Webdunia - Bharat's app for daily news and videos

Install App

రక్తపోటు వున్నవారు గమనించాల్సిన విషయాలు

Webdunia
శుక్రవారం, 3 సెప్టెంబరు 2021 (20:22 IST)
అధిక రక్తపోటుతో బాధపడుతున్నారో వారు ఎట్టి పరిస్థితుల్లోనూ మద్యాన్ని తీసుకోరాదు. ఐతే కొద్ది మోతాదులో మద్యం సేవించడం వల్ల హృద్రోగ సమస్యలు రాకుండా నియంత్రించే అవకాశం ఉన్నప్పటికీ మద్యం ఎక్కువగా తీసుకుంటే అది ప్రాణానికే ముప్పు తెస్తుంది.
 
మద్యం తీసుకోవడం వల్ల అప్పటికే ఉన్న రక్తపోటు స్థాయిని మరింత పెంచేందుకు దోహదపడుతుంది. ఫలితంగా రక్తనాళాలు పాడైపోవడం జరుగుతుంది. దీనితో చికిత్స కూడా క్లిష్టతరంగా మారుతుంది. పరిస్థితి ఇలా ఉండటం వల్ల మరిన్ని సమస్యలు ఉత్పన్నమయ్యే పరిస్థితి ఉంటుంది. 
 
ఉప్పు తీసుకోవడం వల్ల కొందరిలో వెంటనే రక్తపోటు పెరిగిపోతుంది. ఐతే మరికొందరిలో అంతటి మార్పు కనబడదు. ఐతే బీపీ వున్నవారు ఉప్పు తీసుకోవడాన్ని ఖచ్చితంగా తగ్గించాల్సిందే. ఉప్పు తీసుకోవడం తగ్గించనట్లయితే రక్తపోటు పెరిగి అది గుండెపోటుకు దారితీసే అవకాశం ఉంటుంది.
 
కాబట్టి సోడియం స్థాయిని దాదాపు తగ్గించుకుంటే బీపీ రోగులకు ఎంతో శ్రేయస్కరం. ఎందుకంటే... ఒక స్థాయిని మించి రెండో స్థాయికి బీపీ చేరుకున్నదంటే అది మూత్రపిండాలను పాడు చేస్తుంది. కాబట్టి నియంత్రణ చాలా చాలా ముఖ్యం. తేలికగా తీసుకోరాదు.
 
కొవ్వు పదార్థాలను అధిక రక్తపోటు వున్నవారు దూరంగా పెట్టేయాలి. సాచ్యురేటెడ్ ఫ్యాట్, ట్రాన్స్-ఫ్యాట్లను ఖచ్చితంగా దూరంగా పెట్టేయాలి. ఇవి రెండూ గుండెకు, రక్త నాళాలను పాడు చేయడంలో ముందుంటాయి. ఎందుకంటే ఆల్రెడీ అధిక రక్తపోటు కారణంగా రక్త నాళాలు, గుండె ఎంతో ఒత్తిడికి గురై ఉంటాయి. ఈ స్థితిలో వాటిపై కొవ్వులు కూడా దాడి చేస్తే ఇక అన్నీ కలిసి ప్రాణం తీసేందుకు సిద్ధమైపోతాయి. ఫాస్ట్ ఫుడ్స్, ఎర్ర మాంసం, వేరుశనగ పప్పు నూనె, నేయి... తదితర కొవ్వు శాతం ఎక్కువగా ఉన్న పదార్థాలను తగ్గించాలి. అప్పుడే రక్తపోటును నియంత్రించవచ్చు.

సంబంధిత వార్తలు

అమలాపురం మహిళ కడుపులో 570 రాళ్లు.. అవాక్కైన వైద్యులు!!

జూన్ 4న వచ్చే ఫలితాలతో జగన్ మైండ్ బ్లాంక్ అవుతుంది : ప్రశాంత్ కిషోర్

జూన్ 8వ తేదీ నుంచి చేప ప్రసాదం పంపిణీ

బోలారం ఆస్పత్రి.. బైకులో కూలిన చెట్టు.. వ్యక్తి మృతి

తెలంగాణలో వర్షాలు.. అంటువ్యాధులతో జాగ్రత్త.. సూచనలు

బులుగు రంగు చీరలో మెరిసిన జాన్వీ కపూర్

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘కన్నప్ప టీం సందడి- ఆకట్టుకున్న కన్నప్ప టీజర్

భవితను మార్చిన వ్యక్తి కథతో విజయ్ ఆంటోనీ తుఫాన్ రాబోతుంది

అనుష్క, విజయశాంతి లతో మూవీ చేస్తానంటున్న నిర్మాత ఎస్ కే బషీద్

బెంగళూరు రేవ్ పార్టీ.. ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలు

తర్వాతి కథనం
Show comments