Webdunia - Bharat's app for daily news and videos

Install App

అల్జీమర్ వ్యాధితో అవస్థలే.. ఈ వ్యాధి రాకుండా ఉండాలంటే....

అల్జీమర్స్ ఎక్కువగా వయసు పైబడుతున్న వారిలో కనిపించే వ్యాధి. జ్ఞాపకశక్తి తగ్గిపోవడం దీని ప్రధాన లక్షణం. పరిచయస్తులు ఎదురుగా ఉన్నప్పటికీ, వారిని గుర్తుపట్టలేని స్థితి. అలాగే, కొన్ని క్షణాల క్రితమే తమ చేతిలోని వస్తువును ఎక్కడ పెట్టారో కూడా గుర్తు రాని ప

Webdunia
గురువారం, 22 సెప్టెంబరు 2016 (17:57 IST)
అల్జీమర్స్ ఎక్కువగా వయసు పైబడుతున్న వారిలో కనిపించే వ్యాధి. జ్ఞాపకశక్తి తగ్గిపోవడం దీని ప్రధాన లక్షణం. పరిచయస్తులు ఎదురుగా ఉన్నప్పటికీ, వారిని గుర్తుపట్టలేని స్థితి. అలాగే, కొన్ని క్షణాల క్రితమే తమ చేతిలోని వస్తువును ఎక్కడ పెట్టారో కూడా గుర్తు రాని పరిస్థితి. ఈవేళ ప్రపంచంలో ఎంతోమంది ఈ వ్యాధి బారిన పడుతున్నారు. అయితే, ఈ అల్జీమర్స్‌కీ, ఒత్తిడికీ అవినాభావ సంబంధముందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అల్జీమర్ ఏ వయసులోనైన రావచ్చు. 
 
చాలామంది వయసు మళ్ళిన వారిలో ఉన్న ఆలోచన ఏమిటంటే, ఈ వ్యాధి మన జీవితాన్ని తలకిందులు చేస్తుందని. వృద్ధాప్యంలో మతిమరుపు వచ్చిందంటే తమకు ఆల్జీమర్స్‌ వ్యాధి వచ్చిందేమోనని భయపడతారు. నిజానికి మతిమరుపులన్నీ అల్జీమర్స్‌ వ్యాధికి దారి తీయవు. సంబంధిత విషయంపై ఆసక్తిలేకపోయినా మతిమరుపు రావచ్చు. మతిమరపునకు చాలా కారణాలు దోహదం చేస్తాయి. ఉదాహరణకు పక్షవాతం, మెదడులో గడ్డలు, రక్తస్రావం వంటివి. అయితే రోగికి వచ్చిన మతిమరుపు అన్నది అల్జీమర్ కారణంగానేనని నిర్ధారణ చేయడం ఒకింత కష్టమైన పనే. దీనికి సిటి స్కాన్, ఎమ్మారై(బ్రెయిన్)వంటి పరీక్షలు దోహదపడుతాయి. ఇందులో మెదడు కుచించుకుపోయినట్లుగా కనిపించడాన్ని బట్టి అల్జీమర్స్‌గా గుర్తించవచ్చు.
 
అల్జిమర్ ఎక్కువగా వంశపారంపర్యంగా సంక్రమిస్తుంది. 60 ఏళ్ల పైబడిన వారికి, 90 కిలోల బరువు ఉన్న వారికి ఈ వ్యాధి వస్తుంది. వ్యాధి మొదటి స్టేజీలో ఉన్నప్పుడే గుర్తించి వారికి ఆటలు, సోషల్ యాక్టివిటీస్‌ చేయించాలి. మంచి పోషకహారాన్ని అందిస్తే కొంత మేర మార్పు చేయవచ్చు. పక్షవాతాన్ని డయాబెటిస్‌ను నివారించడానికి అనుసరించే సాధారణ జీవనశైలి సూచనలే అల్జీమర్స్‌ను నివారిస్తాయి. వ్యాయామంతో 70-80 ఏళ్ల వయస్సు వచ్చినా సరే ఉల్లాసంగా ఉండొచ్చు. వారానికి 5 సార్లు 20 నుంచి 40 నిముషాలు నడిచేవాళ్లు చాలా ఆరోగ్యంగా ఉంటారు. పొగ, మద్యం తాగడం పూర్తిగా మానివేయాలి. ఎక్కువగా పండ్లు, చిరుధాన్యాలు, ఆకుకూరలు మెదడుకు చురుకుదనాన్ని ఇస్తాయి.
 
బ్లూ బెర్రీలు జ్ఞాపకశక్తిని పెంచడంతో బాటు ఇందులోని యాంటీఆక్సిడెంట్లు మెదడుకు సరిగా రక్తం సరఫరా అయ్యేలా చేసి చురుగ్గా పని చేసేలా చేస్తాయి. సాల్మన్ చేపలు - ఇందులోని ఒమెగా ఫ్యాట్స్ బ్రైస్ పవర్ పెంచి అల్జీమర్ వ్యాధి రాకుండా నివారిస్తాయి. అవిసె గింజలు: ఏయల్‌ఏ అనే ఆరోగ్యకరమైన కొవ్వులు సెన్సరీ సందేశాలను మెదడుకు చేర్చి మెదడుకు పదును పెడతాయి. కాఫీ-కెఫీన్‌ను మితంగా తీసుకుంటే మతిమరుపును పోగొట్టి అల్జీమర్ వ్యాధి రాకుండా చేయడమే కాక అందులోని యాంటీ ఆక్సిడెంట్లు మెదడును చురుకుగా పనిచేసేలా చేస్తాయి. మిశ్రమ నట్స్ - వేరుశనగ గింజలు, ఆక్రోట్, బాదం లాంటి నట్స్ నిద్రలేమిని పోగొట్టి జ్ఞాపకశక్తిని పెంచుతాయి. ఏపిల్ జ్యూస్ "జ్ఞాపక రసాయనం" అసిటిల్కోలిన్ ఉత్పత్తిని పెంచుతుంది. చాకొలెట్ చాలా రుచికరమైన బ్రెయిన్ ఫుడ్. ముదురు రంగులోని చాకోట్‌లోని యాంటీఆక్సిడెంట్లు ఏకాగ్రతని, అవగాహనా శక్తిని పెంచి విద్యార్థులలో స్పందన, గ్రాహ్యక శక్తిని కూడా పెంచుతుంది.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

Hyderabad: రూ.1.20 లక్షలు లంచం తీసుకుంటూ పట్టుబడిన స్వరూప

Phone Tapping: ఫోన్ ట్యాపింగ్ కేసుపై విచారణ.. 600మంది బాధితులా? (video)

Divvala Madhuri: రోజా రీల్స్ చేయట్లేదా? వైకాపా గాలిపార్టీ.. ఫైర్ అయిన దివ్వెల మాధురి

Soap: భార్య సబ్బును వాడిన భర్త.. చివరికి జైలు పాలయ్యాడు.. ఎక్కడో తెలుసా?

పెళ్లైన పది రోజులకే ప్రియుడితో భార్య జంప్.. హమ్మయ్య అంటూ ఊపిరి పీల్చుకున్న భర్త!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా రిజల్ట్ తర్వాత సమీక్షించుకుని తర్వాత డిసైడ్ చేసుకుంటా : డైరెక్టర్ ఫణీంద్ర నర్సెట్టి

విజయ్ సేతుపతి, సంయుక్త జంటగా పూరి జగన్నాథ్ చిత్రం

తమ్ముడు నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ భూ అంటూ భూతం.. రిలీజ్

టైటిల్ & ఫస్ట్ లుక్ త్వరలో విడుదల కానున్న రవితేజ 76వ చిత్రం

సుహాస్‌ చిత్రం ఓ భామ అయ్యో రామ లో దర్శకుడు హరీష్ శంకర్

తర్వాతి కథనం
Show comments