ఏడాదికి 5 శాతమే వర్షపాతం.. కానీ 70 శాతం నీరు నిల్వవుండే ఖండమేది?

Webdunia
బుధవారం, 29 అక్టోబరు 2014 (17:45 IST)
భూగోళంపై మూడొంతుల నీరు.. ఒక వంతు భూమి ఉంటుందన్నది మనకు తెలుసు. కానీ, భూగోళం మొత్తంమీద ఉండే నీటిలో 70 శాతం నిల్వవుండే ఖండమేదో చాలా మందికి తెలియదు. ఈ ఖండంలో నీరు అన్ని కాలాల్లో గడ్డకట్టే ఉంటుంది. పైగా.. ఒక యేడాదిలో కేవలం 5 శాతం మాత్రమే వర్షపాతం నమోదవుతుంది. ఇక్కడ చినుకు పడిన వెంటనే అది గడ్డకట్టి పోతుంది. అందుకే ఇక్కడ నీటి నిల్వలు పుష్కలంగా ఉంటుంది. ఆ ప్రాంతమే అంటార్కిటికా ఖండం. ఇది భూగోళానికి దక్షిణ ధృవాన్ని ఆవరించి వుంది. 
 
ఈ ఖండం అంతటా మంచుతో కప్పబడి ఉంటుంది. ఇక్కడ పడే వర్షపాతం సహారా ఎడారి కంటే తక్కువ. మన భూగోళంపై ఉండే అతి చల్లటి ప్రదేశాల్లో ఇది మొదటి వరుసలో ఉంటుంది. ఇక్కడ ఉష్ణోగ్రతలు మైనస్ 89 (-89) డిగ్రీల సెల్సియస్. 
 
సాధారణంగా నీరు మంచుగా మారే ఉష్ణోగ్రత 0 డిగ్రీల సెల్సియస్. దీని కంటే 89 డిగ్రీల సెల్సియస్ తక్కువ ఉష్ణోగ్రత ఈ ఖండంపై నమోదవుతుంది. దీంతో ఈ ఖండం అంతటా మంచుతో కప్పబడి ఉంటుంది. ఈ కారణంగానే ఈ ఖండాన్ని గడ్డగట్టిన ఎడారి అని కూడా పిలుస్తారు. 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఓటు వేసి గెలిపిస్తే థాయ్‌లాండ్ ట్రిప్ - పూణె ఎన్నికల్లో అభ్యర్థుల హామీలు

దేశం మెచ్చిన నాయకుడు వాజ్‌పేయి : సీఎం చంద్రబాబు

నిన్ను పెళ్లి చేసుకోవడానికి సిద్ధమే.. కానీ కట్నంగా పాకిస్థాన్ కావాలి...

క్రిస్మస్ వేడుకల్లో ప్రధాని మోడీ... యేసు బోధనలు శాశ్వత శాంతిని నెలకొల్పుతాయి..

మందుబాబులకు సీపీ సజ్జనార్ వార్నింగ్.. డ్రంకెన్ డ్రైవ్‌లో పట్టుబడితే జైలుకే...

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

షూటింగులో 'జైలర్' విలన్‌కు గాయాలు

'జైలర్-2'లో బాలీవుడ్ బాద్ షా?

నేను ఫిట్‌గా గ్లామరస్‌గా ఉన్నాను : నటి అనసూయ

మహిళల దుస్తులు, ప్రవర్తనపై వేలెత్తి చూపడం నేరాలను ప్రోత్సహించినట్టే : చిన్మయి

'శంబాల' గ్రామంలో మిస్టీరియస్ మరణాల మర్మమేంటి? (మూవీ రివ్యూ)

Show comments