Webdunia - Bharat's app for daily news and videos

Install App

తొలకరితో పాటు వచ్చే సీజనల్ వ్యాధులు చికున్ గున్యా, డెంగ్యూ ఇంకా...

Webdunia
బుధవారం, 15 జూన్ 2022 (23:48 IST)
రుతు పవనాలు తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశించాయి. వాన చినుకులు అక్కడక్కడా పడుతున్నాయి. ఐతే ఈ వర్షం కారణంగా కొన్ని ప్రదేశాలలో నీరు నిండి ఉంటుంది. వాతావరణం చల్లగా, తేమగా మారుతుంది. ఇది బ్యాక్టీరియా వృద్ధికి అనుకూలంగా ఉంటుంది. అటువంటి పరిస్థితిలో, దానితో పాటు వచ్చే వ్యాధుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. వర్షాకాలం వల్ల వచ్చే వ్యాధులు ఏమిటో తెలుసుకుందాం.

 
దోమల వల్ల చికున్ గున్యా వస్తుంది. ఇది కీళ్లలో తీవ్రమైన నొప్పిని కలిగిస్తుంది. ఇది ఎల్లో ఫీవర్ దోమల ద్వారా మాత్రమే వ్యాపిస్తుంది. అలాగే టైఫాయిడ్. ఇది వర్షాకాలంలో వచ్చే సాధారణ వ్యాధి. ఇది నీటి వల్ల లేదా కలుషితమైన, అపరిశుభ్రమైన ఆహారాన్ని తీసుకోవడం వల్ల వస్తుంది. ఇది సాల్మొనెల్లా టైఫీ అనే బ్యాక్టీరియా ద్వారా వ్యాపిస్తుంది. ఇందులో జుట్టు రాలడం, బరువు తగ్గడం, కండరాల బలహీనత వంటివి ఉండవచ్చు. శరీరంలో అధిక జ్వరం, తలనొప్పి, ఇన్ఫెక్షన్ ఉంటాయి.

 
వైరల్ జ్వరం, దీనిని సీజనల్ ఫీవర్ అని కూడా అంటారు. వాతావరణంలో మార్పుల కారణంగా ఇది జరుగుతుంది. ప్రధానంగా వ్యాధినిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు దీని బారిన పడుతున్నారు. దీని ప్రధాన లక్షణాలు జలుబు-దగ్గు, తరచుగా తుమ్ములు, తలనొప్పి. అలాగే డెంగ్యూ వ్యాధి దోమలు కుట్టడం ద్వారా వ్యాపిస్తుంది. దీని దోమ స్పష్టమైన, లోతైన నీటిలో సంతానోత్పత్తి చేస్తుంది. ఈ దోమకు చారలు ఉంటాయి. ఈ దోమ కాటు వల్ల కీళ్ల నొప్పులు, ప్లేట్‌లెట్స్ పడిపోవడం, బలహీనత ఏర్పడతాయి.

 
దోమల వల్ల మలేరియా వ్యాపిస్తుంది. ఇది ఆడ అనాఫిలిస్ దోమ కాటు ద్వారా వ్యాపిస్తుంది. వర్షాల సమయంలో ఈ దోమలు పుట్టే ప్రదేశాల్లో నీరు నిండుతుంది. ఈ నీటిలో పుట్టిన దోమ కాటుతో జ్వరం వచ్చి దేహం అంతా వణికిపోతుంటుంది. కండరాల బలహీనత కూడా కనబడుతుంది. కలరా వ్యాధి. ఇది వర్షాకాలంలో భోజనం చేసేటప్పుడు, తాగేటప్పుడు కలుషిత పదార్థాలను తినడం ద్వారా వ్యాపిస్తుంది. దీని బ్యాక్టీరియా మురికి నీటిలో వృద్ధి చెందుతుంది. ఇది కడుపు నొప్పి, తరచుగా వాంతులు, విరేచనాలు నీరు కోల్పోవడం జరుగుతుంది.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments