Webdunia - Bharat's app for daily news and videos

Install App

మధుమేహ రోగులు : ఆహార నియమాలు

Webdunia
మధుమేహంతో బాధపడే రోగులు ఖచ్చితంగా ఆహార నియమాలను పాటించి తీరాలి. అప్పుడే వారి ఆరోగ్యం బాగుంటుంది. ఈ వ్యాధిబారినపడినవారు ఆహార నియమం గురించి పడే తపన అంతా ఇంతా కాదు. దీనికి పడే ఒత్తిడి వారిలో అధికంగా ఉంటుంది. దీనికి ముందుగానే ఆహార నియమం కోసం కొన్ని ప్రణాళికలను ముందుగానే తయారు చేసుకుంటే చాలా మంచిది. అలాంటి ప్రణాళికా నియమాలు ఇలా ఉండాలంటున్నారు వైద్యులు.

ఉదయం 6 గంటలకు : అర చెంచా మెంతి పొడిని నీటిలో కలిపి సేవించండి.

ఉదయం 7 గంటలకు : టీ తాగే అలవాటుంటే చక్కెర లేని టీతోబాటు రెండు మేరీ బిస్కత్తులు తీసుకోండి.

ఉదయం 8.30 గంటలకు : ఒక ప్లేటు ఉప్మా లేదా గోధుమ రవ్వతో చేసిన ఉప్మాతోబాటు అరకప్పు మొలకెత్తిన విత్తనాలు, 100 మిల్లీలీటర్ల చక్కెరలేని పాలను ఆహారంగా తీసుకోండి.

ఉదయం 10.30 గంటలకు : ఒక 50గ్రాములున్న పండు లేదా 1 కప్పు పలుచటి మజ్జిగ లేదా చక్కెర లేకుండా నిమ్మకాయ రసంను సేవించండి.

మధ్యాహ్నం భోజనం 12.30 గంటలకు : రెండు చపాతీలు, ఒక కప్పు గంజి తీసివేసిన అన్నం, ఒక కప్పు పప్పు, ఒక కప్పు పెరుగు, అర కప్పు సోయాబీన్ లేదా పనీర్, అరకప్పు ఆకుకూరతోబాటు సలాడ్ ఒక కప్పును ఆహారంగా తీసుకోవాలంటున్నారు వైద్యులు.

సాయంత్రం 4 గంటలకు : ఒక కప్పు చక్కెర లేని టీతోబాటు రెండు మేరీ బిస్కత్తులు ఆహారంగా తీసుకోవాలి.

సాయంత్రం 6 గంటలకు : ఒక కప్పు సూపు తీసుకోండి.

రాత్రి భోజనం 8.30 గంటలకు : మధ్యాహ్నం తీసుకున్న ఆహారం మాదిరాగానే రాత్రిపూటకూడా ఆహారం తీసుకోవాలి.

రాత్రి పడుకునే సమయంలో 10.30 గంటలకు : ఒక కప్పు చక్కెర లేని పాలు సేవించండి.

ఒక్కసారిగా ఆహారాన్ని సమపాళ్ళల్లో తీసుకోవడం మొదలు పెట్టిన తర్వాత విపరీతంగా ఆకలి వేస్తుంటుంది. అలా ఆకలి వేస్తే ఈ సూత్రాలు పాటించండి.

పచ్చి కూరగాయలు సలాడ్‌గా తీసుకోండి. బ్లాక్ టీ, సూప్, పలుచటి మజ్జిగ, నిమ్మకాయ రసం సేవిస్తుండండి. ఇందులో ముఖ్యంగా చక్కెర, బెల్లం, తేనె, తీపి పదార్థాలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments