Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

సెల్వి
సోమవారం, 20 మే 2024 (18:06 IST)
రాత్రి భోజనం చేసిన తర్వాత ఈ పండ్లను తీసుకుంటే నిద్రలేమితో ఇబ్బంది పడాల్సి వుంటుందని వైద్యులు అంటున్నారు. పుచ్చకాయ లేదా సిట్రస్ పండ్లను రాత్రి నిద్రకు ఉపక్రమించేందుకు ముందు తీసుకున్నట్లైతే.. జీర్ణక్రియకు ఆటంకం తప్పదని వారు చెప్తున్నారు. 
 
ఈ పండ్లను తీసుకోవడం ద్వారా రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. ఇది నిద్రకు అంతరాయం కలిగిస్తుంది. మంచి నిద్రను ప్రోత్సహించడానికి మరియు యాసిడ్ రిఫ్లక్స్ ప్రమాదాన్ని తగ్గించడానికి మీరు పడుకునే ముందు నివారించవలసిన కొన్ని పండ్లను గురించి తెలుసుకుందాం. 
 
అరటిపండ్లు:
రాత్రిపూట అరటిపండ్లు తీసుకోకూడదు. ఇందులోని పిండి పదార్థాలు, పొటాషియంతో ప్యాక్ చేయబడిన ఈ పండ్లు.. వ్యాయామానికి తర్వాత తీసుకుంటేనే ఎంతో మేలు చేస్తుంది. రాత్రిపూట వాటిని మితంగా తీసుకోవడం వల్ల జీవక్రియను పునరుద్ధరించవచ్చు. తద్వారా శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. నిద్రలేమికి కూడా దారితీయవచ్చు.
 
పుచ్చకాయ:
పుచ్చకాయలో 92% నీటి శాతాన్ని కలిగి ఉంటుంది. అయినప్పటికీ, పడుకునే ముందు దాన్ని తీసుకుంటే.. మూత్రాశయం నిండిపోతుంది. ఫలితంగా బాత్రూమ్‌కి అనేకసార్లు వెళ్లడానికి కారణమవుతుంది. తద్వారా నిద్రకు భంగం కలిగించవచ్చు. అంతేకాకుండా, దాని సహజ చక్కెరలు రక్తంలో చక్కెర పెరుగుదలకు కారణమవుతాయి.
 
సిట్రస్ ఫ్రూట్స్:
రాత్రి భోజనం తర్వాత ద్రాక్ష లేదా నారింజ పండ్లను ఆరగించడం వల్ల నిద్రలేమి తప్పదు. సిట్రస్ పండ్లు అసిడిటీ, గుండెల్లో మంటను కలిగిస్తాయి. తద్వారా అసౌకర్యంగా, విశ్రాంతి లేకుండా చేస్తాయి.
 
జామ:
జామలో పీచుపదార్థం ఎక్కువగా ఉంటుంది. జామపండు రాత్రిపూట తీసుకుంటే గ్యాస్, అసౌకర్యానికి దారితీయవచ్చు. జీవక్రియ మందగించడంతో, జామపండ్లు జీర్ణం కావడానికి ఎక్కువ సమయం తీసుకుంటాయి. ఇది పొట్టలో తిమ్మిరిని కలిగిస్తుంది. ఈ పండ్లను ఉదయం, వ్యాయామం తర్వాత లేదా భోజన సమయంలో తీసుకోవచ్చు. 
 
మామిడి:
మామిడిని రాత్రిపూట తీసుకోకూడదు. ఇందులోని షుగర్ లెవల్స్ ఎక్కువగా వుండటంతో ఇవి రాత్రిపూట తీసుకుంటే.. శరీరంలో షుగర్ లెవల్స్ పెరిగిపోతాయి. 
 
ద్రాక్ష పండ్లు: 
ద్రాక్షలను రాత్రిపూట తీసుకోవడం ద్వారా వాటిలోని పోషకాలు, చక్కెర స్థాయిలు శరీరంలో చక్కెర శాతాన్ని పెంచేస్తాయి. అందుకే బెడ్ టైమ్‌కు ముందు తీసుకోకూడదు. 
 
బొప్పాయి :
బొప్పాయిలో పపైన్, ఎంజైములు జీర్ణవ్యవస్థపై ప్రభావం చూపుతాయి. ఇవి గుండెలో మంటకు కారణమవుతాయి. 
 
పైనాపిల్ :
పైనాపిల్‌లోని బ్రొమలైన్, ఎంజైమ్‌లు తీసుకుంటే కడుపు నొప్పి తప్పదు. అందుకే స్టొమక్ అప్సెట్ నుంచి తప్పించుకోవాలంటే రాత్రిపూట పైనాపిల్ తీసుకోకపోవడమే మంచిది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

కల్తీ పాల రాకెట్‌ను చేధించిన రాచకొండ పోలీసులు.. పాలపొడి హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి?

అమ్మాయిలా చాటింగ్ చేసి.. హోటల్ గదికి పిలిపించారు.. నగ్నంగా ఫోటోలు తీసి డబ్బులు వసూలు

Chandra Babu: టీచర్ అవతారం ఎత్తిన చంద్రబాబు నాయుడు.. క్లాసులో నారా లోకేష్

Karnataka: అరెస్ట్ భయంతో కుమారుడి ఆత్మహత్య - ఆ షాక్ తట్టుకోలేక గుండెపోటుతో తండ్రి మృతి

దోసె తింటున్న బసవయ్య.. రోజూ ఆ షాపుకు వస్తోంది.. వెయిట్ చేసి మరీ!? (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

తర్వాతి కథనం
Show comments