముకలు పటిష్టంగా అవుతాయి. రాగులు నిద్రలేమి, ఆందోళన, మానసిక వత్తిడి లాంటి సమస్యలను దూరం చేస్తాయి. ఎక్కువగా శారీరక శ్రమ చేసేవారు రోజువారీ ఆహారంలో రాగులను చేర్చుకొనడం ద్వారా తక్షణ శక్తి వస్తుంది. 
 
అంతేగాక రాగులను తీసుకోవడం వల్ల శరీరానికి కావల్సినంత అయోడిన్, కాల్షియం పుష్కలంగా లభిస్తాయి. రాగులతో చేసిన ఏ ఆహారమైనా శరీరంలోని గ్లూకోజ్ స్థాయిలను క్రమబద్దీకరించి మధుమేహ వ్యాధిని తగ్గిస్తుంది. రాగుల జావ దప్పికను అరికడుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ప్రకాశం బ్యారేజీకి 3 లక్షల క్యూసెక్కులకు పైగా వరద నీరు.. అలెర్ట్

విద్యార్థికి అర్థనగ్న వీడియో కాల్స్... టీచరమ్మకు సంకెళ్లు

విధుల్లో చేరిన తొలి రోజే గుంజీలు తీసిన ఐఏఎస్ అధికారి (Video)

కోనసీమలో మూడు పడవలే.. వరదలతో ఇబ్బందులు.. నిత్యావసర వస్తువుల కోసం..

భార్యను వదిలి హిజ్రాతో సహజీవనం... ఎవరు ఎక్కడ?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కింగ్‌డమ్ విషయంలో పెద్ద ఛాలెంజ్ పరీక్షలో పాస్ అయ్యాము: సూర్యదేవర నాగ వంశీ

Sethupathi: సార్‌ మేడమ్‌ కోసం పరాటా చేయడం నేర్చుకున్నా : విజయ్ సేతుపతి

ప్రపంచంలో జరిగే బర్నింగ్ పాయింట్ నేపథ్యంగా థాంక్యూ డియర్

హిస్టారికల్ యాక్షన్ డ్రామా గా రిషబ్ శెట్టితో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ చిత్రం

చిరంజీవి విశ్వంభర చిత్రంలో ఐదుగురు హీరోయిన్లా? దర్శకుడు ఏమంటున్నారు

తర్వాతి కథనం
Show comments