Webdunia - Bharat's app for daily news and videos

Install App

అధిక కొవ్వుతో మెదడుకు ముప్పు!!

Webdunia
శనివారం, 25 ఫిబ్రవరి 2012 (11:12 IST)
కొవ్వు అధికంగా ఉండే ఆహారాన్ని తినడం వల్ల మెదడు దెబ్బతినే ప్రమాదం ఉందా? అవుననే అంటున్నాయి తాజా వైద్య పరిశోధనలు. కొవ్వు అధికంగా ఉండే ఆహార పదార్థాలు తీసుకోవం వల్ల మెదడులోని ఒక ప్రాంతం దెబ్బతినే ప్రమాదం ఉందని యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ జరిపిన ఒక అధ్యయనంలో వెల్లడైనది.

కొవ్వు అధికంగా ఉన్న ఆహారాన్ని తిన్న జంతువులకు తినాలన్న కోరికను నియంత్రించే మెదడులోని హైపోథలమస్ అనే ప్రాంతంలో చచ్చుపడిపోయింది. ఆకలి తీరిన తర్వాత తినడం ఆపేయాలన్న ఆ జంతువులో నశించినట్లు వైద్య పరిశోధనలో వెల్లడైంది. ఇవే లక్షణాలను కొందరు మనుషులపై ప్రయోగించినప్పుడు కూడా కనిపించినట్లు పరిశోదకులు తెలిపారు.

కొవ్వు అధికంగా ఉండే ఆహారాన్ని తిన్న కొందరికి 24 గంటల్లో మెదడులోని హైపోథలమస్ ప్రాంతం చచ్చుపడిపోయినట్లు వారు చెప్పారు. దీన్ని బట్టి చూస్తే కొవ్వు ఎక్కువుగా ఉండే ఆహారాన్ని తినడం వల్ల శరీరంలోని కొన్ని అవయవాలలో వాపు ఏర్పడుతుంది. ఇది అలర్జీలో ఏర్పడే వాపులు వంటివి కావని పరిశోధకులు చెబుతున్నారు. మెదడులోని హైపోథలమస్ ప్రాంతంలో వాపులాంటిది ఏర్పడితే తాము ఎంత తింటున్నామో గ్రహించే శక్తిని కోల్పోతారని, కడుపు నిండిన తర్వాత కూడా తినాలన్న కాంక్ష వారిలో పోదని వైద్య పరిశాదకులు తెలిపారు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

కొడుకా... రూ.100 కోట్లు రాసిపెట్టాను.. లేవరా.... (Video)

ఆ మహిళ చనిపోయింది... ఆ తర్వాత తాను పొందిన అనుభవాన్ని వెల్లడించింది...

యేడాదికి రూ.20 లక్షలు సంపాదిస్తున్నా... ఓ ఇంటిని కొనుగోలు చేయలేకపోయా!

శ్రేయాస్ అయ్యర్‌ను పెళ్లి చేసుకున్న ఎడిన్ రోజ్!

బంధువుల ఇంటికి వెళ్లిన చిన్నారి శవమై కనపించింది... ఎలా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ చిత్రం సోలో బాయ్ విడుదలకు సిద్ధం

Show comments