Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాలుష్యంతో నగర జీవి మెదడుకు దెబ్బే..!

Webdunia
శుక్రవారం, 31 అక్టోబరు 2014 (18:33 IST)
దేశంలో గ్రామీణ ప్రాంతాలు పట్టణ ప్రాంతాలుగానూ, పట్టణ ప్రాంతాలు నగరాలుగానూ, నగరాలు మహా నగరాలు గానూ దినదినాభివృద్ధి చెందుతున్నాయి. ఈ అభివృద్ధి మంచిదే. అయితే, జనాభా పెరుగుతున్న కొద్దీ కాలుష్యం కూడా భారీగా పెరిగిపోతుంది. గాలితో పాటు నీరు కలుషితం కావడంతో పాటు భూ పర్యావరణం (గ్లోబర్ వార్మింగ్) సైతం వేడెక్కిపోతోంది. 
 
ముఖ్యంగా నగరాల్లో కాలుష్య ప్రభావం అంతా ఇంతా కాదు. అందుకే నగర వాసులు గాలి కాలుష్యంతో జాగ్రత్తగా ఉండాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. గాలి కాలుష్యంతో మెదడుకు దెబ్బేనని తాజాగా నిర్వహించిన అధ్యయనంలో తేలింది. ముఖ్యంగా గాలి కాలుష్యంతో మెదడుకు సంబంధిత వ్యాధులు, జ్ఞాపకశక్తి కోల్పోవడం వంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. 
 
ఎలుకలపై నిర్వహించిన టెస్టుల్లో కలుషితమైన గాలిని పీల్చడంలో శారీరకంగా కొన్ని మార్పులు చోటు చేసుకోవడంతో పాటు, మెదడు సంబంధించి నెగటివ్ ఫలితాలు వచ్చాయని ఓహియో స్టేట్ యూనివర్శిటీ స్టడీలో తేలింది. గాలి కాలుష్యంతో గుండె, ఊపిరితిత్తులకు ప్రమాదమని ఇంతకుముందు నిర్వహించిన సర్వేలో తేలగా, మొట్టమొదటి సారిగా గాలి కాలుష్యంతో మెదడుకు సంబంధిత వ్యాధులు సోకుతాయని తేలింది. పట్టణ ప్రాంతాల్లో అధిక సంఖ్యలో బసచేసే వారికే గాలి కాలుష్యంతో ప్రమాదం ఎక్కువని ఫాకెన్ చెప్పారు. 

తాడిపత్రి నుంచి జేసీ ప్రభాకర్ రెడ్డిని బలవంతంగా తరలించారు!!

బాలికలతో వ్యభిచారం.. డీఎస్పీ సహా 21 మంది అరెస్టు

ఏపీలో పోలింగ్ తర్వాత హింస : సీఎస్‌పై ఈసీ ఆగ్రహం... ఓట్ల లెక్కింపు తర్వాత కూడా భద్రత కొనసాగింపు..

చిన్నారి చేతి వేలికి ఆపరేషన్ చేయమంటే.. నాలుకకు చేసిన వైద్యుడు... ఎక్కడ?

అమెరికా రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయ విద్యార్థుల మృతి.. తెలుగమ్మాయి..?

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

Show comments