Webdunia - Bharat's app for daily news and videos

Install App

భోజనాంతరం ఇలా చేస్తే.. ఏమవుతుందో తెలుసా..?

Webdunia
మంగళవారం, 5 మార్చి 2019 (10:09 IST)
మంచి పోషకాహారం తీసుకున్నాం అనుకుని.. ఆరోగ్యానికి ఢోకా లేదని మురిసిపోతే తగదు. భోజనం తరువాత అలవాటులో పొరపాటుగా చేసే కొన్ని పనులు కారణంగా ఆరోగ్యానికి హానికలిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలంటే వాటికి వీడ్కోలు పలకాల్సిందే..
 
భోజనం తిన్న వెంటనే టీ తాగితే జీర్ణమవదు. దాంతో తేయాకులో ఉండే ఆమ్లాలు ఆహారంలో మాంసకృత్తులను శరీరం వినియోగించుకోకుండా అడ్డుకుంటాయి. భోజనం చేసే ముందు.. లేదా చేశాక పండ్లు తినకూడదు. ఇలా తినడం వలన పొట్ట పెరుగుతుంది. కనుక రెండింటికీ మధ్య రెండు మూడు గంటల వ్యవధి ఉండేలా చూసుకోవాలి.
 
కొందరైతే తిన్న వెంటనే స్నానం చేస్తుంటారు. ఈ పద్ధతి మంచిది కాదంటున్నారు వైద్యులు. ఇలా చేయడం వలన కాళ్లు, చేతుల్లోకి రక్తప్రసరణ పెరుగుతుంది. దీనివలన పొట్ట చుట్టూ రక్తప్రసరణ తగ్గి జీర్ణవ్యవస్థ పనితీరు మందగిస్తుంది. 
 
అన్నం తిన్నాక అరవై అడుగులు వేస్తే నిండు నూరేళ్లు జీవిస్తారని చెప్తుంటారు. కానీ భోజనం చేయగానే నడిస్తే పోషకాలను గ్రహించడంలో జీర్ణవ్యవస్థ విఫలమవుతుంది. తప్పదనుకుంటే గంట తరువాత నడవండి. భోజనం తినగానే పక్కమీదకు చేరొద్దు. అలా నిద్రలోకి జారుకుంటే తిన్న ఆహారం జీర్ణమవ్వక ఇబ్బందులు తలెత్తుతాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

వివాహిత వద్దన్నా వదిలిపెట్టని ప్రియుడు, భార్యను చంపేసిన భర్త?

భర్త తాగుబోతు.. వడ్డీ వసూలు చేసేందుకు వచ్చిన వ్యక్తితో భార్య జంప్.. అడిగితే?

ఏపీ విభజన తర్వాత తెలంగాణ అప్పుల కుప్పగా మారింది

Pawan Kalyan: కుంభేశ్వరర్ ఆలయంలో పవన్ కల్యాణ్.. సెల్ఫీ ఫోటోలు వైరల్ (video)

లోక్‌సభలో కొత్త ఆదాయపన్ను బిల్లును ప్రవేశపెట్టిన కేంద్రం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాక్షస టైటిల్ సాంగ్ లాంచ్, రిలీజ్ డేట్ ఫిక్స్

రామ్ మధ్వాని ది వేకింగ్ ఆఫ్ ఎ నేషన్ సోనీ లివ్‌లో స్ట్రీమింగ్

29 మిలియన్ వ్యూస్‌తో నెం.1 ప్లేస్‌లో విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ టీజర్

బుక్ మై షోలో తల మూవీ టికెట్ ను కొన్న నాగార్జున

పవన్ కళ్యాణ్ బాగా ఎంకరేజ్ చేస్తారు.. ఆయన నుంచి అది నేర్చుకోవాలి : నిధి అగర్వాల్

తర్వాతి కథనం
Show comments